Rashmi Gautam: ‘బక్రీద్’ నేపథ్యంలో రష్మీ వివాదాస్పద ట్వీట్ - మండిపడుతోన్న నెటిజన్స్
యాంకర్ రష్మీ గౌతమ్ మరోసారి నెటిజన్స్ ఆగ్రహానికి గురైంది. బక్రీద్ పండగ సమయంలో జంతు ప్రేమికురాలిగా ఆమె చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది
Rashmi Gautam: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రష్మీ గౌతమ్ గురించి పెద్దగా చెప్పనసరం లేదు. ‘జబర్దస్త్’ షో లో యాంకర్ గా చేసి విపరీతమైన గుర్తింపు తెచ్చుకుంది. అడపా దడపా సినిమాల్లో కూడా నటించి తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకుంటోంది. రష్మీ గౌతమ్ జంతు ప్రేమికురాలు. మూగ జీవాలను హింసిస్తే అసలు చూస్తూ ఉండలేదు. వాటిన ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి జంతుప్రేమికురాలిగా ఆమె చేసే ట్వీట్లు, పోస్ట్ లు మిస్ ఫైర్ అవుతూ ఉంటాయి. తాజాగా రష్మీ గౌతమ్ చేసిన ఓ పోస్ట్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
రష్మీ పై ఫెర్ అవుతోన్న నెటిజన్స్.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?
సినిమా ఇండస్ట్రీ సెలబ్రెటీలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. దీంతో వాళ్లు ఏం మాట్లాడినా ఏం చేసినా సోషల్ మీడియాలో అవి వైరల్ గా మారుతాయి. ఒక్కోసారి వాళ్లు చేసే వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతాయి. తాజాగా ఇప్పుడు యాంకర్ రష్మీ గౌతమ్ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్ల నుంచి విమర్శలకు గురవుతోంది. రష్మీ ప్రతీ పండగ సందర్భాలలో ఇలాంటి పోస్ట్ లు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. జంతువులను హింసించి, బలి ఇచ్చే ఆచారాలపై మండిపడుతూ పోస్ట్ లు చేస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి ట్వీట్ ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదే ఇప్పుడు రష్మీ గౌతమ్ ను విర్శలకు గురి చేస్తోంది. రష్మీ చేసిన పోస్ట్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఎందుకు ప్రతీసారి పండగల సమయంలోనే జంతువుల మీద నీకు అంత ప్రేమ’ అంటూ ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. ‘పెద్ద పెద్ద కంపెనీలు నాన్ వెజ్ ను బ్రాండ్ క్రియేటి చేసి అమ్ముతున్నారు, వాళ్లని ఎందుకు ప్రశ్నించవు’ అని ఇంకో వ్యక్తి విమర్శించాడు. ‘ఫేమ్ కోసం ఇలాంటివి చేస్తారు వీళ్లు’ అని మరో వ్యక్తి సెటైర్ వేశాడు. ఇలా రష్మీ చేసిన పోస్ట్పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రష్మీ..
గతంలో హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతి చెందాడు. ఆ ఘటన అందర్నీ కలచివేసింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కొంత మంది సెలబ్రెటీలు కూడా దీనిపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే రష్మిక కూడా కుక్కల దాడి ఘటనపై స్పందిస్తూ అందులో కుక్కల తప్పేమి ఉంది అన్నట్టు వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్స్ మండి పడ్డారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ‘నువ్ ఎంత జంతు ప్రేమికురాలివి కుక్కల దాడిలో ఓ చిన్నారి చనిపోతే కనీసం సానుభూతి కూడా లేకుండా ఇలా మాట్లాడతావా’ అంటూ ఫైర్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు రష్మీ బక్రీద్ పండగ సమయంలో జంతు ప్రేమను ప్రదర్శిస్తూ ట్వీట్ చేయడంపై మండి పడుతున్నారు నెటిజన్స్. మరి దీనిపై రష్మి ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: బాలయ్యతో మూవీ తీస్తా, నేను లెక్కలేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా: విశ్వక్ సేన్
High time Muslims have a image makeover and it’s only in there hands where ever they go blood and pain follows
— rashmi gautam (@rashmigautam27) June 28, 2023
Even thou they are many people in the same community who stand for compassion and love
The sensible ones needs to step up https://t.co/9YiBzcktch