Singer Chinmayi : 'ద్రౌపది' సాంగ్ వివాదం - సారీ చెప్పిన చిన్మయి
Draupadi 2 Movie : సింగర్ చిన్మయి ఓ సాంగ్ పాడినందుకు క్షమాపణలు చెప్పారు. డైరెక్టర్ మోహన్ జి దర్శకత్వం వహించిన 'ద్రౌపది 2'లో పాట పాడినందుకు సారీ చెబుతూ పోస్ట్ చేశారు. అసలు రీజన్ ఏంటంటే?

Singer Chinmayi Apologise About Singing Emkoney Song In Draupadi 2 Movie : సింగర్ చిన్మయి ఓ సినిమాలో పాట పాడినందుకు సారీ చెప్పారు. రీసెంట్గా రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటించిన 'ద్రౌపది 2' మూవీలో ఆమె తమిళంలో 'ఎమ్కోనీ' పాట పాడారు. ఈ మూవీకి మోహన్ జి దర్శకత్వం వహించగా విమర్శలకు ముందే ఆమె క్షమాపణలు చెప్పారు.
అసలు రీజన్ ఏంటంటే?
డైరెక్టర్ మోహన్.జి ఎక్కువగా యాంటీ దళిత్ మూవీస్ తీస్తున్నారంటూ మొదటి నుంచీ ఆయనపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సింగర్ చిన్మయి ఆ సినిమాలో పాట పాడడంతో ముందే రియాక్ట్ అయ్యారు. 'ఇది మోహన్ జి సినిమా అని నాకు ముందే తెలిసి ఉంటే నేను ఈ పాట పాడేదాన్ని కాదు.' అంటూ చెప్పడం సంచలన కలిగిస్తోంది.
ఆమె ఏం చెప్పారంటే?
ఈ మూవీకి జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తుండడంతో ఆ పరిచయంతో వెళ్లి పాడానని... అంతే తప్ప ఇది మోహన్ జి సినిమా నాకు తెలియదని అన్నారు చిన్మయి. 'ముందుగా ఎమ్కోనీకి నా హృదయపూర్వక క్షమాపణలు. జిబ్రాన్ నాకు 18 ఏళ్లుగా తెలుసు. ఈ పాట కోసం ఆయన ఆఫీస్ నుంచి కాల్ రాగానే నేను నార్మల్గా వెళ్లి పాడేశాను. ఈ సెషన్లో గిబ్రాన్ హాజరు కాలేదు. పాట కోసం స్వరం ఎలా వినిపించాలో నాకు ఒక ఆలోచన ఇచ్చారు.
అలాగే నేను సాంగ్ రికార్డింగ్ పూర్తి చేసి వెళ్లిపోయాను. నాకు దీని గురించి ముందే తెలిసి ఉంటే నేను అస్సలు పాడే దాన్ని కాదు. డైరెక్టర్ మోహన్ జి భావజాలం, సిద్ధాంతాలు నా దానికి పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది నిజం.' అంటూ ఆమె రాసుకొచ్చారు.
At the outset, my heartfelt apologies for Emkoney.
— Chinmayi Sripaada (@Chinmayi) December 1, 2025
Ghibran is a composer I have known for 18 years since my jingle singing days. When his office called for this song, I just went & sang as I usually do. If I remember right, Ghibran wasn't present during this session - I was…
Also Read : ఓటీటీలోకి రష్మిక హారర్ థ్రిల్లర్ 'థామా' - 2 భాషల్లో స్ట్రీమింగ్... చిన్న ట్విస్ట్ ఏంటంటే?
చిన్మయి ట్వీట్పై మోహన్ జి రియాక్ట్ అయ్యారు. 'నా సినిమాలో యాక్టర్స్, టెక్నికల్ టీం లేదా ద్రౌపది 2లో నాతో పని చేసే వారిని టార్గెట్ చెయ్యొద్దు. నా సినిమా ఏది మాట్లాడినా అది నా సొంత సృష్టి. భావజాలం. మీ టార్గెట్ నేనే. నాతో, నా ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న వారిని టార్గెట్ చెయ్యొద్దు. అలా చేయడం ఓ రకమైన పిరికితనం.' అంటూ రాసుకొచ్చారు.
మోహన్ జి తొలినాళ్లలో 'పజాయ వన్నారపెట్టై' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆశించినంత రెస్పాన్స్ రాకపోవడంతో ఆ తర్వాత దళిత సంబంధిత కథలకు వ్యతిరేకంగా మూవీస్ తీశారు. 'ద్రౌపది' చిత్రానికి కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. రీసెంట్గా 14వ శతాబ్దంలో 'ద్రౌపది 2' చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ త్వరలోనే పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.





















