అన్వేషించండి

 Godhra Teaser: గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో 'గోద్రా: ప్రమాదమా లేక కుట్ర' - ఆసక్తిగా సాగిన టీజర్‌

Godhra Teaser: గోద్రా రైలు దగ్ధం అనంతరం జరిగిన అల్లర్లకు కారణాలు ఏమిటి? అనే కోణంలో వస్తున్న సినిమా ఇది. రైలు దగ్ధం వెనుక అసలు సూత్రధారి ఎవరు, ఆ రోజు ఏం జరిగింది..

Godhra Teaser Out: బాలీవుడ్ మరో కాంట్రవర్సీయల్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే 1990లలో కశ్మీరీ పండితుల ఊచకోతపై గత ఏడాది 'ది కశ్మీరీ ఫైల్స్', కేరళలో లవ్ జిహాద్ పై 'ది కేరళ స్టోరీ' సినిమాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పుడు 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లకు సంబంధించిన కథతో యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా సినిమా వస్తోంది. గోద్రా ఈ పేరు వినగానే గుర్తోచ్చేది గుజరాత్ రైలు యాక్సిడెంట్‌. 21 ఏళ్ల క్రితం జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు దహనం, ఆ తర్వాత గుజరాత్ లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో మూవీని తెరక్కిస్తున్నారు.

గోద్రా ఘటన ప్రమాదమా లేక కుట్ర..

తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసింది మూవీ యూనిట్‌. నిజ జీవిత సంఘటన ఆధారం వస్తోన్న ఈ మూవీ టీజర్‌ ఆద్యాంతంగా ఆసక్తిగా సాగింది. దాదాపు నిమిషం నిడివి గల ఈ టీజర్‌లో ఒక్క డైలాగ్‌ లేకుండా ఆసక్తిగా మలిచారు. 2002లో జరిగిన గోద్రా రైలు దహనం గురించి ముఖ్యమైన వివరాలను మాత్రం సబ్‌ టైటిల్స్‌ రూపంలో చూపించారు. చివరికి అసలు గోద్రా ఘటన ప్రమాదమా లేక కుట్ర అంటూ టీజర్ ముగించారు. చూస్తుంటే గోద్రా మూవీ ద్వారా అధికార పార్టీ తమ వాదనను ప్రజల ముందుకు తీసుకెళ్లబోతోందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఈ గోద్రా ఘటన దేశ రాజకీయాలను పెద్ద మలుపు తిప్పిందనే చెప్పాలి. ఈ ఘటన జరిగినపుడు ప్రస్తుత భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Also Read: 'డార్లింగ్' ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. 'కల్కి 2898 AD' షూటింగ్ ఎక్కడంటే?

ఈ ఘటన వెనక ఆయన ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వినిపించాయి. దాంతో ఈ కేసు అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఇక గుజరాత్ సిట్, సీబీఐ, సహా పలు దర్యాప్తు సంస్థలు చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఈ ఘటనలో నరేంద్ర మోదీ ప్రమేయం లేదంటూ  క్లీన్ చిట్ ఇచ్చాయి. ఆనాటి ఘటన వెనక అసలు సూత్రధారి ఎవరు? ఈ ఘటన అనుకోకుండా జరిగిందా ? కావాలనే చేశారా అనేది ఈ సినిమాలో చూపించనున్నారు. బీజే పురోహిత్, రామ్ కుమార్ పాల్ నిర్మిస్తున్న సినిమాను ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహిస్తున్నారు. రణవీర్ షోరే, మనోజ్ జోషి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది.

మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న గోద్రా!

టీజర్‌తో పాటు మూవీ రిలీజ్‌ డేట్‌పై కూడా హింట్‌ ఇచ్చారు మేకర్స్‌. మార్చి 1న ఈ మూవీని వరల్డ్‌ వైడ్‌గా థియేటర్లో రిలీజ్‌ చేసేందురు మూవీ టీం ప్లాన్‌ చేస్తుంది.కాగా 2002లో జరిగిన ఈ రైలు ప్రమాదంలో అయోధ్య నుంచి తిరిగి వస్తున్న 59 మంది మరణించారు. ఆ తర్వాత గుజరాత్ లో మత కల్లోలాలు జరిగాయి. గోద్రా రైలు దగ్ధం వెనుక అసలు సూత్రధారి ఎవరు, ఆ రోజు ఏం జరిగింది, గోద్రా రైలు దగ్ధం అనంతరం జరిగిన అల్లర్లకు కారణాలు ఏమిటి? అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటన ప్రమాదమా లేక కుట్రనా అంటూ మరోసారి చర్చకు దారి తీయబోతోంది ఈ సినిమా. మరి విడుదల అనంతరం ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేయబోతుందో చూడాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget