Chinni Serial Today February 24th: చిన్ని సీరియల్: నిజం చెప్పకుండా జైలర్ని ఆపిందెవరు? మధు మ్యాడీకి నిజం చెప్పేస్తుందా!
Chinni Serial Today Episode February 24th మధునే చిన్ని అని జైలర్ చెప్పే టైంకి భైరవి జైలర్కి కాల్ చేసి బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవా ఇంటికి జైలర్ని పిలుస్తాడు. మధునే చిన్ని అని తెలిసిపోతుందని అనుకుంటాడు. మధు టెన్షన్ పడుతూనే జైలర్ ముందుకు వస్తుంది. జైలర్ మధుని చూసి నువ్వు మినిస్టర్ కోడలివా అని అంటాడు. అవును మీకు నా భార్య ముందే తెలుసా అని మహి అడుగుతాడు. తెలుసు కానీ నువ్వు ఈ ఇంటి కోడలు అంటే నేను నమ్మలేకపోతున్నా అని అంటుంది. ఎందుకు అని మ్యాడీ అడుగుతాడు.
దేవా జైలర్తో నా కోడలు మీకు ఎలా తెలుసో వివరంగా చెప్పమని అంటాడు. జైలర్ చెప్పే టైంలో ఫోన్ రావడంతో అర్జెంట్ అని బయటకు వెళ్తుంది. నాగవల్లి మధుతో ఆ జైలర్ రాజమండ్రిలో పని చేసింది.. నువ్వు ఎక్కడో పల్లెటూరిలో పెరిగావ్.. తను నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఏదో నేరం చేసి వెళ్లిందేమో అని వసంత అంటుంది. మధు అలా ఎందుకు చేస్తుంది.. నువ్వు చెప్పు మధు ఆవిడ నీకు ఎలా పరిచయం అని అడుగుతాడు. అదీ అదీ అని మధు నసుగుతుంది. ఇంతలో మళ్లీ జైలర్ వస్తుంది.మా మధు నీకు ఎలా తెలుసు అనిదేవా అడిగితే తను ఒకటి రెండు సార్లు జైలుకి వచ్చిందని జైలర్ అంటుంది. అందరూ షాక్ అయిపోతారు. మ్యాడీ మా మధు జైలుకి ఎందుకు వచ్చింది అని అడిగితే ట్రస్ట్ తరుఫున ఖైదీలకు స్వీట్స్ పంచడానికి వచ్చిందని జైలర్ చెప్తుంది. నాగవల్లి, దేవా షాక్ అయిపోతారు. ఇలా చెప్పింది ఏంటా అనుకుంటారు.
దేవా జైలర్ దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలా చెప్పావ్ అని ప్రశ్నిస్తాడు. దానికి జైలర్ భైరవి మేడం కాల్ చేసి చిన్ని గురించి చెప్తే నా ఉద్యోగం పోతుందని చెప్పారు.. మా అందరికీ భైరవి మేడం హెడ్ ఆవిడ.. నన్ను బెదిరించారు.. ఆవిడకు కావేరి, చిన్ని చాలా క్లోజ్.. అని చెప్తుంది. మీ రాజకీయాలు బయట చేస్తే మీ కోడలు కిచెన్లో రాజకీయాలు చేస్తున్నారు అని అంటుంది. ఫ్లాష్బ్యాక్లో భైరవికి మధు కాల్ చేసి విషయం చెప్తుంది. తర్వాత మధు జైలర్ని కలిసి మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్తుంది. నువ్వే చిన్ని అని చెప్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు అని అంటుంది. నేను టైం చూసుకొని చెప్తా లేదంటే నా కాపురం కూలిపోతుందని మధు అంటుంది. ఇప్పటికైనా నీ భర్తకి నిజం చెప్పకపోతే ఆయనకు నమ్మకద్రోహం చేసినట్లే కదా అంటుంది జైలర్. మధు ఎలా అయినా మ్యాడీకి నిజం చెప్పేయాలి అనుకుంటుంది.
నాగవల్లి దగ్గరకు లోహిత వెళ్లి ఆ మధుని ఈ రోజుతో పంపేస్తాం అన్నారు.. కదా ఆ ప్లాన్ ఎప్పుడెప్పుడు అమలు చేస్తానా అని సంతోషంగా ఉన్నాను అంటే అంత ఎగ్జైట్ అవుతున్నావ్ అంటే నీకు తనకు ఏమైనా సంబంధం ఉందా.. నువ్వు మధు ఏమైనా మేనత్త మేనమామ పిల్లలా అని అడుగుతుంది. లోహిత షాక్ అయిపోతుంది. నాగవల్లి ప్లాన్ అమలు చేయొద్దని లోహితకు చెప్తుంది. ఆ ప్లాన్ గురించి పూర్తిగా మర్చిపో అని అంటుంది. లోహిత షాక్ అయిపోతుంది. మధు దగ్గరకు మ్యాడీ వెళ్లి ఆ నిజం నా దగ్గర ఎందుకు దాచావ్ అని అడుగుతాడు. మధు చాలా కంగారు పడుతుంది. ఖైదీలకు స్వీట్స్ అందించావ్ కదా ఏ ట్రస్ట్ ద్వారా వెళ్లావ్ అంటాడు.ఓం చారిటబుల్ ట్రస్ట్ అని మధు అంటుంది. ఈ పేరు నేను ఎప్పుడూ వినలేదు అని మ్యాడీ అంటే మా ఊరి దగ్గర్లో ఉందని అంటుంది. నువ్వు చాలా గొప్పదానివి.. కానీ నాకు ఇలాంటి విషయాలు చెప్పడం లేదు.. ఏమైనా సరే ఇక నుంచి ముందే చెప్పేయ్ అని అంటాడు.
నాగవల్లి ఎందుకు తనకు ప్లాన్ అమలు చేయొద్దని అందని లోహిత ఆలోచిస్తూ ఉంటుంది. శ్రేయ వచ్చి బావ అందరి ముందు మధుకి ప్రేమ చెప్పేలా ఉన్నాడు.. ఆ సీన్ చూస్తే నా గుండె ఆగిపోయేలా ఉంది.. అని అంటుంది. నాగవల్లి ఆంటీ ఏదో ఒకటి చేస్తారు.. నాకు ఆ నమ్మకం ఉంది అని లోహిత అంటుంది. మరోవైపు స్వరూప మధు గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మ్యాడీ ఫోన్ చేస్తాడు. ఇంట్లో ఓ విషయం జరగబోతుంది.. మధు తల్లిదండ్రులుగా మీరు ఇంట్లో ఉండాలి.. వెంటనే రండి అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



















