అన్వేషించండి

Rashmika Mandanna: ‘పుష్ప‘ తర్వాత 5 లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసిన రష్మిక? ఆమె రియాక్షన్ ఏంటో తెలుసా?

వరుస హిట్లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న, వరుస బెట్టి లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేస్తోందట. ఇప్పటి వరకు 5 నగరాల్లో 5 ఇండ్లు కొన్నదట. తాజాగా ఈ విషయంపై రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘ఛలో‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లోనూ సత్తా చాటుతోంది. వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న రష్మిక మందన్న గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ‘పుష్ప’ సినిమా హిట్ తర్వాత ఏకంగా 5 నగరాల్లో 5 లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేసిందనేది ఆ వార్త సారాంశం. రష్మిక తన సంపాదనలో ఎక్కువగా ఆస్తుల మీదే పెట్టుబడులు పెడుతోందట. అందులో భాగంగానే గత కొద్ది కాలంలోనే దేశ వ్యాప్తంగా 5 ప్రధాన నగరాల్లో 5 విలాసవంతమైన ఫ్లాట్లు కొన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, గోవా, ముంబై, కూర్గ్, బెంగుళూరులో ఈ అపార్ట్‌ మెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ వార్తలు నిజమైతే బాగుంటుంది-రష్మిక

తాజాగా ఈ వార్తలపై రష్మిక మందన్న స్పందించింది. ఇదంతా నిజం కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించింది.  “ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టిస్తారో తెలియదు. కానీ, అన్నీ నిజమైతే ఎంత బాగుంటుందో” అంటూ కామెంట్ చేసింది.

గత కొద్ది కాలంగా వివాదాల్లో రష్మిక

గత కొద్ది కాలంగా రష్మిక మందన్న పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా కాంట్రవర్శియల్ కామెంట్స్ చేసింది. రొమాంటిక్ సాంగ్స్ ను రూపొందించడంలో బాలీవుడ్ బెస్ట్ అని చెప్పింది. ఆమె వ్యాఖ్యలపై సౌత్ లో విమర్శలు వెల్లువెత్తాయి. “తెలుగు, తమిళ సినిమాల్లో నటించేటప్పుడు కన్నడ సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడావు. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు చేస్తూ, సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేస్తున్నావ్” అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అటు ఈ వ్యాఖ్యలపై రష్మిక వివరణ ఇచ్చింది.”నేను అలా అనలేదు. నేను చెప్పబోయే లోపే డిస్ట్రబ్ అయ్యాను. అందుకే మాటలు తడబడ్డాను. సోషల్ మీడియాలో తనపై విపరీతంగా నెగిటివిటీ ఉంది” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

తాజాగా ‘మిషన్ మజ్ను’, ‘సీతారామం’ సినిమాల్లో నటించిన రష్మి, ప్రస్తుతం ‘పుష్ప-2’లో నటిస్తోంది. తొలి భాగంలో శ్రీవల్లిగా అలరించిన రష్మిక, రెండో భాగంలో మరింత గ్లామరస్ పాత్ర పోషించబోతోందట. ప్రస్తుతం బాలీవుడ్ లో  ‘యానిమల్’ అనే మూవీలో నటిస్తోంది.

ఆకట్టుకుంటున్న కొటేషన్

తాజాగా ఈ కన్నడ బ్యూటీ సోషల్ మీడియాలో కొటేషన్స్ షేర్ చేస్తోంది. "అందరూ సంతోషంగా ఉండండి. ఆశతో జీవించండి. సంతోషం, శాంతి జీవితంలో అన్నిటికంటే చాలా గొప్పవి.  ప్రతికూల భావాలను వదిలేయాలి. ఎందుకంటే జీవితం చాలా చిన్నది" అని తాజాగా వెల్లడించింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

Read Also: నా భర్తకు గతంలోనే పెళ్లైంది, విడాకులకు కారణం నేను కాదు: హన్సిక

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
S Janaki Death - Health Bulletin: జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
జానకి మృతిపై అపోలో హాస్పిటల్ హెల్త్ బులిటెన్ రిలీజ్ - ఎన్ని గంటలకు మరణించారు? రీజన్ ఏంటి?
S Janaki Death - Celebs Reaction: జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
జానకమ్మ మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం... సెలబ్రిటీల రియాక్షన్
Singer Janaki Passed Away: దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత
దక్షిణాది గానకోకిల ఇకలేరు... సింగర్ ఎస్ జానకి కన్నుమూత

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget