Ram Charan : రామ్ చరణ్కు చేతికి సర్జరీ - లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
Ram Charan Surgery : పెద్ది షూటింగ్ టైంలో రామ్ చరణ్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ప్రమోషనల్ ఈవెంట్స్కు కూడా ఆయన సపోర్ట్ బ్రేస్తో హాజరవుతున్నారు. త్వరలోనే ఆయనకు సర్జరీ జరగనుంది.

Ram Charan Surgery After Peddi Release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అవెయిటెడ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. షూటింగ్ టైంలో ఆయన కంటికి, చేతికి గాయాలు కాగా... కంటికి చిన్న సర్జరీ చేయించుకుని వెంటనే షూటింగ్లో జాయిన్ అయ్యారు. చేతి మణికట్టుకు కూడా గాయం కావడంతో సపోర్ట్ బ్రేస్తో ప్రమోషనల్ ఈవెంట్స్లో సపోర్ట్ బ్రేస్తో కనిపిస్తున్నారు. మూవీ రిలీజ్ అయిన తర్వాత చరణ్ సర్జరీ చేయించుకోనున్నారు.
అందుకే గాయం
పెద్ది షూటింగ్ టైంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు బలంగా కింద పడడంతో తన చేతిలోని కార్టిలేజ్కు గాయమైందని చరణ్ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత మణికట్టుకు సర్జరీ చేయించుకుంటానని తెలిపారు. క్రికెట్, రెజ్లింగ్, రన్నింగ్ స్పోర్ట్స్ ప్రధానాంశంగా సినిమా తెరకెక్కగా... కుస్తీ సీన్స్ చేసేటప్పుడు ఆయనకు గాయమైనట్లు ఇటీవల ఇంటర్వ్యూలో నిర్మాత వెంకట సతీష్ కిలారు తెలిపారు.
యాక్షన్ సీక్వెన్స్ కోసం చరణ్ ప్రాణం పెట్టారని డైరెక్టర్ బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గాయాలైనా వెనక్కి తగ్గలేదని... ఓ కుస్తీ ఎపిసోడ్ చాలా మాస్గా ఉంటుందని... ఇప్పటివరకూ ఎవరూ చేయలేదని అన్నారు. సినిమాలో జాతీయ స్థాయిలో జరిగే కుస్తీ పోటీలుంటాయన్నారు.
Also Read : జూన్లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'
ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?
ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటికే భోపాల్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీలో ఈవెంట్స్ ప్రెస్ మీట్స్ నిర్వహించారు. చరణ్తో పాటు మూవీ టీం సందడి చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్కు కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. విజయవాడలోని ఇందిరా గాంధీ గ్రౌండ్స్ వేదికగా జూన్ 1న (సోమవారం) ఈవెంట్ నిర్వహించనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. జూన్ 4న వరల్డ్ వైడ్గా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : బాలకృష్ణ కూతురు డ్యాన్స్ అదుర్స్... తేజస్విని స్టెప్స్, ఆ వీడియో చూశారా?
ట్రెండింగ్ వార్తలు





















