అన్వేషించండి

SSMB 29: మహేష్ బాబు సినిమా కోసం రాజమౌళి కీలక నిర్ణయం... సీక్వెల్ ట్రెండ్‌కు ఎండ్ కార్డ్... కారణం ఇదేనా?

SSMB 29 : మహేష్ బాబు సినిమా కోసం దర్శకుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మూవీతో ఆయన సీక్వెల్ ట్రెండ్ కు ఎండ్ కార్డ్ వేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటిదాకా రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కిస్తూ వస్తున్న జక్కన్న ఈ సినిమాతో ఆ ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. దానికి కారణం చాలామంది చిత్ర నిర్మాతలు రెండు భాగాలుగా సినిమాను తెరపై చూపించాలనే కాన్సెప్టును దుర్వినియోగం చేశారని, ఆర్థిక లాభాల కోసం ప్రాజెక్టులను సాగదీస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ చక్కర్లు కొడుతోంది.

పాత ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్న జక్కన్న 

మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లో పొందుతున్న 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమాన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2027 వేసవిలో ఈ సినిమా తెరపైకి రాబోతోంది. 2026 వరకు షూటింగ్ కంటిన్యూగా జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతుండగా, 'ఎస్ఎస్ఎంబి 29'కు సంబంధించిన మరో ప్రత్యేకమైన అప్డేట్ బయట కొచ్చింది. ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం రాజమౌళి ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీని రెండు భాగాలుగా తీయాలనే ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది. 

రాజమౌళి కెరీర్ లోనే లాంగెస్ట్ మూవీ 

ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి ఇప్పటిదాకా తాను కొనసాగించిన రెండు భాగాల సినిమా ట్రెండ్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. 'బాహుబలి'తో ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ట్రెండ్ ను ఆయన మొదలుపెట్టారు. అయితే 'ఎస్ఎస్ఎంబీ 29' వంటి భారీ స్టోరీని ఒకే భాగంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఫార్మాట్లో చెప్పాలని ఆలోచిస్తున్నారట. నిజానికి తను మొదలు పెట్టిన ఈ రెండు భాగాల కథ అనే కాన్సెప్ట్ ను నిర్మాతలు దుర్వినియోగం చేశారని, లాభాల కోసం సినిమాలను సాగదీస్తున్నారని రాజమౌళి భావిస్తున్నారట. అందుకే సింగిల్ పార్ట్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో తన స్క్రీన్ ప్లేను మార్చాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' లాగానే ఈ మూవీని కూడా మూడు గంటల 30 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి తీసుకురావాలనే నిర్ణయాన్ని రాజమౌళి తీసుకున్నారని సమాచారం. అలాగే రాజమౌళి కెరీర్ లోనే 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ అత్యధిక రన్ టైం ఉన్న సినిమా కావచ్చు అని అంటున్నారు. 

Also Read'హోమ్ టౌన్' రివ్యూ: రాజీవ్ కనకాలతో '90స్' మేజిక్ రీక్రియేట్ చేశారా? AHAలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ఇదిలా ఉండగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ కలిసి నటిస్తున్న 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. రాజమౌళి అంతర్జాతీయ చిత్ర నిర్మాతలతో కలిసి ఈ సినిమాను ప్రపంచ స్థాయిలో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్లాన్ కి సంబంధించిన పనులు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక 'ఎస్ఎస్ఎంబి 29' మూవీని డీవీవీ దానయ్య, కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాజమౌళి, మహేష్ బాబు ఈ సినిమాకు వచ్చే లాభాలలో 40% వాటాను రెమ్యూనరేషన్ గా తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Also Read'టచ్ మీ నాట్' రివ్యూ: Jiohotstarలో కొత్త వెబ్ సిరీస్... ఎస్పీగా నవదీప్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ఇస్తుందా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airport Viral Video: 'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
IndiGo Flights Cancelled : ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు విమర్శలు
ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Advertisement

వీడియోలు

PM Modi Protocol Break at Putin Welcome | రష్యా అధ్యక్షుడికి ఆత్మీయ ఆలింగనంతో మోదీ స్వాగతం | ABP Desam
Akhanda 2 Premieres Cancelled | భారత్ లో నిలిచిన బాలకృష్ణ అఖండ 2 ప్రీమియర్స్ | ABP Desam
Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam
Rupee Record Fall | ఘోరంగా పతనమవుతున్న రూపాయి విలువ | ABP Desam
సారీ రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ పోయినట్లే!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airport Viral Video: 'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
'నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి' ఎయిర్‌పోర్టులో ఓ తండ్రి ఆవేదన వైరల్!ఇండిగో నిర్లక్ష్యంపై ఆగ్రహం
IndiGo Flights Cancelled : ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు విమర్శలు
ఇండిగో వివాదంపై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్! వాళ్లు ఫోన్లో మాట్లాడటానికి భయపడుతున్నారని విమర్శలు
Narasaraopet Crime News: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం- ఆపరేషన్ చేసి కడుపులో సర్జికల్  బ్లేడు వదిలేసిన వైద్యులు
Varanasi : మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
మహేష్ 'వారణాసి' ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ ప్రైజ్!
Maoists Letter :
"హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణం- మాతోనే దేవ్‌జీ" మావోయిస్టుల పేరుతో సంచలన లేఖ వైరల్
19 Minute Viral Video: వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
వైరల్‌ వీడియో పేరుతో సైబర్ మోసం! లింక్‌లు టచ్ చేస్తే మీ ఖాతా ఖాళీ! క్లిక్ చేసే ముందు ఆలోచించండి!
IndiGo Flights Cancelled: ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
ఇండిగోలో తీవ్ర సంక్షోభం- సర్వీస్‌ల్లో తీవ్ర అంతరాయం - శంషాబాద్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళన
RBI Repo Rate:రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన RBI, తగ్గనున్న EMIలు
Embed widget