Venkatesh AK47 : చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
Aadarsha Kutumbam Update : విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఏకే 47' నుంచి మరో సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ సినిమాలో వెంకీ రోల్ ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్.

Venkatesh As Chittibabu In Aadarsha Kutumbam : విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతోన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47'. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్తో పాటు క్రేజీ కాంబో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ప్రమోషన్స్లో భాగంగా ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా వెంకీ రోల్పై మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు.
చిట్టిబాబుగా...
ఈ సినిమాలు చిట్టిబాబు పాత్రలో వెంకీ కనిపించనున్నారు. ఫ్యామిలీ మ్యాన్గా ఆయన డీసెంట్ లుక్ అదిరిపోయింది. స్పెషల్ వీడియోలో వెంకీ రోల్ నవ్వులు పూయిస్తోంది. కొత్త హౌస్లోకి వెంకీ అండ్ ఫ్యామిలీ ఎంట్రీ ఇవ్వగా... 'నాన్నా నువ్వు ఈజీగా వంట చేసుకోవచ్చు. వాషింగ్ మెషీన్ కూడా ఉంది. ఈజీగా పనులు చేసుకోవచ్చు.' అంటూ హీరోయిన్ శ్రీనిధి శెట్టి వెంకటేశ్కు చెప్పడం నవ్వులు పూయిస్తోంది. దీనికి కమెడియన్ రఘుబాబు ఎక్స్ప్రెషన్స్, వెంకీ ఇరిటేషన్ కామెడీ పండించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ప్రస్తుతానికి వెంకీ చిట్టిబాబు పాత్రను పరిచయం చేయగా... త్వరలోనే హీరోయిన్ శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయంగా నిలవనున్నాయి. సహజమైన నటన, అద్భుతమైన కామెడీ టైమింగ్, కుటుంబ కథా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన వెంకటేష్ మరోసారి అన్ని వయసుల ప్రేక్షకులను అలరించే పాత్రతో రాబోతున్నారు. ఆనందం, అనుబంధాలు, కుటుంబ విలువలకు ప్రతిరూపంగా ఈ పాత్ర ఉండబోతోంది.
Also Read : Rishab Shetty : స్పైడర్ మ్యాన్తో రిషబ్ శెట్టి - నేను మీకు బిగ్ ఫ్యాన్... ఫ్యామిలీతో కలిసి మూవీకి...
ఎందుకంత స్పెషల్?
వెంకటేశ్, శ్రీనిధి శెట్టి కపుల్గా నటిస్తుండగా... ఇద్దరు పిల్లలు ఓ ఆత్మీయ కుటుంబ కథను త్రివిక్రమ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్గా నారా రోహిత్, రఘుబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ లెజెండ్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా... 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్పై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది.
హీరో వెంకీ కెరీర్లో ఇది 77వ సినిమా. త్రివిక్రమ్ - వెంకీ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. త్రివిక్రమ్ రచయితగా, వెంకీ హీరోగా వచ్చిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి', 'వాసు' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రాబోతోన్న ఏకే 47పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.
Also Read : Sai Kumar Birthday : మై నేమ్ ఈజ్ అగ్ని - హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్... డైలాగ్ కింగ్ బర్త్ డే స్పెషల్
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు























