అన్వేషించండి

Payal Rajput: పాయల్‌కు ఫోన్ చేసి సీరియస్ అయిన దర్శకుడు అజయ్, అసలు విషయం ఏంటంటే?

Payal Rajput: హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ‘మంగళవారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా గురించి, దర్శకుడి గురించి పాయల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

Payal Rajput About Director Aajay Bhupathi: అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్, అజ్మల్ అమీర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. ‘RX100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ పాయల్ పలు కీలక విషయాలను వెల్లడించింది.

మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న పాయల్

‘RX100’ సినిమాతో పాయల్ రాజ్ పుత్ తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అజయ్ తెరకెక్కించిన ఈ సినిమాలో పాయల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత పాయల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే, వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయింది. కథల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో  పరాభవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నెమ్మదిగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.  ‘మంగళవారం’ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది పాయల్. వాస్తవానికి ‘మంగళవారం’ మూవీలో కొత్త హీరోయిన్ ను తీసుకోవాలని దర్శకుడు అజయ్ భూపతి భావించారట. కొంత మంది అమ్మాయిలతో ఆడిషన్ కూడా నిర్వహించారట. అయితే, వారిలో ఎవరూ తనకు నచ్చలేదట. ఈ నేపథ్యంలో పాయల్ కు అవకాశం ఇచ్చారట.

అజయ్ భూపతి ఫోన్ చేసి మందలించారు- పాయల్

ఇక తన సినిమాలా ఫెయిల్యూర్స్ గురించి పాయల్ కీలక విషయాలు వెల్లడించింది. సినిమా సక్సెస్ అయితే, కష్టం విలువ బయటకు తెలుస్తుందని చెప్పింది. లేదంటే, ఎంత కష్టపడినా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా మారిపోతుందని చెప్పింది. కొన్నిసార్లు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తన సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతుంటే, దర్శకుడు అజయ్ తనకు ఫోన్ చేసి సీరియస్ అయ్యారని చెప్పింది. అసలు ఇలాంటి కథలను ఎలా ఓకే చేస్తున్నావ్? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పింది. ఆయన ఎప్పుడూ తన మంచి కోరుకునే శ్రేయోభిలాషిగా భావిస్తున్నట్లు చెప్పింది. అందుకే, ఈ సినిమాతో మరోసారి తన కెరీర్ ను సక్సెస్ బాట పట్టించేందుకు ఛాన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చింది పాయల్.

సినిమా రంగంలో స్థిరంగా ఉండలేం- పాయల్

వాస్తవానికి సినిమా రంగంలో ఎవరూ ఎప్పుడూ స్థిరంగా ఉండలేరని చెప్పింది పాయల్. ఒకటి రెండు హిట్లతోనే స్టార్ హీరోయిన్ రేంజికి వెళ్లి, ఆ తర్వాత ఒకటి రెండు ఫ్లాపులతో పాతాళానికి పడిపోయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని చెప్పింది. నటీనటులకు ఆటుపోట్లు అనేవి సాధారణం అని వివరించింది. వాటిని తట్టుకుని ముందుకు సాగినప్పుడే సక్సెస్ అందుకోగలుగుతామని వెల్లడించింది. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి, తెలుగు ప్రేక్షకుల నుంచి తనకు ఎంతో మంచి సపోర్టు ఉందని చెప్పింది.       

Read Also: అమ్మాయి రాస్తాలోకి ‘రాజు యాదవ్‘- లిరికల్ సాంగ్ తో అదరగొట్టేశాడంతే!

టాప్ హెడ్ లైన్స్

Eknath Harika New House : కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
కొత్త ఇంట్లోకి తెలుగు సీరియల్ జంట - నేను శైలజ కపుల్ నూతన గృహ శోభ
Oh Sukumari Review - ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
ఓ సుకుమారి రివ్యూ: అమ్మాయి ముట్టుకుంటే కరెంట్ షాకే... తిరువీర్, ఐశ్వర్య రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Godavari Serial Today July 17th: 'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
'గోదావరి' సీరియల్: నందు, మురళీల ఫస్ట్‌నైట్! గదిలో ట్విస్ట్‌లు మామూలుగా లేవుగా!
Kiara Advani : రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్
రొమాంటిక్ సాంగ్‌లో కియారా - సోషల్ మీడియాలో ట్రోలింగ్స్... టాక్సిక్ యాక్టర్ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget