Ajith Kumar : సోషల్ మీడియా అంతా ఏకే కంట్రోల్లో.. ఓటు వేసిన అజిత్.. స్పెషల్ ఏంటో తెలుసా?
Ajith Kumar Vote : కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినిమాల పరంగా విజయ్కి పోటీనిచ్చే హీరో అజిత్ ఓటు ఎవరికి వేస్తారనేది కూడా చాలా ఎగ్జైట్ చేస్తోంది.

Ajith Kumar Casts Vote: తమిళనాడు, పశ్చిమ బెంగాల్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా, ఈసారి తమిళనాడు ఎన్నికల రిజల్ట్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పోటీ చేయడమే. ఆయన కొత్త పార్టీ పెట్టి, ఈ ఎన్నికల బరిలో దిగడంతో, ఈసారి తమిళనాడులో ఎవరు గెలుస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, సెలబ్రిటీలు ఎవరెవరు విజయ్కి సపోర్ట్గా నిలుస్తారనేది కూడా హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో సినిమాల పరంగా విజయ్కి పోటీనిచ్చే హీరో అజిత్ ఓటు ఎవరికి వేస్తారనేది కూడా చాలా ఎగ్జైట్ చేస్తోంది.
మొదటి నుంచి అజిత్ కుమార్ ఇలాంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారు. ఓటు వేసే విషయంలో ఎప్పుడూ తన రెస్పాన్సిబిలిటీని ప్రదర్శించే అజిత్ కుమార్ ఈసారి కూడా.. పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికలలో ఓటు వేసిన మొదటి సెలబ్రిటీగా కూడా ఆయన సోషల్ మీడియాలో గుర్తింపు పొందుతున్నారు. అవును, గురువారం చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రానికి నటుడు అజిత్ కుమార్ చాలా సాధారణంగా, నిరాడంబరంగా వచ్చారు. ఎటువంటి హంగామా లేకుండా, భద్రతా సిబ్బంది హడావిడి లేకుండా.. ఒక సాధారణ పౌరుడిలా క్యూలో నిలబడి ఓటు వేసి వెళ్లారు. ఆయన రాకతో అక్కడి ఓటర్లు, అభిమానులు ఆశ్చర్యపోయినా, ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావడాన్ని అందరూ అభినందించారు.
దీంతో సోషల్ మీడియా అంతా ఏకే కంట్రోల్లోకి వచ్చేసింది. ఎన్నికల బరిలో విజయ్ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అజిత్ పేరు టాప్లో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం ఆయన ఓటు వేసిన విధానమే. అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి కాబట్టే.. అభిమానులు ఆయనని దేవుడిలా భావిస్తుంటారు. మరో వైపు మైలాపూర్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ఆమె ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘నా ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తేనే అర్థమవుతోంది. ఓటు వేయడం నా అతిపెద్ద ప్రజాస్వామ్య హక్కు, ఒక పౌరురాలిగా ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు. ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇదే సరైన సమయం, అంతా వారి చేతుల్లోనే ఉంది’’ అంటూ, రాష్ట్రంలోని ఓటర్లందరూ తమ బాధ్యతను గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.
తమిళనాడులో ప్రధాన ఎన్నికల పోరు డీఎంకే నేతృత్వంలోని కూటమి (కాంగ్రెస్, డీఎండీకే, వీసీకే భాగస్వామ్యంతో), ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ (బీజేపీ, పీఎంకే భాగస్వామ్యంతో) మధ్య సాగుతోంది. ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ తన పార్టీ ‘టీవీకే’ (TVK)తో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఈసారి ఎన్నికల్లో కొత్త మలుపుగా మారింది. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Also Read : డింపుల్ హయతికి మెగా ఛాన్స్... చిరు - బాబీ సినిమాలో అలాంటి పాత్రనా?
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















