అన్వేషించండి

Manchu Vishnu: మా నాన్నలో ఆ విషయమే నాకు అస్సలు నచ్చదు: మంచు విష్ణు - ఆ మాటకు షాకయ్య: మోహన్ బాబు

తన తండ్రి మోహన్ బాబుపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయనను అన్ని విషయాల్లో రోల్ మోడల్ గా తీసుకుంటాన్న విష్ణు, ఒక విషయం మాత్రం అస్సలు నచ్చడని చెప్పాడు.

మంచు విష్ణు హీరోగా, అందాల ముద్దుగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా ‘జిన్నా’. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్నది. ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.   

మా నాన్నలో ఆ విషయం అస్సలు నచ్చదు!

ఈ సందర్భంగా మాట్లాడిన హీరో మంచు విష్ణు ‘జిన్నా’ టీమ్ కు థ్యాక్స్ చెప్పారు. ఈ సమయంలోనే  తన తండ్రి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబులోని మంచి చెడుల గురించి వివరిస్తూ పలు కీలక విషయాలు వెల్లడించాడు. జిన్నా సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైందన్నాడు. ఈ సినిమాకు అనూబ్ రూబెన్స్ చక్కటి సంగీతం అందించినట్లు చెప్పారు. తన బిడ్డలు అరియానా, వివియానా కలిసి ఈ సినిమాలో ఓ పాట పాడారని చెప్పాడు. ప్రసంగం మధ్యలో, తన తండ్రి మోహన్ బాబు గురించి గతంలో ఎప్పుడూ చెప్పని విషయాలను విష్ణు వెల్లడించాడు. 

‘‘నాన్న నుంచి నేను చాలా విషయాల్లో స్ఫూర్తి పొందాను. ఒకటి తప్ప ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అదే ఆయన కోపం. ఆయనలో నాకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే అది ఆయన కోపమే. ఇక మా అమ్మ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో నెంబర్ వన్. నా భార్య చూడ్డానికి 5 అడుగులే ఉంటుంది. కానీ, కంటి చూపుతోనే  నన్ను బెదిరిస్తుంది” అని చెప్పాడు.

విష్ణు మాటలు విన్ని ఆడియెన్స్ నవ్వుల్లో మునిగిపోయారు. ఇక ఈ కార్యక్రమానికి హోస్టుగా చేసిన అలీకి ధన్యవాదాలు చెప్పాడు విష్ణు. అడగ్గానే వచ్చి ఓ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసిన ప్రభుదేవాకు కృతజ్ఞతలు చెప్పాడు. సాంగ్ పూర్తయ్యాక చెక్ ఇవ్వమని నాన్న మనిషిని పంపిస్తే తమ్ముడికి సాంగ్ చేస్తే అన్న డబ్బులు తీసుకోడని ప్రభుదేవా అన్నట్లు వివరించాడు. జిన్నా సినిమా కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ విష్ణు ధన్యవాదాలు చెప్పాడు. ఈ వేడుకలో తండ్రిపై విష్ణు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

విష్ణు సినిమాకు కష్టపడని కష్టం ఈ సినిమాకు పడ్డాడు!

కార్యక్రమంలో విష్ణు ఎక్కువ సేపు మాట్లాడొద్దని చెప్పడంపై మోహన్ బాబు కాస్త గంభీరంగానే స్పందించారు. అన్నగారు ఎన్టీఆర్ మూవీ ఫంక్షన్లో గానీ, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు సినిమా ఫంక్షన్లలో ఎవరూ ఇన్ని నిమిషాలే మాట్లాడాలనే కండిషన్ పెట్టలేదన్నారు. కానీ, విష్ణు మీరు ఇంత సేపే మాట్లాడాలని చెప్పడంతో షాకయ్యానన్నారు. అంటే నేను వేదికపై ఎక్కువగా మాట్లాడతానా అని తనకు అనిపించిందన్నారు. ఆ తర్వాత ‘జిన్నా’ మూవీ గురించి మోహన్ బాబు మాట్లాడారు. విష్ణు ఏ సినిమాకు కష్టపడని కష్టం ఈ సినిమాకు పడ్డాడని తెలిపారు. నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు స్టోరీ ప్లాన్ అందిస్తే దాన్ని పట్టుకుని, డైరెక్టర్ సూర్య ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించాడని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని వెల్లడించాడు. 

చాలా కాలంగా హిట్ లేక బాధపడుతున్న విష్ణుకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. వాస్తవానికి మంచు విష్ణు నటిచించి కొన్ని సినిమాలు మినహా చాలా చిత్రాలు ఫ్లాప్ గానే మిగిలాయి.  ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ సినిమాలు అప్పట్లో ఫర్వాలేదు అనిపించాయి. ఈ సినిమాల కారణంగానే ఆయన మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిగతా సినిమాలన్నీ ఆయన కెరీర్ కు పెద్దగా పనికిరాలేదని చెప్పుకోవచ్చు.

Also Read: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget