అన్వేషించండి

TG Vishwa Prasad: ఏపీలో ‘బ్రో’ చిత్రానికి ఇబ్బందులు ఎదురవుతాయా?-నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘బ్రో’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బ్రో’. ఈ మల్టీ స్టారర్ మూవీకి నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పలు విషయాలు వెల్లడించారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు పెద్ద హీరోలతో కలిసి పని చేయడం ఎలా ఉంది? ఈ సినిమా తమ దగ్గరికి ఎలా వచ్చింది? పవన్ కల్యాణ్ ఈ సినిమాకు ఎలా ప్లస్ కాబోతున్నారు? అనే అంశాల గురించి వివరించారు.

పవన్ రియల్ లైఫ్ ఇమేజ్ ఎంతో ఉపయోగపడుతుంది!

“తాము ఓ సినిమా చేయాలని అని భావిస్తున్నప్పుడు దర్శకుడు త్రివిక్రమ్, సముద్రఖని తమిళంలో చేసిన ఓ ప్రాజెక్టును మాకు రెఫర్ చేశారు. అదే తమిళ ఒ మూవీ ‘వినోదయ సీతం’. ఇది చాలా చిన్న సినిమా. కేవలం 20 రోజుల వ్యవధిలో షూట్ చేశారు.  కానీ, మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమాను మన ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేలా తీయాలి అనుకున్నాం. సముద్రఖనినే దర్శకుడిగా తీసుకున్నాం. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ను హీరోలుగా అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఈ సినిమా తెలుగులో చక్కగా రూపొందింది. ఇందులో ఎమోషన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్  పాత్ర, అతడి నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా తొలి ఆరు నిమిషాలు మినహా మిగతా రన్ టైమ్ అంతా పవన్ కల్యాణ్ ఉంటారు. పవన్ రియల్ లైఫ్ ఇమేజ్ ఈ సినిమాకు చాలా ఉపయోగపడుతుంది. ‘బ్రో’ ప్రేక్షకుల అంచనాలను తప్పకుండా రీచ్ అవుతుంది” అన్నారు విశ్వప్రసాద్.

‘బ్రో’ సినిమాకు ఏపీలో ఏ ఇబ్బంది ఉండదు!

అటు ఏపీ రాజకీయాల్లో పవన్ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ‘బ్రో’ సినిమాపై ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూస్తానని చెప్పారు. “సినిమాలపై ప్రభావం చూపే కొన్ని సంఘటనలు ఉండవచ్చు. కానీ, ‘బ్రో’ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అనుకోను. ‘వకీల్ సాబ్‌’ విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యింది. అది పునరావృతం అవుతుందని నేను అనుకోను. ‘బ్రో’ మా బడ్జెట్‌లోనే నిర్మించాం. థియేటర్లలో టిక్కెట్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ చేయలేదు. అదనపు మొత్తం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు షోలు కావాలని కోరలేదు. అందుకే, ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బందు ఎదురుకావు అని భావిస్తున్నాం" అని చెప్పారు.

‘బ్రో’ సినిమాను  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.   ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.   

Read Also: ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు‘బ్రో’- క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు

వీడియోలు

Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam
Sophie Devine All Rounder Show | DCW vs GGTW మ్యాచ్ లో సోఫీ డివైన్ ఆశ్చర్యపరిచే ప్రదర్శన | ABP Desam
Ind vs NZ First ODI Highlights | మొదటి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం | ABP Desam
Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Telangana Latest News: తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యార్థులకు ఇచ్చే కిట్‌లపై సీఎం సమీక్ష- కీలక ఆదేశాలు
Virat Kohli:విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్ ట్రోఫీలను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? సీక్రెట్ చెప్పిన ఛేజ్‌ మాస్టర్!
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Embed widget