అన్వేషించండి

Rajinikanth - Nagarjuna: 32 ఏళ్ల తర్వాత కలిసి నటించనున్న నాగార్జున, రజనీకాంత్ - ఆ సినిమా కోసమే!

Rajinikanth - Nagarjuna: రజనీకాంత్, నాగార్జున కలిసి 1991లో విడుదలయిన ‘శాంతి క్రాంతి’ మూవీలో కలిసి కనిపించారు. 32 ఏళ్ల తర్వాత మరోసారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Rajinikanth And Nagarjuna To Act Together Soon: ఒకప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా మల్టీ స్టారర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో హీరోలు ఎక్కువగా ఎవరు ప్రాజెక్ట్స్‌లో వారు బిజీగా ఉండడంతో ఇతర హీరోలతో కలిసి నటించే అవకాశం ఎక్కువగా ఉండడం లేదు. కానీ తమిళంలో మాత్రం రెగ్యులర్‌గా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్స్‌ను వర్కవుట్ చేయడానికే ప్రయత్నిస్తున్నారు దర్శకులు. అందుకే 32 ఏళ్ల క్రితం కలిసి నటించిన నాగార్జున, రజనీకాంత్ కాంబినేషన్‌ను మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వర్కవుట్ అయ్యేలా చేయాలని చూస్తున్నాడు ఓ యంగ్ డైరెక్టర్. రజనీ హీరోగా నటించనున్న తరువాతి చిత్రంలో నాగ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

రజనీతో నాగ్..

సూపర్ స్టార్ రజనీకాంత్ మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ నో చెప్పరు. ఆయన చివరి చిత్రం ‘జైలర్’లో కూడా కన్నడ హీరో శివ రాజ్‌కుమార్, మలయాళ స్టార్ మోహన్‌ లాల్‌తో కలిసి నటించారు. ఇప్పుడు నాగార్జునతో కలిసి నటించడానికి సిద్ధమవుతున్నారు. యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ డైరెక్షన్‌లో రజనీ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘తలైవార్ 171’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగార్జున కూడా నటించనున్నట్టు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం నాగార్జున మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం మరెందరో స్టార్లను రంగంలోకి దించనున్నాడట లోకేశ్.

చివరిగా 1991లో..

‘తలైవార్ 171’లో నాగార్జున కూడా ఓ పాత్ర చేస్తే బాగుంటుందని ఆయనను సంప్రదించాడట దర్శకుడు లోకేశ్ కనకరాజ్. అయితే నాగార్జున ఇంకా ఈ మూవీని ఓకే చేశారా లేదా అన్న విషయం మాత్రం బయటికి రాలేదు. ఒకవేళ ఇదే నిజమయితే 32 ఏళ్ల తర్వాత నాగార్జున, రజనీకాంత్‌ను ఒకే స్క్రీన్‌పై చూడనున్నారు ప్రేక్షకులు. వీరిద్దరూ చివరిగా 1991లో విడుదలయిన ‘శాంతి క్రాంతి’ అనే చిత్రంలో కలిసి కనిపించారు. ఇక నాగార్జున సైతం ఎప్పటినుండి అయినా మల్టీ స్టారర్లను ఎక్కువగానే ఇష్టపడతారు. ప్రస్తుతం ధనుష్‌తో కలిసి ‘కుబేర’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు నాగ్. ఇప్పుడు రజనీకాంత్ మూవీని కూడా కచ్చితంగా ఓకే చేస్తారని ప్రేక్షకులు భావిస్తున్నారు.

Also Read: కొరటాల చేసిన తప్పు నాగ్ అశ్విన్ చెయ్యలేదు - ఆచార్యకు, కల్కికి తేడా అదే మరి!

బాలీవుడ్ హీరో కూడా..

నాగార్జునను మాత్రమే కాదు... ఇంతకు ముందే ‘తలైవార్ 171’లో గెస్ట్ రోల్ చేయడం కోసం బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్‌ను కూడా సంప్రదించాడట లోకేశ్ కనకరాజ్. సౌత్ సినిమాలు అన్నా.. సౌత్ యాక్టర్స్ అన్నా.. రణవీర్‌కు ఇష్టం కాబట్టి ఈ గెస్ట్ రోల్‌ను తాను ఓకే చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం నాగార్జున, రణవీర్ సింగ్ పేర్లు మాత్రమే బయటికొచ్చినా.. మరెందరో స్టార్లను కూడా ఈ సినిమా కోసం సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నాడట లోకేశ్. ప్రస్తుతం రజనీకాంత్.. జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వెట్టయాన్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే ‘తలైవార్ 171’ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు.

Also Read: కల్కి రిలీజ్ జూన్‌లో... ఆ రెండు రోజుల్లో ఏదో ఒక తేదీన ప్రేక్షకుల ముందుకు ప్రభాస్ సినిమా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
NEET UG 2026 పరీక్షకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోండి.. అప్లికేషన్ పూర్తి ప్రక్రియ వివరాలు
Aamir Khan Weight Loss : జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
జిమ్​కి వెళ్లకుండానే బరువు తగ్గిన అమీర్ ఖాన్.. మైగ్రేన్ కోసం డైట్ ఫాలో అయి 18 కిలోలు తగ్గిన హీరో
RTC Bus Overturns: డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
డ్రైవింగ్ చేస్తుండగా ఫిట్స్.. పొలాల్లోకి దూసుకెళ్లి ఆర్టీసీ బస్సు బోల్తా - విజయనగరంలో ఘటన
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
Embed widget