Peddi: 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా
Peddi Nizam Release: 'పెద్ది' రిలీజ్ విషయంలో నెలకొన్న హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడింది. దిల్ రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా రిలీజ్ కానుంది. దాంతో నైజాంలో రికార్డులు జాతరకు రెడీ అవుతోంది 'పెద్ది'.

- దిల్ రాజు థియేటర్లలో 'పెద్ది' సినిమా విడుదల అవుతుంది.
- సింగిల్ స్క్రీన్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ డిమాండ్ సమస్య పరిష్కరించబడింది.
- ఎస్వీసీ థియేటర్లతో పాటు పలు ముఖ్య థియేటర్లలో సినిమా విడుదల ఖరారు.
- నైజాంలో 'పెద్ది' భారీ ఎత్తున విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
'దిల్' రాజు థియేటర్లలో 'పెద్ది' విడుదల అవుతుందా? లేదా? తమకు రెంటల్ సిస్టమ్ వద్దని, పర్సెంటేజ్ కావాలని సింగిల్ స్క్రీన్ ఓనర్స్, ఎగ్జిబిటర్స్ చేసిన డిమాండ్ - ఆ ఇష్యూ ఎఫెక్ట్ 'పెద్ది'పై ఎంత ఉంటుంది? వంటి ప్రశ్నలకు తెర పడింది. 'పెద్ది' రిలీజ్ విషయంలో నెలకొన్న హై డ్రామాకు ఫుల్ స్టాప్ పడినట్టే. 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా విడుదల కానుంది. నైజాంలో రికార్డుల జాతరకు 'పెద్ది' రెడీ అవుతోంది.
ఎస్వీసీ థియేటర్లలో 'పెద్ది' రిలీజ్
తెలుగు చిత్ర పరిశ్రమలో 'పెద్ది' డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. 'దిల్' రాజు - శిరీష్ సోదరులకు చెందిన ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ అనుబంధ సంస్థ - మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ గురించి అందరికీ తెలుసు. ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ గొడవ కూడా వాళ్ళిద్దరి మధ్య అన్నట్టు సాగింది. దానికి తోడు ఆదివారం విడుదల చేసిన 'పెద్ది' నైజాం థియేటర్ల లిస్టులో ఎస్వీసీ థియేటర్లు లేవు. దాంతో 'పెద్ది' విడుదల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదని, దిల్ రాజు థియేటర్లలో సినిమా విడుదల ఉండకపోవచ్చని అనుమానాలు తలెత్తాయి. వాటికి చెక్ పడింది.
నైజాం ఏరియాలోని ఎస్వీసీ సంస్థకు చెందిన అత్యధిక థియేటర్లలో 'పెద్ది' కూడా విడుదల కానుంది. సినిమా షోలు ఉంటాయని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ అంశంలో అగ్రిమెంట్ కూడా జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్లోని రెండు మేజర్ స్క్రీన్లు ఉన్నాయి. అలాగే, హైదరాబాద్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ - దేవి థియేటర్ కాంప్లెక్స్లో కూడా 'పెద్ది' విడుదల కానుంది. దీంతో నైజాంలో భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది.
Photo Gallery: Priyanka Chopra Swimsuit Holiday - స్విమ్సూట్లో గ్లోబల్ స్టార్... మహేష్ 'వారణాసి' బ్రేక్లో ప్రియాంక చోప్రా ఏం చేసిందో చూశారా?
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమాల్లో నైజాం ఇప్పటి వరకు 'పెద్ది' సినిమాయే భారీ స్థాయి విడుదల అవుతున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తోంది. ఇంతకు ముందు మైత్రి ఇతర సినిమాలకు ఈ స్థాయిలో థియేటర్లు దొరకలేదు. ఇప్పుడు 'పెద్ది' నిర్మాతలు తెలంగాణలో టికెట్ రేట్స్ హైక్, ఎక్స్ట్రా షోస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు.
Photo Gallery: Rashmika Vijay Deverakonda Japan Trip - జపాన్ వీధుల్లో రష్మిక... హనీమూన్ తర్వాత భర్త విజయ్ దేవరకొండతో కలిసి
సమ్మర్ సీజన్లో సరైన సినిమా టాలీవుడ్ నుంచి రాలేదు. వేసవి వృథా అయ్యింది. ఈ తరుణంలో 'పెద్ది' లాంటి భారీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రేక్షకులు వస్తారని చెప్పడంలో సందేహాలు అవసరం లేదు. అయితే... రిలీజ్ ముందు కొంత హైడ్రామా నెలకొనడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు దానికి చెక్ పడింది. ఇప్పుడు బాక్సాఫీస్ బరిలో 'పెద్ది' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Photo Gallery: Naga Chaitanya Surprises Sobhita Dhulipala - శోభిత బర్త్ డే... ఆడియన్స్కు నాగ చైతన్య షాక్
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు






















