అన్వేషించండి

Varalakshmi Sarathkumar : డ్రగ్స్ కేసులో నాకు నోటీసులా? - స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్

డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కు నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దానిపై ఆమె స్పందించారు. 

తమిళ చలన చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కేసు కలకలం సృష్టించింది. కేరళ తీరంలో మొదలైన కేసు, కోలీవుడ్ తీరాన్ని తాకిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. మరీ ముఖంగా తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితురాలైన తమిళ నటి, నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి (Varalakshmi Sarathkumar)కి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. దాంతో ఆవిడ స్పందించారు. 

నాకు సమన్లు రాలేదు...
హాజరు కావాలని ఆదేశాలు లేవు
''ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా ఈ సమస్య గురించి స్పష్టత ఇవ్వడం ముఖ్యమని నేను భావించాను. నాకు ఎన్ఐఏ సమన్లు ఇచ్చిందని జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమే. అవన్నీ పుకార్లు మాత్రమే. నాకు ఎటువంటి సమన్లు జారీ చేయలేదు. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎవరూ ఆదేశించలేదు. నేను కూడా ఎక్కడికి వెళ్ళలేదు'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ లేఖ విడుదల చేశారు. అసలు, ఆమె పేరు డ్రగ్స్ కేసులో ఎందుకు వచ్చింది? కారణం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 

ఆగస్టు 18న కేరళలోని ఓ ఫిషింగ్ బోటును ఎన్ఐఏ అధికారులు సీజ్ చేశారు. ఆ బోటులో సుమారు 300 కేజీల కొకైన్ దొరికింది. దాని విలువ సుమారు రూ. 2100 కోట్లు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు... వరలక్ష్మి దగ్గర గతంలో పనిచేసిన మేనేజర్ ఆదిలింగం (Adilingam)కి కూడా సమన్లు జారీ చేశారు. దాంతో నెక్స్ట్ టార్గెట్ వరలక్ష్మీ శరత్ కుమార్ అంటూ ప్రచారం మొదలైంది. 

ఆదిలింగంతో సంబంధం లేదు - వరలక్ష్మి
ఆదిలింగం పేరుతో డ్రగ్స్ కేసులో తన పేరు ముడిపెడుతూ వరుస కథనాలు వచ్చి పడుతుండటంతో అతని గురించి కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ స్పందించారు. ''మూడేళ్ళ క్రితం నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్ గా ఆదిలింగం పని చేశారు. నేను ఆ సమయంలో వేరే ఫ్రీలాన్స్ మేనేజర్లతో కూడా వర్క్ చేశా. ఆదిలింగంతో పని చేసినది కొన్ని రోజులు మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనితో మాటలు కూడా లేవు. దాంతో వార్తల్లో నా పేరు రావడం చూసి షాక్ అయ్యాను'' అని వరలక్ష్మీ శరత్ కుమార్ పేర్కొన్నారు. 

నిజానిజాలు తెలుసుకోకుండా...
ప్రభుత్వానికి సహకరించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, సంతోషంగా సహకరిస్తానని వరలక్ష్మీ శరత్ కుమార్ తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా సెలబ్రిటీల గురించి ఇటువంటి వార్తలు రాయడం, వాళ్ళను కేసుల్లోకి లాగడం నిరాశ కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని మీడియాకు వరలక్ష్మీ శరత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Also Read టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్‌ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!


Varalakshmi Sarathkumar : డ్రగ్స్ కేసులో నాకు నోటీసులా? - స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్
 
'క్రాక్'తో మారిన వరలక్ష్మి కెరీర్
తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ కెరీర్ గురించి చెప్పాలంటే... 'క్రాక్'కు ముందు, ఆ తర్వాత అని చెప్పాలి. రవితేజ సినిమాలో విలన్ జయమ్మగా ఆమె నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'యశోద', 'వీర సింహా రెడ్డి' సినిమాల్లో సైతం మంచి రోల్స్ చేశారు. ప్రస్తుతం 'శబరి' అని ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న తాజా సినిమాలో కూడా కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం. 

Also Read ప్రతి పండక్కి... ప్రతి నెలలో శ్రీ లీల సినిమా - వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget