అన్వేషించండి

Nayanthara: నేను ఎందుకు భయపడాలి? - ధనుష్ వివాదంపై నోరు విప్పిన నయన్... లేడీ సూపర్ స్టార్ ఏమన్నారంటే?

Nayanthara Reacts To Dhanush Controversy: 'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్' డాక్యుమెంటరీ నయన్ - ధనుష్ మధ్య చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయంపై నయనతార స్పందించింది.

రీసెంట్ గా నయనతార వ్యక్తిగత జీవితానికి సంబంధించిన డాక్యుమెంటరీ 'నయనతార : బియాండ్ ది ఫెయిరీ టేల్' అనే పేరుతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన విషయం తెలిసింది. ఈ డాక్యుమెంటరీ తమిళ ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ అయిన నయనతార, ధనుష్ మధ్య వివాదానికి తెర తీసింది. ఈ వివాదంపై ఇటు నయనతార, అటు ధనుష్ లీగల్ గా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా నయనతార ధనుష్ తో వివాదంపై స్పందించింది. 

ధనుష్ వివాదంపై నయన్ ఫస్ట్ రియాక్షన్ 
తాజా ఇంటర్వ్యూలో నయనతార ధనుష్ తో వివాదంపై మౌనం వీడి, తను అంత స్ట్రాంగ్ గా ఎందుకు రియాక్ట్ కావలసి వచ్చిందో వివరించింది. అంతేకాకుండా డాక్యుమెంటరీ కంటెంట్ వెనక తన టీంకు ఉన్న ఉద్దేశాలని కూడా ఈ బ్యూటీ సమర్ధించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నయనతార ఈ వివాదం గురించి స్పందిస్తూ "ధైర్యం మన దగ్గర నిజమున్నప్పుడు మాత్రమే వస్తుంది. నేను ఏదైనా కల్పించి చేస్తున్నప్పుడు భయపడాలి. అలా చేయనప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మాట్లాడకపోతే పరిస్థితులు చేయి దాటిన తర్వాత మళ్లీ తమ కోసం నిలబడే ధైర్యం ఎవరికీ ఉంటుందని నేను అనుకోను. నాకు సరైనది అని అనిపించిన పని చేయడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఒకరి ప్రతిష్టను దిగజార్చాలని కోరుకునే వ్యక్తిని కాదు నేను" అంటూ చెప్పుకొచ్చింది నయనతార. 

ఇక తన బహిరంగ లేఖ డాక్యుమెంటరీ పబ్లిసిటీ స్టంట్ గా ఉపయోగపడదని, ఈ సందర్భంగా నయనతార స్పష్టం చేసింది. నయన్ మాట్లాడుతూ "నయనతార : బియాండ్ ది టేల్ అనేది సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ గురించి కాదు. వ్యక్తిగత స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం మాత్రమే. మేము ధనుష్ ను రైట్స్ గురించి అడగడానికి చాలా ట్రై చేశాము. కానీ వర్కౌట్ కాలేదు. నా వ్యక్తిగత ప్రయాణాన్ని వివరించే ఈ డాక్యుమెంటరీలో 'నేనూ రౌడీనే' సినిమా నుంచి కేవలం కొన్ని సీన్స్ ను మాత్రమే ఇవ్వమని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఇస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం. ఇవ్వలేదు కాబట్టి సినిమాలోని సన్నివేశాలు కాకుండా విగ్నేష్ కు సంబంధించిన కొన్ని బియాండ్ సీన్స్ మాత్రమే తీసుకున్నాము. ఎన్ఓసీ ఇవ్వకపోయినా పర్లేదు. కనీసం అసలు ఇష్యూ ఏంటో తెలుసుకుందాం అని ధనుష్ మేనేజర్ తో కూడా మాట్లాడాను. బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా అసలు సమస్య ఏంటో తెలుసుకుందాం అని ట్రై చేశాను. కానీ అది కూడా కుదరలేదు. ఈ డాక్యుమెంటరీ మా జీవితం, మా ప్రేమ, మా పిల్లలకు సంబంధించినది. ఇలాంటి ఒక పాపులర్ యాక్టర్ ఇలా చేస్తాడని ఊహించలేదు. మేము సినిమాలోని పాటలు, సీన్స్ ఏమీ ఉపయోగించలేదు. కాబట్టి పెద్దగా పట్టించుకోరు అనుకున్నాను. కానీ ఆయన ఇలా వ్యవహరించడం అన్యాయం అన్పించింది" అంటూ ఆ సినిమాతో తనకు ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీని వివరించింది.

Also Read: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్

అసలు వివాదం ఏంటంటే?
నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా 'నేనూ రౌడీనే'. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా, విజయ్ సేతుపతి హీరోగా కన్పించారు. ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై 2015లో ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా టైమ్ లోనే నయనతార, విగ్నేష్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అందుకే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తన డాక్యుమెంటరీలో వాడుకుంటానని నయనతార ధనుష్ ను రిక్వెస్ట్  చేసిందట. కానీ ఆయన రెస్పాండ్ కాకపోవడంతో సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను యాడ్ చేసి, నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దీంతో ఆ సీన్స్ ను తొలగించాలని, లేదంటే 7 కోట్లు చెల్లించాలి అంటూ నయనతారకు ధనుష్ లీగల్ నోటీసులు పంపారు. అక్కడే ముదిరింది వివాదం. నయనతార సోషల్ మీడియా వేదికగా ఒక సుధీర్ఘమైన నోట్ ను రిలీజ్ చేస్తూ ధనుష్ పై విరుచుకుపడింది. ఆ తరువాత కూడా ధనుష్ తగ్గకపోవడంతో ఇద్దరూ లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. ఇదిలా ఉండగా... నయనతార డాక్యుమెంటరీ 'నయనతార ; బియాండ్ ది ఫెయిరీ టేల్' 2024 నవంబర్ 18న నెట్ ఫిక్స్ లో రిలీజ్ అయింది.

Also Read: అల్లు అర్జున్‌కు సారీ చెప్పలేదు కానీ... పుష్ప 2, జేసీబీ కామెంట్స్ మీద సిద్ధూ లేటెస్ట్ రియాక్షన్!

టాప్ హెడ్ లైన్స్

Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hrudhayam Murali Trailer : 20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
OG Sequel : పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget