అన్వేషించండి

Kathi Kantha Rao : కత్తి కాంతారావును మర్చిపోయిన టాలీవుడ్ - శత జయంతికి పరిశ్రమ నివాళి ఎక్కడ? గౌరవం ఏది?

తెలుగు చిత్ర సినిమాలోని తొలి తరం కథానాయకులలో కత్తి కాంతారావు ఒకరు. నేడు ఆయన శతజయంతి. అయితే... పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా నివాళి అర్పించలేదు.

డిమాండ్ అండ్ సప్లై... ఏ వ్యాపారంలోనైనా పాటించే సూత్రం ఇది. సినిమా ఇండస్ట్రీ కూడా అందుకు అతీతం కాదు. ఎవరినైనా సరే డిమాండ్ ఉన్నంత వరకు పట్టించుకుంటారు. తర్వాత పక్కన పడేస్తారు‌‌. అందుకు ఉదాహరణ... కత్తి కాంతారావు శత జయంతి. అలాగే, చంద్ర మోహన్ మరణం. 

కాంతారావును మర్చిపోయిన తెలుగు చిత్రసీమ!కాంతారావును తెలుగు చలనచిత్ర పరిశ్రమ మర్చిపోయిందని ఈ రోజు చెప్పాల్సి వస్తోంది. ఆయన శత జయంతి నాడు కనీసం ఒక్కరు అంటే ఒక్కరు కూడా గుర్తు చేసుకుని ఆయనకు నివాళి అర్పించిన పుణ్యం మూట కట్టుకోలేదు. అసలు ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీ కాంతా రావు అనేది అయినా పరిశ్రమకు గుర్తు ఉందో? లేదో?

తెలుగు తెరపై జానపద కథానాయకుడు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కాంతారావు. కత్తి పట్టి తెరపై ఆయన చేసిన విన్యాసాలు ఆబాల గోపాలన్నీ అలరించాయి. కాంతారావు నటన మెచ్చిన, కత్తితో ఆయన చేసిన సాహసాలు నచ్చిన జనాలు చివరకు ఆయన ఇంటి పేరునే కత్తిగా మార్చేశారు. అటువంటి కథానాయకుడు శతజయంతి పరిశ్రమకు గుర్తు లేకపోవడం శోచనీయం.

కాంతారావు కేవలం కథానాయకుడు మాత్రమే కాదు... నిజాం ప్రభుత్వంలో వారి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. స్వాతంత్ర సమరయోగంలో బ్రిటిష్ సంగ్రామానికి వ్యతిరేకంగా నాటకాలు వేసిన నటుడు. తరువాత వెండితెరపై ఆయన ప్రయాణం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో సంపాదించిన సొమ్మును స్వలాభం కోసం ఏనాడు వాడుకోలేదు. సొంత మనుషులకు ఆస్తిపాస్తులు కూడా కూడబెట్టలేదు. నటుడిగా సంపాదించిన డబ్బును నిర్మాతగా ఖర్చు పెట్టారు. అదృష్టం ఆయన వైపు లేదు. దాంతో నిర్మించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చివరకు, మద్రాసులో లంకంత ఇల్లు అమ్ముకుని హైదరాబాద్ వచ్చి అద్దె ఇంట్లో ఉన్నారు. చిన్న చిన్న వేషాలు కూడా వేశారు.

కాంతారావు కేవలం జానపద చిత్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నటించిన పలు పౌరాణిక చిత్రాలలో ఆయన స్నేహితుడిగా కనిపించారు. ఎన్టీఆర్ సైతం నారదుడి పాత్రలో కాంతారావు నటన చూసి తాను ఆ వేషం వేయనని శపథం చేశారంటే... కాంతారావు ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. డబ్బు కోసం నిర్మాతలను అసలు ఇబ్బంది పెట్టని కథానాయకుడు కాంతారావు. అటువంటి హీరోను పరిశ్రమ పట్టించుకోకపోవడం ఆయన అభిమానులకు బాధ కలిగిస్తోంది.

ఇండస్ట్రీలో వారసులు లేకపోతే ఇంతేనా?
కాంతారావును పరిశ్రమ విస్మరించడానికి కారణాలు ఏమిటి అని విశ్లేషిస్తే... ఆయన వారసులు ఎవరు సినిమాల్లో లేరనే విషయం గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ శత జయంతిని ‌ఆయన వారసులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆయన వారసులు పంచలోహ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసులు ఉన్నత స్థానాలలో ఉండడంతో పరిశ్రమ ప్రముఖులు అందరూ ఆయా హీరోలతో తమకు ఉన్న అనుబంధాన్ని, ఆయా హీరోల గొప్పదనాన్ని శతజయంతి నాడు కీర్తించారు. కాంతారావు వారసులు పరిశ్రమకు దూరంగా... ఉద్యోగాలు చేస్తూ స్థిరపడడంతో ఆయనను ఎవరూ పట్టించుకోలేదని మాట అభిమానుల నోట వినిపిస్తోంది. తెలుగు పరిశ్రమ కాంతారావును విస్మరించినప్పటికీ అభిమానుల గుండెల్లో ఆయన ఎప్పుడూ నిలిచి ఉంటారు.

Also Read రెమ్యూనరేషన్ బదులు సినిమా రిలీజ్ - రిస్క్ చేస్తున్న నాని?


సీనియర్ నటులు చంద్రమోహన్ ఇటీవల మరణించారు. ఆయనకు సైతం చిత్ర సీమ తగు గౌరవాన్ని ఇవ్వలేదని మాట కొందరిలో వినపడుతోంది. సాధారణంగా నటీనటులు, దర్శక - నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఎవరైనా మరణిస్తే... ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకువచ్చి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చంద్రమోహన్ మరణం తర్వాత ఆయనకు ఆ విధమైన గౌరవం ఏది ఇవ్వలేదు. ప్రభుత్వాలు లాంఛనాలతో అంత్యక్రియలు కూడా జరగలేదు. ఆయనకు వారసులు ఎవరూ లేరు. వారసురాళ్లకు పరిశ్రమతో సంబంధాలు లేవు. దాంతో చంద్రమోహన్ అంత్యక్రియల దగ్గర కొందరు ప్రముఖులు మాత్రమే కనిపించారు.

Also Read : 'భగవంత్ కేసరి' నిర్మాతల మధ్య దూరం - వేర్వేరు కుంపట్లు!?

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Governor OTT : ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన మనోజ్ బాజ్‌పాయ్ కొత్త మూవీ - నేషనల్ అవార్డ్ విన్నర్ పొలిటికల్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Kotha Soku Lyrics: కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
కొత్త సోకు లిరిక్స్... 'పళ్ళబురుసు'లో పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్... సురేష్ గంగుల సాహిత్యం సూపర్
Ramayana Trailer : రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్
రామాయణ ట్రైలర్ రిలీజ్ వాయిదా - అసలు రీజన్ ఏంటో చెప్పిన ప్రొడ్యూసర్

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget