Tollywood: ఫొటోగ్రాఫర్గా మారిన మహేష్ కొడుకు - రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్!
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..
ఫొటోగ్రాఫర్గా మారిన మహేష్ కొడుకు:
మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. కొన్ని రోజులుగా ఆయన విదేశాల్లోనే ఉన్నారు. భార్యా, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి సంగతులను మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో పోస్ట్ పెట్టారు. మహేష్ బాబు, సితార రోడ్ మీద నిల్చొని ఉండగా.. గౌతమ్ ఫొటో తీశారు. ఈ విషయాన్ని నమ్రత వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది.
View this post on Instagram
రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్:
2015 మిస్ యూనివర్స్ గా ఎంపికైన ఊర్వశి రౌతేలా ఆ తరువాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. రీసెంట్ గా 'ది లెజెండ్' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుళ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు గాను.. ఊర్వశి రౌతేలా రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయంపై చాలా మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఇందులో నిజం లేదని అంటోంది ఊర్వశి టీమ్. ఒకవేళ ఇదే నిజమైతే గనుక సౌత్ లో భారీ రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గా ఆమెకి రికార్డ్ దక్కడం ఖాయం.
Also Read: కొరటాల, బుచ్చిబాబు సినిమాలు - ఎన్టీఆర్ ప్లాన్ ఇదే!
Also Read: జగపతిబాబు వల్ల డబ్బులు పోగొట్టుకున్నా - త్రివిక్రమ్ సినిమా అందుకే వద్దన్నా: వేణు తొట్టెంపూడి
View this post on Instagram
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















