Image Credit:Official/Instagram
OTT Actors: ఇండియాలో ఓటీటీలకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. కరోనా సమయంలో ఆ తర్వాత కూడా ప్రజలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దీంతో మేకర్స్ కూడా ఓటీటీలపై దృష్టి పెట్టారు. సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్ లు కూడా పోటీ పడే స్థాయికి ఓటీటీల హవా పెరిగింది. ఓటీటీలు పెరిగిన తర్వాత మెల్లగా సినిమా స్టార్స్ కూడా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ చాలా మంది నటీనటులు ఓటీటీలలో నటిస్తున్నారు. అటు సినిమాలు చేన్తూనే ఇటు వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది నటీనటులు సినిమాల కంటే ఎక్కవగానే ఈ వెబ్ సిరీస్ నుంచి పారితోషికం పుచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటులతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉంది. సమంత ఇటీవల పలు వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో సమంత కూడా ఓటీటీల నుంచి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న జాబితాలోకి చేరిపోయింది. ఆ జాబితాలో ఎవరెవరున్నారో మీరే చూడండి.
ఓటీటీల నుంచి అత్యధిక పారితోషికం తీసుకున్న జాబితాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ మొదటి స్ధానంలో ఉన్నాడు. ఈయన నటించిన తొలి ఓటీటీ వెబ్ సిరీస్ ‘రుద్ర: దిఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’ కోసం ఆయన ఏకంగా రూ.125 కోట్లు తీసుకున్నాడని సమాచారం.
ఓటీటీల నుంచి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్. ఆయన నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’ సీజన్ 1 లో ఎనిమిది ఎపిసోడ్ లలో ఆయన నటించారు. ఇందుకుగానూ సైఫ్ రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడని టాక్.
బాలీవుడ్ విలక్షణ నటుల్లో పంకజ్ త్రిపాఠి ఒకరు. ఈయన నటించిన ‘మీర్జాపూర్’ వెబ్ పంకజ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నివేదికల ప్రకారం పంకజ్ తాను నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’ కోసం రూ. 12 కోట్లు అలాగే ‘మీర్జాపూర్ 2’ కోసం రూ. 10 కోట్ల రూపాయలు తీసుకున్నాడట.
బాలీవుడ్ లో మనోజ్ బాజ్ పేయి కు మంచి గుర్తింపు ఉంది. ఆయన తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. ఆయన నటించిన ‘ది ఫ్యామిలీ మెన’ వెబ్ సిరీస్ భారీ హిట్ ను అందుకుంది. ఈ వెబ్ సిరీస్ కోసం మనోజ్ దాదాపు రూ.10 కోట్లు తీసుకున్నాడని తెలుస్తోంది.
సూపర్ సక్సెస్ గా స్ట్రీమింగ్ అయిన ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ లో నటించిన మరో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఈయన ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకు గానూ దాదాపు రూ.10 కోట్ల రూపాయలను తీసుకున్నాడట.
అదే ‘సేక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ లో నటించిన మరో నటి రాధికా ఆప్టే. ఈ వెబ్ నటించినందుకు గానూ ఆమె సుమారు రూ.4 కోట్లు తీసుకుందని టాక్.
ఓటీటీల నుంచి అత్యధిక పారితోషికం అందుకుంటున్న జాబితాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా ఉండటం విశేషం. సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ ఆమెకు మంచి గుర్తిపును తీసుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకుగానూ సమంత రూ.4 కోట్లు తీసుకుందని సమాచారం.
Also Read: పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన షాహిద్ కపూర్ - ఫైర్ అవుతున్న నెటిజన్లు!
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Bigg Boss Season 7 Day 23 Updates: శుభశ్రీ మీద మీదకు వచ్చిన శివాజీ - టచ్ చేయొద్దంటూ వార్నింగ్
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
TS TET: తెలంగాణ 'టెట్' పేపర్-1లో 36.89 శాతం, పేపర్-2లో 15.30 శాతం ఉత్తీర్ణత
/body>