అన్వేషించండి

Nayanthara: నేను ఎందుకు భయపడాలి? - ధనుష్ వివాదంపై నోరు విప్పిన నయన్... లేడీ సూపర్ స్టార్ ఏమన్నారంటే?

Nayanthara Reacts To Dhanush Controversy: 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ నయన్ - ధనుష్ మధ్య చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయంపై నయనతార స్పందించింది.

రీసెంట్ గా నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసింది. ఈ డాక్యుమెంటరీ తమిళ ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ అయిన నయనతార, ధనుష్ మధ్య వివాదానికి తెర తీసింది. ఈ వివాదంపై ఇటు నయనతార, అటు ధనుష్ లీగల్ గా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా నయనతార ధనుష్ తో వివాదంపై స్పందించింది. 

ధనుష్ వివాదంపై నయన్ ఫస్ట్ రియాక్షన్ 
తాజా ఇంటర్వ్యూలో నయనతార ధనుష్ తో వివాదంపై మౌనం వీడి, తను అంత స్ట్రాంగ్ గా ఎందుకు రియాక్ట్ కావలసి వచ్చిందో వివరించింది. అంతేకాకుండా డాక్యుమెంటరీ కంటెంట్ వెనక తన టీంకు ఉన్న ఉద్దేశాలని కూడా ఈ బ్యూటీ సమర్ధించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార ఈ వివాదం గురించి స్పందిస్తూ "ధైర్యం మన దగ్గర నిజమున్నప్పుడు మాత్రమే వస్తుంది. నేను ఏదైనా కల్పించి చేస్తున్నప్పుడు భయపడాలి. అలా చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే పరిస్థితులు చేయి దాటిన తర్వాత మళ్లీ తమ కోసం నిలబడే ధైర్యం ఎవరికీ ఉంటుందని నేను అనుకోను. నాకు సరైనది అని అనిపించిన పని చేయడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఒకరి ప్రతిష్టను దిగజార్చాలని కోరుకునే వ్యక్తిని కాదు నేను" అంటూ చెప్పుకొచ్చింది నయనతార. 

ఇక తన బహిరంగ లేఖ డాక్యుమెంటరీ పబ్లిసిటీ స్టంట్ గా ఉపయోగపడదని, ఈ సందర్భంగా నయనతార స్పష్టం చేసింది. నయన్ మాట్లాడుతూ "నయనతార : బియాండ్ ది టేల్ అనేది సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి కాదు. వ్యక్తిగత స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం మాత్రమే. మేము ధనుష్ ను రైట్స్ గురించి అడగడానికి చాలా ట్రై చేశాము. కానీ వర్కౌట్ కాలేదు. నా వ్యక్తిగత ప్రయాణాన్ని వివరించే ఈ డాక్యుమెంటరీలో 'నేనూ రౌడీనే' సినిమా నుంచి కేవలం కొన్ని సీన్స్ ను మాత్రమే ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఇస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం. ఇవ్వలేదు కాబట్టి సినిమాలోని సన్నివేశాలు కాకుండా విగ్నేష్ కు సంబంధించిన కొన్ని బియాండ్ సీన్స్ మాత్రమే తీసుకున్నాము. ఎన్ఓసీ ఇవ్వకపోయినా పర్లేదు. కనీసం అసలు ఇష్యూ ఏంటో తెలుసుకుందాం అని ధనుష్ మేనేజర్ తో కూడా మాట్లాడాను. బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం అని ట్రై చేశాను. కానీ అది కూడా కుదరలేదు. ఈ డాక్యుమెంటరీ మా జీవితం, మా ప్రేమ, మా పిల్లలకు సంబంధించినది. ఇలాంటి ఒక పాపులర్ యాక్టర్ ఇలా చేస్తాడని ఊహించలేదు. మేము సినిమాలోని పాటలు, సీన్స్ ఏమీ ఉపయోగించలేదు. కాబట్టి పెద్దగా పట్టించుకోరు అనుకున్నాను. కానీ ఆయన ఇలా వ్యవహరించడం అన్యాయం అన్పించింది" అంటూ ఆ సినిమాతో తనకు ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీని వివరించింది.

Also Read: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్

అసలు వివాదం ఏంటంటే?
నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా 'నేనూ రౌడీనే'. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి హీరోగా కన్పించారు. ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై 2015లో ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా టైమ్ లోనే నయనతార, విగ్నేష్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అందుకే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకుంటానని నయనతార ధనుష్ ను రిక్వెస్ట్  చేసిందట. కానీ ఆయన రెస్పాండ్ కాకపోవడంతో సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను యాడ్ చేసి, నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఆ సీన్స్ ను తొలగించాలని, లేదంటే 7 కోట్లు చెల్లించాలి అంటూ నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. అక్కడే ముదిరింది వివాదం. నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక సుధీర్ఘమైన నోట్ ను రిలీజ్ చేస్తూ ధనుష్ పై విరుచుకుపడింది. ఆ తరువాత కూడా ధనుష్ తగ్గకపోవడంతో ఇద్దరూ లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. ఇదిలా ఉండగా... నయనతార డాక్యుమెంటరీ 'నయనతార ; బియాండ్ ది ఫెయిరీ టేల్' 2024 నవంబర్ 18న నెట్ ఫిక్స్ లో రిలీజ్ అయింది.

Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget