అన్వేషించండి

Shine Screens : 'భగవంత్ కేసరి' నిర్మాతల మధ్య దూరం - వేర్వేరు కుంపట్లు!?

షైన్ స్క్రీన్స్ నిర్మాతలు, స్నేహితులు హరీష్ & సాహు మధ్య దూరం పెరిగినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు కుంపట్లు పెడుతున్నారట. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎంతో మంది నిర్మాతలు వస్తూ ఉంటారు. ఎంతో మంది వెళుతూ ఉంటారు. అయితే... కొందరు మాత్రమే పదిమంది చెప్పుకునే సినిమాలు, పదిమందికి గుర్తుండే సినిమాలు తీస్తుంటారు. అటువంటి నిర్మాతల జాబితాలో షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ స్నేహితులు ఇద్దరూ కలిసి నిర్మించిన సినిమాల సంఖ్య తక్కువే. కానీ, ఆ చిత్రాలలో రెండు మంచి సినిమాలు ఉన్నాయి.

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలో ఉండగా... వాళ్ళిద్దరూ జంటగా నటించిన చిత్రాలలో 'మజిలీ' ఒకటి. సినిమాలోనూ భార్యా భర్తలుగా కనిపించారు. ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న సినిమాలలో అది ఒకటి. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా 'భగవంత్ కేసరి'ని సైతం వీళ్లిద్దరూ నిర్మించారు. తెలుగు చిత్ర సీమ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం... ఇప్పుడీ స్నేహితుల మధ్య దూరం పెరిగింది. మనస్పర్ధలు రావడంతో వేరు పడ్డారని తెలుస్తోంది.

వేరు కుంపటి పెట్టిన హరీష్ పెద్ది!
'భగవంత్ కేసరి' విడుదల తర్వాత స్నేహితులు ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఇక నుంచి వేరు వేరుగా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఓ నిర్ణయానికి వచ్చారట. షైన్ స్క్రీన్స్ సంస్థ నుంచి హరీష్ పెద్ది వైదొలిగారని, ఇకపై ఆ సంస్థ నిర్మించే సినిమాలలో ఆయన భాగస్వామిగా ఉండరని, కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభిస్తున్నారని సన్నిహితులు తెలిపారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి సొంతంగా సినిమాలు నిర్మించనున్నారు.

మైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థను స్థాపించారు హరీష్ పెద్ది. అందులో తొలి ప్రయత్నంగా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సాహు గారుపాటి విషయానికి వస్తే... యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డకు అడ్వాన్సులు ఇచ్చారు‌. త్వరలో వారితో సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : రెమ్యూనరేషన్ బదులు సినిమా రిలీజ్ - రిస్క్ చేస్తున్న నాని?

నాని కథానాయకుడిగా నటించిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాతో షైన్ స్క్రీన్స్ సంస్థ ప్రారంభమైంది. ఆ తరువాత 'మజిలీ' ప్రొడ్యూస్ చేశారు. తొలి సినిమా హీరో నాని, మలి సినిమా దర్శకుడు శివ నిర్వాణ కలయికలో 'టక్ జగదీష్' మూడో సినిమాగా నిర్మించారు. 'అల్లరి' నరేష్ కథానాయకుడిగా నటించిన 'ఉగ్రం' కూడా వాళ్లు ప్రొడ్యూస్ చేసిన సినిమాయే. 'భగవంత్‌ కేసరి' సినిమాతో సంయుక్త నిర్మాణానికి ముగింపు పలికారు. అది సంగతి!

Also Read : ఈ రోజు రాత్రి నుంచి 'మంగళవారం' సినిమా ప్రీమియర్లు - పాయల్ గ్లామర్ లుక్స్ చూశారా?

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ కూడా తొలుత ముగ్గురు నిర్మాతలతో ప్రారంభమైంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి,  చెరుకూరి మోహన్ సంయుక్తంగా కొన్ని చిత్రాలు నిర్మించారు. ఆ తర్వాత చెరుకూరి మోహన్ మైత్రి మూవీ మేకర్స్ నుంచి బయటకు వచ్చారు. మరో ఇద్దరితో కలిసి నాని హీరోగా హాయ్ నాన్న ప్రొడ్యూస్ చేశారు.  ‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
కోరి సీటు ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యే భారం అయ్యారా? తిరువూరులో ఏం జరుగుతోంది?
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
Embed widget