అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today October 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  గేటు దగ్గర ఆరు ఆత్మను కాపలా పెట్టిన ఘోర – లోపల పూజను చులకనగా మాట్లాడిన మనోహరి

Nindu Noorella Saavasam Today Episode:  ఆరు ఆత్మను గేటు దగ్గర కాపలాగా పెట్టి ముత్తైదువలు ఎవరూ భోజనానికి వెళ్లకుండా ఘోర చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఘోర, అమర్‌ ఇంటికి వస్తాడు. మనోహరి తిడుతుంది. అమర్‌ చూస్తే మనల్ని చంపేస్తాడు అంటుంది. ఇంట్లో భోజనాలు చేయడానికి ఇంట్లోకి ఎవ్వరూ రాకుండా ఆత్మ చేతనే ఆపేస్తానంటాడు ఘోర.

ఘోర: ఇవాళ నీకోసం చేస్తున్న అమ్మవారి దీక్షకు అడ్డుపడి కొంచెం పాపం మూటకట్టుకో..

ఆరు: వద్దు దీక్షకు బంగం కలిగించి నువ్వేం సాధించలేవు. అమ్మవారు చూస్తూ ఊరుకోరు.

అనగానే ఘోర మంత్రం చదివి ఆరును బయటకు పంపిస్తాడు. గేటు ముందు ఆత్మ నిలబడుతుంది. ఆ ఆత్మను దాటుకని ఎవ్వరూ లోపలకి వెళ్లరు మనోహరి. అని చెప్పగానే మనోహరి సరేనని లోపలికి వెళ్తుంది. లోపల భోజనాలు రెడీ చేసి అతిథుల కోసం ఎదురుచూస్తుంటారు. భోజనానికి ఎవరూ రారు.  బయట గుప్త.. ఘోర చేసిన పని చూసి షాక్‌ అవుతుంటాడు. భోజనానికి వచ్చిన ముత్తైదువలు గేటు దగ్గరకు వచ్చి వెళ్లిపోతుంటారు.

భాగీ: అదేంటండి. ఇంటికి వెళ్లి మరీ భోజనానికి పిలిస్తే ఒక్కరూ కూడా రావడం లేదేంటి..?

మనోహరి: రావడం ఇష్టం లేదేమో.. రారేమో..

నిర్మల: శుభమాని పూజ చేస్తుంటే ఏంటమ్మా ఆ మాటలు..

మనోహరి: ఆంటీ నేనేం తప్పుగా అనడం లేదు. పూజను లాస్ట్‌ మినిట్‌ లో అనుకున్నారు అందరికీ లాస్ట్‌ మినిట్‌ లో చెప్పారు. అందుకే రారేమో అన్నాను. అయినా మనసు బాగాలేదని దీక్షలు చేస్తే ఇలాగే ఉంటుంది. నాకు తెలిసి ఈ దీక్ష ఇంతటితో ఆపేస్తే మంచిది అనిపిస్తుంది. ఏంటి మిస్సమ్మ అలా చూస్తున్నావు. నేను నీ మంచి కోసమే.. అదే ఈ ఇంటి కోసమే చెప్తున్నాను.

నిర్మల: మనోహరి చెప్తున్నది కూడా నిజమే కదమ్మా.. భోజనానికి ఎవ్వరూ రాకపోతే ఇంటికి అరిష్టమేమో..

రాథోడ్‌: మిస్సమ్మ నువ్వేం బాధపడకు. నువ్వు ఎవరెవరిని పిలిచావో వాళ్లన నేను వెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను.

 అని రాథోడ్ వెళ్లిపోతాడు. భాగీ అమ్మవారి దగ్గరకు వెళ్లి బాధగా ప్రార్థిస్తుంది. భాగీ పక్కన అమర్‌ పిల్లలు కూడా వచ్చి కూర్చుని అమ్మవారిని ప్రార్థిస్తుంటారు.

శివరాం: మిస్సమ్మ మనసులో గట్టిగా సంకల్పించుకుంటే ఈ దీక్ష పూర్తి అవ్వడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి.

గుప్త: జగన్నాథ కళ్ల ముందే ఇంత ఘోరమూ ఇంత అన్యాయమూ జరగుతుంటే నేను చూడలేకపోతున్నాను. దయచేసి ఈ ఒక్కసారి ఈ ఘోరాన్ని ఆపే శక్తిని ఇవ్వు జగన్నాథ

 అని గుప్త కోరుకోగానే దేవుడు గుప్తకు శక్తులు ఇస్తాడు. లోపల అందరూ అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. తనకు వచ్చిన శక్తులతో ఘోర వేసిన బంధనాన్ని పటాపంచలు చేసి గుప్త లోపలికి వెళ్తాడు. లోపల మనోహరి భాగీని చులకనగా మాట్లాడుతుంది.

మనోహరి: దండం పెట్టుకున్నా.. దయ చూపించమని అడిగినా ఫలితం లేకుండా పోయింది. ఆంటీ ఇంకా ఎంత సేపని ఇలా ఉంటాము. వెంటనే దీక్షను విరమించడం బెటర్‌.

అని మనోహరి చెప్పగానే అందరూ బాధగా చూస్తుంటారు. ఇంతలో గుప్త వెనకాల ముత్తైదువలు వస్తుంటారు. ఇంతలో గుప్త మాయం అయిపోతాడు. ఇంట్లోకి వస్తున్న ముత్తైదువులకు బయటకు వెళ్లి కాళ్లకు పసుపురాసి లోపలికి తీసుకెళ్తుంది. మరోవైపు లోపల కూరల్లో ఉప్పు ఎక్కువగా కలుపుతుంది మనోహరి. ఇంతలో అందరూ లోపలికి వచ్చి భోజనం చేస్తుంటారు. మొదటగా భోజనం చేసిన ఆవిడ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని అదో రకంగా చూస్తుంది.

మనోహరి: ఏంటి బామ్మగారు ముద్దు నోట్లో పెట్టగానే ముఖం అలా పెట్టారు. ఏం బాలేవా..?

బామ్మ: అన్ని చక్కగా సరిపోయాయి అమ్మా.. ఇంత చక్కగా కుదిరిన వంటను ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడూ తినలేదు. నువ్వు ఏ కోరికతో దీక్ష చేపట్టావే తెలియదు కానీ అది మనఃస్పూర్తిగా జరగాలని కోరుకుంటున్నాను.

గుప్త: మానవునికి మాధవుడు తోడైతే ఎలా ఉంటుందో  ఈ బాలికకు భోధపడుతుందని నేను అనుకుంటున్నాను.

అందరూ హ్యాపీగా ఫీలవుతుంటారు. మనోహరి మాత్రం ఇరిటేటింగ్‌ గా ఫీలవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget