Border 2 Release: నేను ధర్మేంద్ర కొడుకును... 'బోర్డర్ 2'లో సన్నీ డియోల్ నివాళికి ఫ్యాన్స్ ఫిదా
Sunny Deol Border 2 News: సన్నీ డియోల్ హీరోగా నటించిన 'బోర్డర్ 2' ఇవాళ విడుదలైంది. సినిమా కంటే ముందు టైటిల్ కార్డులో దివంగత తండ్రి ధర్మేంద్రకు నివాళులు అర్పించి అభిమానుల మనసు గెలుచుకున్నారు సన్నీ.

సన్నీ డియోల్ హీరోగా నటించిన 'బోర్డర్ 2' సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సంవత్సరం బాలీవుడ్ మొదటి బ్లాక్ బస్టర్ అంటున్నారు. సన్నీ డియోల్ నటనకు ఫ్యాన్స్, ఆడియన్స్ మరోసారి ఫిదా అయ్యారు. సినిమా సంగతి పక్కన పెడితే... దివంగత కథానాయకుడు, తన తండ్రి ధర్మేంద్రకు 'బోర్డర్ 2'లో సన్నీ డియోల్ నివాళులు అర్పించారు. ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
నేను ధర్మేంద్ర కొడుకును... 'బోర్డర్ 2' టైటిల్ కార్డు!
Border 2 Latest News: 'బోర్డర్ 2' ఓపెనింగ్ సీన్ చూడటానికి థియేటర్లకు వెళ్ళిన ప్రజలు... దివంగత బాలీవుడ్ లెజెండ్, సన్నీ డియోల్ తండ్రి ధర్మేంద్ర (Dharmendra)కు హృదయపూర్వక నివాళులు అర్పించడంతో ఆశ్చర్యపోయారు. టైటిల్ క్రెడిట్స్లో తనను తాను 'ధర్మేంద్ర కా బేఠా' (ధర్మేంద్ర జీ కొడుకును) అని సన్నీ డియోల్ పేర్కొన్నారు. అది చూసి చాలా మంది అభిమానులు సంతోషించారు.
ధర్మేంద్ర ప్రేరణతో 'బోర్డర్'... డియోల్ ఎమోషనల్
గత ఏడాది నవంబర్లో... 90వ పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందు ధర్మేంద్ర మరణించారు. తన తండ్రి మరణం తరువాత 'బోర్డర్' ఫ్రాంచైజీ (సినిమాల)తో తనకు ఉన్న లోతైన భావోద్వేగ సంబంధం గురించి సన్నీ డియోల్ మాట్లాడారు. ధర్మేంద్ర తనను సీక్వెల్ కోసం ఎలా ప్రేరేపించారో వివరించారు.
'హకీకత్' సినిమా గురించి సన్నీ డియోల్ మాట్లాడుతూ... "నేను 'బోర్డర్' ఎంచుకున్నాను. ఎందుకంటే... నేను మా నాన్నగారి 'హకీకత్' చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని. నేను నటుడిగా మారినప్పుడు నా తండ్రి సినిమా లాంటి సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను" అని అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ "నేను జె.పి. దత్తాతో మాట్లాడాను. లోంగేవాలా సబ్జెక్ట్పై ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా" అని అన్నారు.
Also Read: Sharwanand: నిర్మాత అనిల్ సుంకరకు శర్వానంద్ ప్రామిస్... ఇది బంపర్ ఆఫర్ అంటే!
యువతపై సన్నీ డియోల్ 'బోర్డర్' ప్రభావం
'బోర్డర్' సినిమా ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా యువతకు ఎలా నచ్చిందో... వాళ్ళపై ఎటువంటి ప్రభావం చూపిందో కూడా సన్నీ డియోల్ చెప్పారు. తన సినిమా ప్రజలను సాయుధ దళాలలో చేరడానికి ప్రేరేపిస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇంకా సన్నీ డియోల్ మాట్లాడుతూ "ఇంత మంది యువకులకు సాయుధ దళాలలో చేరడానికి ధైర్యం ఇస్తామని నాకు తెలియదు. నేను వారిని కలిసినప్పుడల్లా నా సినిమా చూసిన తర్వాత వారు ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నారని చెబుతారు. నేను ఎక్కడికి వెళ్లినా ఈ మాటలు వినబడతాయి" అని అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన 'బోర్డర్ 2' బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే మంచి ప్రారంభాన్ని అందుకుంది. కేవలం మార్నింగ్ షోల ద్వారా దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సన్నీ డియోల్ 'గదర్ 2' మొదటి రోజున 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ రికార్డును ఈ చిత్రం బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.
Before You Go
Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు






















