అన్వేషించండి

Jr NTR On Mokshagna Debut: తమ్ముడికి తారక్ వెల్కమ్... బాబాయ్ బాలకృష్ణతో గొడవలు అంటూ వచ్చే పుకార్లకు చెక్!

Nandamuri Mokshagna Debut Movie: కథానాయకుడిగా పరిచయం అవుతున్న బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ వెల్కమ్ చెప్పారు.

ఒక్కటే... నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని చెప్పకనే చెప్పారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR), ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram). బాబాయ్ బాలకృష్ణ కుమారుడు, ఎన్టీ రామారావు కుటుంబంలో మూడో  తరం వారసుడు మోక్షజ్ఞ వెండితెరకు కథానాయకుడిగా పరిచయం కానున్న ప్రకటన వచ్చిన సందర్భంలో తమ్ముడిని సాదరంగా చిత్రసీమలోకి ఆహ్వానించారు.

తాతగారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు ఎదగాలని...
''తాత (ఎన్టీఆర్)గారి ప్రతిష్ఠ నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని నందమూరి కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. మోక్షజ్ఞకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 'వెల్కమ్ టు ద టిన్సిల్ టౌన్ మోక్షు' అని పేర్కొన్నారు. మోక్షజ్ఞను కుటుంబ సభ్యులు మోక్షు అని పిలుస్తారు. ఈ విషయం ప్రేక్షకులకు తెలిసిందే.

''సినిమా ప్రపంచంలోకి  అడుగుపెట్టినందుకు కంగ్రాచ్యులేషన్స్. మోక్షు... నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న సందర్భంగా తాతయ్య గారితో పాటు సకల దేవుళ్లు నీకు ఆశీస్సులు అందజేస్తారని ఆశిస్తున్నాను'' అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. 

బాలకృష్ణ ప్రస్తావన లేదు కానీ నందమూరి ఫ్యామిలీ ఒక్కటే!
బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందని... హరికృష్ణ కుమారులతో నందమూరి కుటుంబానికి సఖ్యత లేదని ఈ మధ్య తరచూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాటలు వినిపిస్తున్నాయి. 

బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకకు ఎన్టీఆర్ గానీ, కల్యాణ్ రామ్ గానీ హాజరు కాలేదు. ఆ సమయంలో తల్లి షాలినితో కర్ణాటకలో పుణ్యక్షేత్రాలకు వెళ్లారు ఎన్టీఆర్. ఇదొక్కటే కాదు... పలు పరిణామాలు వాళ్ల మధ్య దూరం గురించి చెప్పకనే చెప్పాయని పలువురు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే... తమ్ముడి తొలి సినిమా ప్రకటన వచ్చిన సందర్భంగా అన్నయ్యలు ట్వీట్ చేయడంతో నందమూరి కుటుంబం అంతా ఒక్కటేనని సంకేతాలు వెళ్లాయి. అయితే... తారక్, కల్యాణ్ రామ్ ట్వీట్లలో బాలకృష్ణ పేరు లేకపోవడం గమనార్హం. కేవలం తాతయ్య గారి ఆశీర్వాదం అని మాత్రమే పేర్కొన్నారు.

Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?


ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'పీవీసీయు' (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లో సినిమాతో మోక్షజ్ఞ చిత్రసీమలో అడుగు పెడుతున్నారు. ఆయన సూపర్ హీరో రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాతో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మాతగా మారారు. లెజెండ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమె సమర్పణలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Readవిజయ్ 'ది గోట్'కి సీక్వెల్... పవన్ కల్యాణ్ టైటిల్ మీద కన్నేసిన దళపతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

వేలంలో రూ.32 కోట్ల ధర పలికిన ఐన్‌స్టీన్‌ లెటర్‌, అందులో ఏముందో తెలుసా?ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం, గోల్ఫ్‌కోర్ట్ సమీపంలో కాల్పులుTirumala Ghat Road | ఇంజనీర్స్ డే సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్ రహస్యం మీ కోసం | ABP DesamArvind Kejriwal Resign | పక్కా వ్యూహంతో రాజీనామా చేసి ముందస్తుకు వెళ్తున్న Delhi CM కేజ్రీవాల్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kaushik Reddy: నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
నా హత్యకు కుట్ర- అధికారంలోకి వచ్చాక ఎవర్నీ వదలం- కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు - మరో ప్లాన్‌కు ఇంజినీర్లు సిద్ధం, ప్రయత్నాలు ఫలించేనా?
Nipah virus: కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్:
కేరళలో మళ్లీ నిఫా పంజా.. వైరస్‌తో యువకుడి మృతి..151 మందికి ఐసోలేషన్
Jani Master: జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు, రేప్ కేసు - 21 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టడంతో...
Aditi Rao Hydari Siddharth Wedding: పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
పెళ్లితో ఒక్కటైన సిద్ధార్థ్, అదితి రావు హైదరి - డేటింగ్ పక్కన పెట్టి మ్యారేజ్ వరకు
Revanth Reddy: నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Siddharth-Aditi Rao Hydari: గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
గుడిలో సింపుల్‌గాపెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్‌- అదితి రావు హైదరి - ఫోటోలు వైరల్‌‌
Ganesh Idols Immersion: హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు- 18వేలమందితో బందోబస్తు
Embed widget