అన్వేషించండి

Mohan Babu: భద్రతా కారణాలతో అయోధ్యకు వెళ్లలేదన్న మోహన్ బాబు - మండిపడుతోన్న నెటిజన్స్

Mohan Babu: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట వేడుకకు రావాల్సిందిగా ఆహ్వానం అందినా, భద్రతా కారణాలతో వెళ్లలేదన్నారు మోహన్ బాబు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Mohan Babu’s Security Threat Comments: కోట్లాది మంది హిందువులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహత్తర ఘట్టం పూర్తయ్యింది. జనవరి 22న అయోధ్య ఆలయంలో బాలరాముడు కొలువుదీరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు చైర్మన్ చేతుల మీదుగా ఈ అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఈ వేడుకను తిలకించేందుకు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అయోధ్య నగరానికి తరలి వచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానం మేరకు సుమారు 11 వేల మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు కూడా ఆహ్వానం అందింది.

ఆహ్వానం ఉన్నా అయోధ్యకు వెళ్లని మోహన్ బాబు

అటు అయోధ్యకు రావాలని ఆహ్వానం ఉన్నా, భద్రతా కారణాలతో వెళ్లలేకపోయానని మోహన్ బాబు తెలిపారు. “నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక భారతీయ, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్తున్నారు.  ఆయన ప్రధాని అయ్యాక దేశ ప్రతిష్ట పెరుగుతోంది. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు రావాల్సిందిగా తనకు కూడా ఆహ్వానం అందించారు. అయితే, భద్రతా కారణాల వల్ల రాలేకపోతున్నానని, తనను క్షమించమని లేఖ రాశాను. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని మోహన్ బాబు వెల్లడించారు.  అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని దైవ సన్నిధానంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక హోమం నిర్వహించారు.   

మోహన్ బాబు తీరుపై నెటిజన్ల ఆగ్రహం

అయోధ్య ఆహ్వానం ఉన్నా మోహన్ బాబు వెళ్లకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా హిందువులు ఎదురు చూస్తున్న ఈ చారిత్రక వేడుకకు వెళ్లలేకపోయేంత పని ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు లేని భద్రతా ఇబ్బందులు మోహన్ బాబుకు ఏమున్నాయో? అని మరికొంత మంది ప్రశ్నిస్తున్నారు. అద్భుత వేడుకకు ఆహ్వానం లేదని ఎంతో మంది బాధపడుతుంటే, ఉన్నా ఉపయోగించుకోలేకపోయారని కలెక్షన్ కింగ్ పై కన్నెర్ర చేస్తున్నారు.

‘కన్నప్ప’ మూవీ పనుల్లో మోహన్ బాబు బిజీ

ఇక ప్రస్తుతం మోహన్ బాబు ‘కన్నప్ప’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు  ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార సహా పలువురు ప్రముఖులు ఇందులో నటిస్తున్నారట. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Read Also: ఈ ఏడాది సమ్మర్‌లో పెద్ద సినిమాల సందడి లేనట్టేనా? ఆ సినిమాలకు లైన్ క్లియర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijay Trisha Relationship: త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?
త్రిషతో దళపతి విజయ్ ఎఫైర్... విడాకుల నేపథ్యంలో ఆధారాలు బయటకొచ్చాయా?
Renu Desai: నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
నిండుగా బట్టలు వేసుకున్నా రేటు ఎంతని అడిగారు... రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
Dhurandhar 2 Trailer: మార్చి 5న కాదు, ఇంకా ముందుగా... 'ధురంధర్ 2' ట్రైలర్ నయా రిలీజ్ డేట్ ఇదుగో
మార్చి 5న కాదు, ఇంకా ముందుగా... 'ధురంధర్ 2' ట్రైలర్ నయా రిలీజ్ డేట్ ఇదుగో
Telugu Movie: ప్రేమకథలో దేవి ప్రసాద్... నయా యూత్ ఫుల్ లవ్ డ్రామా షురూ
ప్రేమకథలో దేవి ప్రసాద్... నయా యూత్ ఫుల్ లవ్ డ్రామా షురూ

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
Embed widget