Jagadhatri Serial Today April 29th:జేడీ,కేడీ ఎవరో కనిపెట్టిన అవినాష్...మంత్రి కొడుకును ఎన్కౌంటర్ చేయమని ఆదేశించిన సాధూ..
Jagadhatri Serial Today Episode April 29th: జేడీ,కేడీ ఎవరో కనిపెట్టిన అవినాష్...మంత్రి కొడుకును ఎన్కౌంటర్ చేయమని ఆదేశించిన సాధూ..

Jagadhatri Serial Today Episode: జేడీ,కేడీ ఎవరో కనిపెట్టిన మంత్రి కుమారుడు అవినాష్వాళ్లను వెంబడిస్తూ ఇంటి వరకు వచ్చేస్తారు. అంటే జేడీ ఏం చేస్తుందో కూడా ఇంట్లో చెప్పలేదని అవినాష్ తెలుసుకుంటాడు.ముందు ఇంట్లోకి వెళ్లి వీళ్లు ఎవరో ఏంటో కనుక్కోవాలని అనుకుంటారు. ఇంటర్నెట్ వైర్ కట్చేసి టెక్నిషియన్లుగా ఇంట్లోకి ప్రవేశిస్తారు.అప్పుడే అక్కడ నిషిక చీర మార్చుకుంటుంటే అవినాష్చూడటంతో నిషికకు కోపం వచ్చి చెంప పగులగొడుతుంది. పొరపాటున వచ్చామని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చినా....ఆ నిషికను వదిలిపెట్టేది లేదని అవినాష్ అంటాడు. ఇంతలో సాధూ ఫోన్ చేసి మినిష్టర్ నుంచి ఒత్తిడి వస్తోందని....వాళ్ల అబ్బాయి కేసు మీరు పర్సనల్గా తీసుకుని ఢీల్ చేస్తున్నారని మండిపడుతున్నట్లు చెబుతాడు.వాడిపై నేరం నిరూపించేలా మీరు ఖచ్చితంగా ఆధారాలు సంపాదించాలని చెబుతాడు. దీనికి జేడీ,కేడీ సరేనని అంటారు.
సుధాకర్కు ఆస్తమా ఎక్కువై కిందపడిపోవడంతో చిలకమ్మ ఆయనకు వేడినీళ్లలో పసుపు వేసి ఊపిరి పీల్చమని చెబుతుంది. దుప్పటి ముసుగు వేసి అందులోకి చిలకమ్మ కూడా దూరి దగ్గర ఉండి గాలి పీల్చమని అంటుంది.ఇదంతా చూసిన వైజయంతి మొగుడిపై మండిపడుతుంది. నువ్వు ఆ చిలకమ్మతో సరసాలు ఆడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ఇది గమనించిన జగధాత్రి...విషయం రాగిణికి చెప్పి జాగ్రత్తగా ఉండమని చెబుతుంది.నీమీద అత్తయ్యకు అనుమానం వచ్చిందని....నిన్ను ఓ కంట కనిపెడుతూ ఉంటుందని చెబుతుంది.ఇక నుంచి నువ్వు సుధాకర్ మామయ్య విషయంలో జోక్యం చేసుకోవద్దని చెబుతుంది. దీనికి చిలకమ్మ సరేనని అంటుంది.
Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి మారిపోయాడా! సహస్రతో హ్యాపీగా ఉంటాడా! ఛైర్మన్ పదవి కోసం అంబిక మాస్టర్ ప్లాన్!
అవినాష్ దగ్గర నుంచి జగధాత్రికి ఫోన్ వస్తుంది. నేను ఎవరో నీకు తెలియకపోయినా నీలో ఉన్న జేడీకి తెలుసంటూ చెప్పడంతో జగధాత్రి, కేదార్ షాక్ తింటారు.నువ్వు ఎవరో కనిపెట్టేశానని మర్యాదగా నాపై ఉన్న కేసు వాపస్ తీసుకుని ఆధారాలు తీసుకొచ్చి ఇవ్వాలని బెదిరిస్తాడు.లేకుండే నువ్వు ఎవరో సోషల్ మీడియాలోపెట్టేస్తానని బెదిరిస్తాడు.అప్పుడు ఊరిలో ఉన్న రౌడీలు మొత్తం నీ ఇంటి ముందే ఉంటారని హెచ్చరిస్తాడు. నేను లొకేషన్ పంపిస్తానని మర్యాదగా వచ్చి చెప్పిన పని చేయమని చెప్పి ఆమెకు ఫొటోలు పంపిస్తాడు. అవి సాధూసార్కు చూపించగా...వాడు చెప్పినట్లు చేయమని చెబుతాడు. లేకుంటే నువ్వు ఎవరో అందరికీ తెలిసిపోతుందని....అప్పుడు నీ ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వస్తుందని అంటాడు.దీనికి జేడీ ససేమీరా అంటుంది. అయితే ఆ మినిస్టర్ కొడుకును ఎన్కౌంటర్ చేయమని చెబుతాడు. అప్పుడే జేడీ ఓ మంచి పథం వేస్తుంది.
Also Read: నిండు మనసులు: విజయానంద్ మీద విరుచుకుపడ్డ సిద్ధూ! ఆ ఒక్క డైలాగ్తో మనసులో మాట చెప్పేశాడుగా!
జేడీ ఎన్కౌంటర్ చేస్తుందని భయపడిన అవినాష్ ఆమెను ఆధారాలు తీసుకుని పబ్లిక్ ప్లేస్కు రమ్మని చెబుతాడు. అయితే అవినాష్ రేప్ చేసి చంపేసిన అమ్మాయి తాతయ్యను కూడా తీసుకుని వస్తుంది జేడీ.అంతకు ముందే ఆయనకు గన్కాల్చడంలో ట్రైనింగ్ ఇప్పిస్తుంది. ఇదిగో ఇతనే కేసు పెట్టిందని....ఇప్పుడు వాపస్ తీసుకున్నాడని చెబుతుంది. అలాగే మర్డర్ జరిగిన ప్లేస్లో దొరికిన ఆధారాలు కూడా ఇచ్చేస్తుంది. ఇంతలో ముసలాయన ఉన్నట్టుండి గన్ బయటకు తీసి అవినాష్ను బెదిరిస్తాడు.చుట్టూ జనం రావడంతో జేడీ, కేడీ ఆ ముసలాయన్ని ఆపుతున్నట్లు నాటకమాడతారు. గన్తో బెదిరించి ముసలాయన అవినాష్ ఫోన్ తీసుకుని నేలకేసి కొడతాడు.దీంతో జేడీ,కేడీకి సంబంధించిన ఆధారాలన్నీ పోతాయి. గన్తో కాల్చగా అవినాష్ పారిపోగా...అతని ఫ్రెండ్కు మాత్రం బుల్లెట్ గాయాలు తగిలి అక్కడికక్కడే చనిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మంత్రితో ఈ ఎన్కౌంటర్కు మాకు ఎలాంటి సంబంధం లేదని చెబుతుంది. ఆ తర్వాత లిస్ట్లో మీ అబ్బాయి ఉన్నాడని హెచ్చరిస్తుంది. అవినాష్ మనం ఎవరో వాళ్ల నాన్నకు చెబుతాడేమోనని కేదార్ జేడీతో అనగా..వాడికి చాలా ఇగో ఉందని చచ్చినా ఆ పని చేయడని అదే మనకు బలమని చెబుతుంది జేడీ.
Before You Go
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్గ్రౌండ్ తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















