Jagadhatri Serial Today Feb 23th: జగధాత్రి కాల్పుల్లో మీనన్ చనిపోలేదా...? ఆ రోజు చచ్చిపోయింది మీనన్ రూపంలో ఉన్న అతని డమ్మీనా...?
Jagadhatri Serial Today Episode February 23th: జగధాత్రి కాల్పుల్లో మీనన్ చనిపోలేదా...? ఆ రోజు చచ్చిపోయింది మీనన్ రూపంలో ఉన్న అతని డమ్మీనా...?

Jagadhatri Serial Today Episode : జగధాత్రి తుపాకీ కాల్పుల్లో మీనన్ చనిపోయాడని అందరూ అనుకున్నారు. అలాగే మీనన్ డెడ్బాడీకీ అంత్యక్రియలు కూడా నిర్వహిస్తారు. కానీ ఒక్క జేడీ మాత్రం మీనన్ అంత తేలిగ్గా చచ్చిపోడాని నమ్ముతుంది. జేడీ అనుకున్నట్లే మీనన్ చచ్చిపోడు. చితిమంటలు మధ్యలో నుంచి నవ్వుతూ వచ్చిన మీనన్ను చూసి అతని అనుచరులే ఆశ్చర్యపోతారు. అదేంటన్నా నువ్వు చచ్చిపోలేదా అని అడుగుతారు.ఈ మీనన్కు ఇంత ఈజీగా చావు వస్తుందని అనుకున్నారా అంటూ పెద్దగా నవ్వుతాడు. మరి ఆ రోజు కాల్పుల్లో చనిపోయింది ఏవరని అడుగుతారు. మేము ఇంతకు ముందే తలకొరివి కూడా పెట్టాం కదా అని అంటారు. వాడు నా రూపంలో ఉన్న డమ్మీ అని చెప్పడంతో వాళ్లు నోరు వెళ్లబెడతారు.ఇలాంటి రోజు ఏదో ఒకరోజు వస్తుందని ఊహించే అచ్చం నాలాగా ఉండేవాడిలా ఒకడిని మంబయిలో తయారు చేయించి తీసుకొచ్చానని...వాడికి అచ్చం నా అలవాట్లు ఉండేలా ట్రైనింగ్ ఇచ్చానని చెబుతాడు. ఎప్పుడైనా ఉపయోగపడతాడని అలాగే ఉంచానని అంటాడు.
మొన్న సీఎంను కిడ్నాప్ చేసే క్రమంలో మన ప్లాన్ బెడిసికొట్టడంతో నా బదులుగా వాడిని అక్కడికి పంపించానని చెబుతాడు. ఆ పిచ్చి జేడీ కేవలం నన్నుఅరెస్ట్ చేస్తుందని అనుకున్నాను కానీ....బుల్లెట్లు దింపుతుందని ఊహించలేకపోయానని అంటాడు.ఇది కూడా మన మంచికే జరిగిందని అంటాడు. ఇప్పుడు ప్రజలందరి దృష్టిలో ఈ మీనన్ చచ్చిపోయాడని....ఇక నేను ఏం చేసినా ఎవరూ ఏం చేయలేరని అంటాడు. ఆ జేడీటీంపైన, ఇటు కౌషికి కుటుంబంపై నేను చేసే దాడులు చూసి వాళ్లకు పిచ్చి ఎక్కిపోవాలని అంటాడు. చచ్చిపోయిన మీనన్ ఇవన్నీ ఎలా చేస్తున్నాడా అని బుర్రబద్ధలు కొట్టుకోవాలని అంటాడు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయిన జగధాత్రి నేరుగా ఇంటికి వస్తుంది. కుడిచేతికి తగిలిన దెబ్బను కప్పిపుచ్చి ధాత్రి, కేదార్ ఇంట్లో మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంతలో నిషిక వచ్చి పైన ఉన్న పప్పుల డబ్బా తీయమని జగధాత్రిని అంటుంది.ఆమె ఒక్కచేతితోనే ఆ డబ్బా తీయలేక చాలా ఇబ్బందిపడటాన్ని కౌషికి చూస్తుంది. అటు నిషిక కూడా రెండో చేతికి ఏమైందని నిలదీయగా ఏం కాలేదని ధాత్రి తప్పించుకుంటుంది. అలాగే కీర్తిపాప వచ్చి బొమ్మ మూత తీయమన్నా కూడా చాలా ఇబ్బందిపడటంతో ఈసారి కౌషికి నేరుగా అడుగుతుంది. కుడిచేతికి ఏమైందని అంటే ఏం లేదని కేదార్, జగధాత్రి ఇద్దరూ అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వెళ్లిపోతారు.
కానీ కౌషికికి ధాత్రిపైన అనుమానం అలాగే ఉంటుంది.వీళ్లిద్దరూ కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారని ఆమె అనుకుంటుంది. బయట కూర్చుని మాట్లాడుకుంటుండగా...కౌషికి అక్కడికి టీ తీసుకుని వస్తుంది. ఏమైందని ఎందుకు కంగారుగా ఉన్నారని అడుగుతుంది. అతి కష్టం మీద కౌషికి అనుమానం రాకుండా ఉండేందుకు జగధాత్రి కుడిచేతితోనే టీ తాగుతుంది.దీంతో కౌషికి మీరు నిజంగా నా దగ్గర ఏదైనా దాస్తేచెప్పండని...ఈ ఇంట్లో ఎవరు నన్ను మోసం చేసినా...మీరు మాత్రం చేయరని నమ్ముతున్నానని అంటుంది. దీంతో జగధాత్రి అదేమీ లేదని చెప్పి తప్పించుకుంటుంది.ఇవాళ అంటే ఎలాగోలా తప్పించుకున్నామని...ఈ వారంరోజులు పాటు అక్క కళ్ల నుంచి తప్పించుకోవడం అసాధ్యమని కేదార్ అనడంతో ...దానికి నా దగ్గర ఓఉపాయం ఉందని చెప్పి జేడీ చెబుతుంది. దాన్ని అమలు చేద్దామని చెబుతుంది.























