అన్వేషించండి

Bhagavanth Kesari Song : బాలయ్య వస్తే తీన్మార్ కాదు, సౌమార్ కొట్టాల్సిందే - 'భగవంత్ కేసరి' ఫస్ట్ సాంగ్ ప్రోమో చూశారా?

Ganesh Anthem Promo : నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'భగవంత్ కేసరి'లో మొదటి పాట 'గణేష్ యాంథమ్' ప్రోమోను విడుదల చేయనున్నారు.

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'భగవంత్ కేసరి' (Bhagavanth Kesari Movie). విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న విడుదల అవుతోంది. ఈ సినిమాలో మొదటి పాట 'గణేష్ యాంథమ్' ప్రోమోను ఈ రోజు విడుదల చేశారు. 

తీన్మార్ కాదు... సౌమార్ కొట్టు!
వినాయక చవితి పండగ నేపథ్యంలో 'భగవంత్ కేసరి'లో మొదటి పాట 'గణేష్ యాంథమ్'ను తెరకెక్కించారు. ఆల్రెడీ విడుదలైన సినిమా ప్రచార చిత్రాలు చూస్తే... బాలకృష్ణ తెలంగాణ యాస మాట్లాడుతూ కనిపించారు. ఇప్పుడీ పాటను కూడా తెలంగాణ నేపథ్యంలో జరిగే గణేష్ ఉత్సవాల తరహాలో తెరకెక్కించారు. 

'జై బోలో గణేష్ మహారాజ్ కి' అంటూ సాంగ్ మొదలైంది. ఆ తర్వాత పిల్లల మధ్యలో స్టెప్పులు వేస్తున్న శ్రీ లీలను చూపించారు.  తర్వాత బాలకృష్ణను చూపించారు. పసుపు రంగు షర్టు, కళ్ళజోడుతో ఆయన ఎంట్రీ అదిరింది. 

తీన్మార్ కొడుతుంటే 'బిడ్డా! ఆనతలేదు. సప్పుడు జర గట్టిగా చేయమను' అని బాలకృష్ణ అడగడం... అప్పుడు శ్రీ లీల 'అరే తీసి పక్కన పెట్టండ్రా మీ తీన్మార్! మా చిచ్చా వచ్చిండు! ఎట్లా ఉండాలే! కొట్టరా కొట్టు... సౌమార్' అనడం బావుంది. పాట మీద అంచనాలు మరింత పెంచింది.  లిరికల్ వీడియో శుక్రవారం (అనగా... సెప్టెంబర్ 1న) ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

Also Read : 'ఖుషి' ప్రీ రిలీజ్ డీటెయిల్స్ - విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఎంత?

వినాయక చవితి సందర్భంగా అన్ని మండపాలలో 'భగవంత్ కేసరి' సినిమాలో గణేష్ యాంథమ్ వినబడుతుందని, అంత మంచి బాణీ తమన్ అందించారని చిత్ర బృందం పేర్కొంది.   
 
'భగవంత్ కేసరి' చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ సందడి చేయనున్నారు. యువ కథానాయిక శ్రీ లీల ప్రధాన పాత్రధారి. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. బాలకృష్ణకు ఆయనది సోదరుడి పాత్ర అని టాక్. నార్త్ ఇండియన్ బ్యూటీ పాలక్ లల్వానీకి కీలక పాత్రలో నటించే అవకాశం దక్కింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్‌ చేశారు.

Also Read టార్గెట్ పాన్ ఇండియా - సెప్టెంబర్‌ బాక్సాఫీస్ బరిలో తెలుగు సినిమాలే టాప్!

'భగవంత్ కేసరి' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే? 
Bhagavanth Kesari Andhra Pradesh Telangana Rights : 'భగవంత్ కేసరి' నైజాం థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను 14 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సీడెడ్ (రాయలసీమ) హక్కులు రూ. 12 కోట్లు పలకగా... ఆంధ్ర ఏరియా హక్కులను సుమారు 34 కోట్ల రూపాయలకు ఇచ్చారట.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్టాల హక్కులను రూ. 60 కోట్లకు అమ్మేశారు. 'వీర సింహా రెడ్డి'తో సంక్రాంతికి బాలకృష్ణ భారీ విజయం అందుకున్నారు. ఆ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 63 కోట్లు. దాంతో పోలిస్తే... 'భగవంత్ కేసరి'కి జస్ట్ మూడు కోట్లు మాత్రమే తక్కువ. ఓవర్సీస్ మార్కెట్ బిజినెస్ కూడా కలిపితే 70 కోట్లు దాటుతుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP and TS Election 2024 Polling percentage: ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు
ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు
TS Election 2024 Voting updates: తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు
తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
Lok Sabha election 2024 Phase 4 Voting Live: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

PM Modi Patna Gurudwara | పాట్నా గురుద్వారాలో ప్రధాని మోదీ సేవ | ABP DesamKTR Voting Video | కుటుంబంతో కలిసి ఓటు వేసిన కేటీఆర్ | ABP DesamGreen Polling Stations Attracting | గ్రీన్ పోలింగ్ స్టేషన్...ఈ ఎలక్షన్స్ లో ఎట్రాక్షన్ | ABP DesamYS Sharmila on AP Elections 2024 | ఏపీ ఎన్నికల పోలింగ్ పై మాట్లాడిన ఏపీసీసీ చీఫ్ షర్మిల | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP and TS Election 2024 Polling percentage: ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు
ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు
TS Election 2024 Voting updates: తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు
తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
Lok Sabha election 2024 Phase 4 Voting Live: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
Tenali News: తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి
రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Manisha Koirala: ఇండస్ట్రీలో ఆడవారి రాత మారింది, ఆ సీన్ కోసం 12 గంటల పాటు మట్టి నీళ్లలో ఉన్నాను - మనీషా కొయిరాల
ఇండస్ట్రీలో ఆడవారి రాత మారింది, ఆ సీన్ కోసం 12 గంటల పాటు మట్టి నీళ్లలో ఉన్నాను - మనీషా కొయిరాల
Embed widget