అన్వేషించండి

Dahini Movie: జేడీ చక్రవర్తి ‘దహిణి’ మూవీకి అరుదైన గౌరవం, స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘దహిణి‘ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక అయ్యింది.

'దహిణి' చిత్రం మరో ఘనత సాధించింది. తనిష్ఠ ఛటర్జీ, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ దర్శకుడు రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ తెరకెక్కించిన ఈ  సినిమా స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపిక అయ్యింది.  ఈ సినిమాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌ లో అరుదైన గౌరవం దక్కడం ఇది రెండోసారి.  పసిఫిక్ బీచ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు లభించింది. ఓరియన్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, సన్‌టచ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా నిర్మించారు.

వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన 'దహిణి'

వాస్తవ ఘటనలు ఆధారంగా రాజేష్ ట‌చ్‌రివ‌ర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి ఆయన తీసిన సినిమాలన్నీ వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కినవే.  ఎన్నో సమస్యలను సినిమాల ద్వారా ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు 'విచ్ హంటింగ్' పేరుతో పలు రాష్ట్రాలలో జరుగుతున్న దారుణాలను వెలుగులోకి తీసుకురావాలనే ప్రయత్నంతో... వివాదాస్పద అంశాలను స్పృశిస్తూ 'దహిణి' సినిమాను తెరకెక్కించారు.

ఒరిస్సా యథార్థ ఘటనలే ఈ సినిమా కథాంశం

ఒరిస్సాలోని మయూర్ బంజ్ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా, వాస్తవికతకు దగ్గరగా 'దహిణి' చిత్రాన్ని రూపొందించారు. ఈ కథను అధ్యయనం చేస్తున్న సమయంలో తెలిసిన విషయాలు చిత్ర బృందంలో ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం..  మన దేశంలో 2001 నుంచి 2019 వరకు దాదాపు 2,937 మందిని మంత్రవిద్యలు చేస్తున్నారనే అనుమానంతో దారుణంగా చంపేశారు. కేవలం 2019 సంవత్సరంలోనే 102 మందిని మంత్రగత్తెలుగా భావించి వివిధ గ్రామాల ప్రజలు అత్యంత కిరాతంగా చంపారు. ఇటువంటి దురాగతాలపై ఎటువంటి కేసు లేదనే చెప్పాలి.

ఒడిశా హైకోర్టు 2021లో చెప్పినదాని ప్రకారం..  ప్రతి నెల నలుగురు మహిళలు మంత్రవిద్య చేస్తున్నారనే నెపంతో దారుణంగా హత్యకు గురవుతున్నారు. ప్రభుత్వ లెక్కలను పరిశీలిస్తే హత్యకు గురవుతున్నవాళ్లలో మహిళలే ఎక్కువ శాతం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక యునైటెడ్ నేషన్స్ అందించిన నివేదిక 1987 నుంచి 2003 మధ్యన సుమారు పాతికవేల మందిని మంత్రగత్తెలనే అనుమానంతో దారుణంగా చంపారని నిర్ధారణ చేసింది.

వాస్తవాలు తెలియాలనే మా ప్రయత్నం- సునీత కృష్ణన్

భారత్ తో పాటు పలు దేశాలను పట్టి పీడిస్తున్న 'విచ్ హంటింగ్' సమస్యను వెలుగులోకి తీసుకురావడంతో పాటు..  మానవ హక్కుల ఆందోళన, లింగ ఆధారిత హింసను ప్రస్తావిస్తూ రాజేష్ టచ్ రివర్ ' దహిణి' సినిమాను రూపొందించారు. "ఆధునిక కాలంలో కూడా లింగ ఆధారిత హింసతో ఇప్పటికీ అనాగరిక చర్యలను కొంత మంది పాటిస్తున్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అయినప్పటికీ ఎవ్వరూ ఈ దారుణాల గురించి మాట్లాడకపోవడం దురదృష్టం. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయడానికి మేం చేసిన ప్రయత్నం ఈ సినిమా” అని మానవ హక్కుల కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీత కృష్ణన్ అన్నారు.

ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం నా అదృష్టం-ప్రదీప్ నారాయణన్

''నేటి భారతంలో వేలాది మంది మహిళలను మంత్రగత్తెల పేరుతో ఎలా వేటాడుతున్నారు? అనే విషయం గురించి మా సినిమాలో  ఓపెన్‌గా రించి చర్చిస్తున్నాం. దీని తర్వాత ప్రేక్షకులు మాట్లాడతారని ఆశిస్తున్నాం. ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను'' అని ప్రొడ్యూసర్ ప్రదీప్ నారాయణన్ తెలిపారు.

Read Also: నవంబర్ 9న ప్లేస్టేషన్‌కి ‘గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్‘, కంప్లీట్ డీటైల్స్ మీ కోసం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshimi Raave Maa Intiki Serial Today March 26th:యాక్సిడెంట్‌ జరగడానికి మధుబాబు కారణమని శ్రీలక్ష్మీ సూర్యనారాయణకు చెప్పిందా లేదా..?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: యాక్సిడెంట్‌ జరగడానికి మధుబాబు కారణమని శ్రీలక్ష్మీ సూర్యనారాయణకు చెప్పిందా లేదా..?
Jagadhatri Serial Today March 26thశ్రీవల్లిపై వైజయంతి చేయిచేసుకోవడానికి కారణమేంటి..? నిషిక కంపెనీ షేర్లు అమ్మకానికి పెట్టినట్లు కౌషికికి తెలిసిపోయిందా..?
జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లిపై వైజయంతి చేయిచేసుకోవడానికి కారణమేంటి..? నిషిక కంపెనీ షేర్లు అమ్మకానికి పెట్టినట్లు కౌషికికి తెలిసిపోయిందా..?
Anna Lezneva : మెగాస్టార్ నాకు అన్నయ్యే - పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్... ఒక్క రోజులోనే ఫాలోవర్స్ ఎంతమందంటే?
మెగాస్టార్ నాకు అన్నయ్యే - పవన్ భార్య అన్నా లెజినోవా పోస్ట్... ఒక్క రోజులోనే ఫాలోవర్స్ ఎంతమందంటే?
kalavari kodalu kanaka mahalakshmi serial today march 26th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర కోసం లక్ష్మీ విహారితో ఏం చెప్పింది? లక్ష్మీ గర్భవతి అని పండు విహారికి చెప్పేస్తాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్ర కోసం లక్ష్మీ విహారితో ఏం చెప్పింది? లక్ష్మీ గర్భవతి అని పండు విహారికి చెప్పేస్తాడా!

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget