అన్వేషించండి

Actress Hema: బ్లాక్ మెయిల్ చేశారు, సెటిల్‌మెంట్‌కు పిలిచారు... త్వరలో ఆ ఫోన్ నంబర్స్ బయటపెడతా - హేమ సంచలన వీడియో

Hema Comments On Media: మీడియా మీద నటి హేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బ్లాక్ మెయిల్ చేశారని, సెటిల్మెంట్‌కు పిలిచారని ఆవిడ వీడియో విడుదల చేశారు. వేణు స్వామి తరహాలో ఆవిడ కూడా ఆరోపణలు చేశారు.

ఒక టీవీ ఛానల్ జర్నలిస్ట్ తనను ఐదు కోట్లు డిమాండ్ చేశారని వేణు స్వామి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. తన భార్యతో కలిసి ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ప్రజలలో అది చర్చకు దారి తీసింది. ఆ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదే రీతిలో నటి హేమ మీడియా మీద విరుచుకుపడ్డారు. మీడియా తనను బ్లాక్ మెయిల్ చేసిందని, సెటిల్మెంట్ చేసుకోమని కొందరు తనకు ఫోనులు చేశారని ఆరోపణలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

వివాదానికి కారణమైన బెంగళూరు రేవ్ పార్టీ
బెంగళూరు నగరంలో ఆ మధ్య జరిగిన రేవ్ పార్టీ పలు వివాదాలకు కారణం అయ్యింది. అందులో పలువురు సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. పోలీసులు రెయిడ్ చేసినా ఫామ్ హౌస్ వద్ద నటి హేమ ఉన్నారు. ఆమెను విచారణకు పిలిచారు కూడా! ఆ సమయంలో మీడియా తన పరువు తీసిందని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. 

నా 35 ఏళ్ళ పరువును భూస్థాపితం చేశారు
''మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువును ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. అది లాండ్ ఆర్డర్ మ్యాటర్ కనుక వెంటనే బయటికి రాలేకపోయాను. ఏం జరిగిందనేది నేను చెప్పలేకపోయా. ఇప్పుడు కూడా విషయం కోర్టులో ఉంది. కానీ, నా అన్నదమ్ములు నా అక్క చెల్లెళ్ళు... 'అక్క తప్పు లేకపోతే బయటికి రావాలి కదా! ఎందుకు రాలేదు?' అని అనుకుంటున్నారు. కోర్టు వ్యవహారాలు సంగతి మీకు తెలిసిందే. చాలా టైం పడుతుంది బయటకు రావడానికి. సో వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏం జరిగిందో చెబుతా'' అని హేమ పేర్కొన్నారు. తన గురించి మీడియా లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేసిందన్నారు. 

''నా బాధ ఏమిటంటే... నా శాంపిల్స్ పోలీసుల దగ్గర లేనప్పుడు నాకు పాజిటివ్ వచ్చిందని ఎలా కథనాలు ప్రసారం చేస్తారని బాధతో, ఉక్రోషంతో కొంచెం గట్టిగా అడిగా. అప్పుడు ఓవర్ యాక్టింగ్ అన్నారు. ఇప్పుడు నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. దీంట్లో నాకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది'' అని హేమ వివరించారు. తాను ఎటువంటి టెస్టులు చేయించుకోవడానికి రెడీ అని ఆవిడ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు.

Also Read: బాక్సాఫీస్ బరిలో 9000 కోట్లు, ఆస్కార్స్‌లో 2 అవార్డులు... హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ రెడీ - రిలీజ్ ఎప్పుడంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KOLLA HEMA (@hemakolla1211)

నేనొక తీవ్రవాది అన్నట్టు మీడియా ప్రచారం చేసింది!
తనను ఓ తీవ్రవాదిలా మీడియా చిత్రీకరించిందని, అందువల్ల పవన్ - రేవంత్ రెడ్డి దగ్గరకు ఎలా వెళ్ళాలో తెలియక వీడియో చేస్తున్నానని హేమ వివరించారు. తనను మీడియా బ్లాక్ మెయిల్ చేసిందని, సెటిల్మెంట్స్ చేసుకోవడానికి రమ్మని కూడా పిలిచిందని ఆవిడ ఆరోపణలు చేశారు. కొందరు పెద్దవాళ్ళు కాంప్రమైజ్ చేస్తామని పిలిచారని ఆవిడ పేర్కొన్నారు. ''నాకు, మీడియాకు ఎటువంటి గొడవలు లేవు. నేను ఎందుకు రావాలి? నేను తప్పు చేయనప్పుడు ఎందుకు సెటిల్మెంట్‌కు రావాలి. నన్ను ఎవరెవరు అయితే బ్లాక్ మెయిల్ చేశారో వాళ్ళ ఫోన్ నంబర్స్ నా దగ్గర ఉన్నాయి. నా నంబర్స్ కూడా త్వరలో అప్డేట్ చేస్తా'' అని హేమ చెప్పారు. తాను ఎటువంటి టెస్టులకు అయినా రెడీ అని ఆవిడ అన్నారు.

Also Readవేట్టయాన్ వర్సెస్ కంగువ... దసరా బరిలో రజనీకాంత్, సూర్య సినిమాకు పోటీగా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP DesamOperation Polo గురించి 76 ఏళ్ల క్రితం newspapers ఏం రాశాయి | Telangana Liberation Day | ABP Desamనిజాం రాజ్యం ఇండియాలో విలీనమయ్యాక ఖాసిం రజ్వీ ఏమయ్యాడు?Operation Kagar Maoists Death Toll | ప్రాణాలు కోల్పోతున్న అడవిలో అన్నలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
మళ్లీ చెప్తున్నా! రాజీవ్ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి తీరతాం - కేటీఆర్
Amara Raja Groups Donation: ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
ఏపీ, తెలంగాణలో వరద బాధితులకు అమర రాజా సంస్థ భారీ విరాళం, సీఎంలకు చెక్కులు అందజేత
Bigg Boss 8 Telugu Episode 17 Day 16: మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
మళ్లీ బయటపడ్డ సోనియా రంగు, ముద్దులతో ముంచెత్తిన పృథ్వీ
Lebanon Pagers Blast: లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
లెబనాన్‌లో ఒక్కసారిగా పేలిన పేజర్లతో విధ్వంసం- 8 మంది మృతి, వేలాది మందికి గాయాలు
Tirumala Tickets Online: భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
భక్తులకు గుడ్‌న్యూస్ - డిసెంబర్ నెల శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల విడుదల తేదీలు ప్రకటించిన టీటీడీ
AP New Liquor Policy: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - అక్టోబర్ నుంచి కొత్త పాలసీ: మంత్రులు
Adilabad: ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
ఆదిలాబాద్‌లో బావి మీద 52 అడుగుల గణేష్ నిమజ్జనం - ఉన్నచోటే భలే టెక్నిక్!
CTET 2024: సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
సీటెట్‌ డిసెంబరు-2024 నోటిఫికేషన్‌ విడుదల-దరఖాస్తు ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
Embed widget