Nikhil Siddhartha : మా సినిమాలో AI వాడలేదు - హీరో నిఖిల్ ట్వీట్ వైరల్... మరి ఆ మూవీ ఏది?
Nikhil Siddhartha Reaction : యంగ్ హీరో నిఖిల్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోందని. టెక్నికల్ గ్లిచ్తో 'స్వయంభు' హై క్వాలిటీ టీజర్ మళ్లీ అప్లోడ్ చేసినట్లు తెలిపారు.

Actor Nikhil Siddhartha Tweet Viral About AI : 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో నిఖిల్ హిస్టారికల్ ఎపిక్ 'స్వయంభు'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా అనుకున్నంత రెస్పాస్ రాలేదు. అయితే, టెక్నికల్ గ్లిచ్తో హై క్వాలిటీ టీజర్ మళ్లీ అప్ లోడ్ చేసినట్లు చెప్పారు నిఖిల్.
'స్వయంభు' టీజర్ రిలీజ్ కాగానే చాలా మంది దీన్ని 'బాహుబలి'తో పోల్చారు. అలాగే, సోషల్ మీడియా వేదికగా టీజర్ క్వాలిటీపైనా కామెంట్స్ వచ్చాయి. దీంతో మళ్లీ టీజర్ అప్లోడ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా నిఖిల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
'మా సినిమాలో AI వాడలేదు'
తాజాగా మరింత క్వాలిటీతో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన టీజర్ చూడాలంటూ నిఖిల్ ట్వీట్ చేశారు. 'రీసెంట్గా వచ్చిన ఓ సినిమాలోలాగా మా మూవీలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వాడలేదు.' అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. రీసెంట్గా వచ్చిన ఆ మూవీ ఏంటి? నిఖిల్ ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్స్ చేశారు? అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చిస్తున్నారు. విజువల్ పరంగా ఏఐ ఎక్కువగా వాడిన మూవీస్ ఏంటా? అంటూ సెర్చ్ చేస్తున్నారు. మరి దీనిపై స్వయంగా నిఖిలే క్లారిటీ ఇవ్వాలి.
రీసెంట్గా సినీ ఇండస్ట్రీలో ఏఐ వినియోగం పెరిగింది. సిల్వర్ స్క్రీన్పై అద్భుతాలు ఆవిష్కరించే క్రమంలో VFXను దాటి ఏఐను కొంచెం ఎక్కువగా వాడుతున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఇది కేవలం మూవీలోనే కాకుండా ప్రమోషన్స్ కోసం కూడా యూజ్ చేసిన సందర్భాలు మనం ఇటీవల ఎక్కువగా చూశాం. టీజర్ లాంచ్ ఈవెంట్లోనూ AI వినియోగంపై నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ఇలాంటి భారీ స్థాయి సినిమాలకు ఏఐ బాగుండదని అభిప్రాయపడ్డారు.
Youtube 😖enduku bhayya ila Glitch u did..
— Nikhil Siddhartha (@actor_Nikhil) February 15, 2026
Watch the ReUploaded Teasr of #Swayambhu now on 🤘🏽👇🏾https://t.co/0nDqa2gkYZ
Ps- No AI has been used in our film unlike other recently Released. https://t.co/YGveEemSP8
'స్వయంభు' టీజర్ ఎలా ఉందంటే?
'స్వయంభు' టీజర్లో హీరో ఎలివేషన్ నుంచి అద్భుతమైన విజువల్స్ ఆకట్టుకున్నాయి. రాజులు, రాజ్యాలు, యాక్షన్ సీక్వెన్స్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించాయి. 'కాలం కత్తై దూస్తే... కాపాడే కవచం ఒకటి కావాలి కదా' అనే డైలాగ్తో హీరో ఎంట్రీ ఇవ్వగా... ఆయన సెంగోలి పాత్రలో పవర్ ఫుల్ వారియర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణ యువకుడు యోధుడిలా మారేందుకు ఇన్స్పిరేషన్ ఏంటి? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఈ మూవీకి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా... నిఖిల్ సరసన సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. 'బాహుబలి', 'RRR' వంటి మూవీస్కు సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించిన సెంథిల్ కుమార్ ఈ మూవీకి వర్క్ చేశారు. రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో ఏప్రిల్ 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
























