అన్వేషించండి

MAA Elections: టాలీవుడ్‌లో ప్రాంతీయవాదం రెచ్చగొడతారా?.. హీరో శ్రీకాంత్ ఆగ్రహం

‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌ను నాన్-లోకల్ అని ప్రచారం చేయడంపై హీరో శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు ప్యానెల్ సభ్యులపై మండిపడ్డారు.

‘మా’ ఎన్నికల నేపథ్యంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్న హీరో శ్రీకాంత్.. విష్ణు ప్యానెల్ సభ్యులపై మండిపడ్డారు. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఆరు నెలల కిందటే ప్రకాష్ రాజ్ నా దగ్గరకు వచ్చారు. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లను కలుపుకుని వెళ్తావు అని అన్నారు. ఇందుకు నేను గత ప్రెసిడెంట్ల కంటే భిన్నంగా నువ్వు ఏం చేస్తావని అడిగాను. ఇందుకు ఆయన చెప్పిన సమాధానం నచ్చింది’’ అని శ్రీకాంత్ అన్నారు. 

బిల్డింగ్ అందరికీ ఉపయోగపడాలి: ‘మా’కు ప్రత్యేకంగా భవనం ఉండాలనేది అందరి కల. అయితే, ఆ భవనం అధ్యక్షుడు, సిబ్బంది కూర్చోడానికి కాకుండా.. అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. ఆ భవనం వల్ల ‘మా’కు లాభం రావాలి. దీనిపై అప్పట్లో శివాజీ రాజా, నేను ప్రయత్నించాం. ‘మా’ ఏర్పాటు చేసిన కొత్తలో ఫండ్ రైజింగ్ చాలా ముఖ్యమని భావించాం. ఈ సందర్భంగా క్రికెట్ మ్యాచ్ నిర్వహించి నిధులు సమకూర్చాం. ఆ తర్వాత సీసీఎల్ పెట్టి రూ.3 కోట్లు వరకు నిధులు తీసుకురావాలని అనుకున్నాం. కానీ, దాని వల్ల మాకు పేరు వస్తుందనే కారణంతో కొందరు అడ్డుకున్నారు. ఆ తర్వాత అమెరికా, లండన్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణల సహకారంతో కార్యక్రమాలు నిర్వహించాం. అయితే, ఆ నిధులు మేం కాజేశామని ఆరోపించారు. చేయని తప్పుకు మాపై బురద చల్లారు. దీనిపై విచారణ జరపాలని కోరడంతో కోర్డినేషన్ కమిటీ పెట్టారు. ఎలాంటి అవకతవకలు జరగలేదని కమిటీ తేల్చింది. మరి మాపై బురద ఎందుకు చల్లారని ఆలోచిస్తే.. ‘మా’ ఎన్నికలు దగ్గరపడటం వల్ల రాజకీయాలకు తెరతీశారని అర్థమైంది. సభ్యులు కూడా వారి మాటలను నమ్మారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నన్ను ఓడించారు. ఆ తర్వాత బిల్డింగ్ లక్ష్యం కూడా మరుగున పడిపోయింది. అప్పటి నుంచి నాకు ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తే పోయింది. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నాను. కానీ, ప్రకాష్ రాజు.. మీరు అప్పుడు ఓడిపోలేదని.. ఓడించారని.. ఓడిన చోటే గెలిచి మీ లక్ష్యాన్ని కొనసాగించాలని అన్నారు. అందుకే మళ్లీ బరిలో నిలిచాను’’ అని శ్రీకాంత్ అన్నారు. 

Also Read: సినీ పెద్దల ఆశీర్వాదం నాకొద్దు.. నరేష్ నీ చక్రం దొబ్బేశాం.. సిగ్గుపడేలా మాట్లాడకు: ప్రకాష్ రాజ్

ప్రాంతీయవాదం ఎందుకు?: ఈ ఎన్నికల్లో ఎవరినీ నిందించకూడదని అనుకున్నా.. టాలీవుడ్‌లో తెలుగువాళ్లు, తెలుగువాళ్లు కాదనే ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు? అలాంటి కల్చర్ కావాలా? ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడతారా? నేను తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడలో కూడా నటిస్తున్నా. తెలుగువాళ్లంటే వారికి గౌరవం ఉంది. తెలుగువాళ్లు నన్ను పెంచి పోషించారని, వారికి సేవ చేయాలని ప్రకాష్ రాజ్ వచ్చారు. అలాంటివారిని పనిచేయనివ్వరా? ప్రకాష్ రాజ్ షూటింగ్స్ ఉంటే ‘మా’కు సమయం కేటాయించరు అని అంటున్నారు. ఆయనతోపాటు మీ కోసం మేమున్నాం. ఆయన అందుబాటులో లేకపోతే మాలో ఎవరికైనా సరే మీరు సమస్యలు చెప్పుకోవచ్చు. పనిచేసేవాళ్లపై బురద చల్లేవారని నమ్మొద్దు. ఎవరు ఏమటనేది తెలుసుకుని ఓటేయండి. ప్రలోభాలకు లొంగవద్దు. మాలో ఎవరైనా మందులు, డబ్బులు పంచి ప్రలోభ పెడితే మాకు ఓటేయొద్దు. మనం నేటి తరానికి.. భవిష్యత్తుకు వారధిగా నిలబడాలి. అప్పుడే ఇండస్ట్రీ నిలబడుతుందని శ్రీకాంత్ పేర్కొన్నారు.

వీడియో: 

Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్

Also Read: పోసాని ఎక్స్‌పైరీ ట్యాబ్లెట్.. అతడి చావు భయంకరంగా ఉంటుంది: బండ్ల గణేష్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget