Bigg Boss 9 Telugu : బిగ్బాస్ డే 88 రివ్యూ... కళ్యాణ్ వర్సెస్ సుమన్ ర్యాంపేజ్... రింగ్ మాస్టర్ టాస్క్ కు ఊహించని టర్న్ ఇచ్చిన తనుజా... కన్ఫ్యూజన్లో రీతూ, భరణి
Bigg Boss 9 Telugu Today Episode - Day 88 Review : ఫస్ట్ ఫైనలిస్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్న పోరు ఆద్యంతం ఆసక్తికరంగా మారింది. ఈరోజు ఎపిసోడ్ హైలెట్స్, టాస్కులు ఏంటి?

87వ రోజు సాయంత్రం టాస్క్ లో ఓడిపోయిన డెమోన్ బాధపడుతూ కనిపించాడు. దీంతో "నామినేషన్ లో టికెట్ టు ఫినాలే కొడతా అని లేనిపోని బిల్డప్ లు ఎందుకు ?" అంటూ డెమోన్ కు ఇచ్చిపడేసింది తనూజా. తరువాత "నాలుగవ ఛాలెంజ్ లో ఏ ముగ్గురు పోటీ పడుతున్నారు?" అని అడిగారు బిగ్ బాస్. "తూ మార్ మై మార్ అంతే" అంటూ కళ్యాణ్ ఆడడానికి సిద్ధం అయ్యాడు. రీతూ, భరణి, కళ్యాణ్ ఆడతామని చెప్పారు. "బిగ్ బాస్ సీజన్ 9 తొలి ఫైనలిస్ట్ కావడానికి జరుగుతున్న పోటీలో భాగంగా ముగ్గురు పోటీదారులకు ఇస్తున్న నాలుగవ ఛాలెంజ్ కలర్ ఫుల్ టు పవర్ ఫుల్. తమ కలర్ ను ఒకే కాన్వాస్ పై ముగ్గురూ పూయాలి. బజర్ మోగేసరికి ఎవరి కలర్ ఎక్కువ ఉంటే వాళ్లే గెలుస్తారు" అని చెప్పారు బిగ్ బాస్. రెడ్ కలర్ ను కాన్వాస్ మొత్తం పూసి, కళ్యాణ్ విన్ అయ్యాడు. "కళ్యాణ్ నాలుగవ ఛాలెంజ్ లో విజయం సాధించిన మీరు ఒక ఎంప్టీ గడిని కైవసం చేసుకోండి" అని చెప్పారు బిగ్ బాస్. అలాగే సుమన్ తో కళ్యాణ్ పోటీకి సిద్ధం అవ్వడంతో, సుమన్ జోలికి వద్దు నా జోలికి రమ్మన్నా కదా" అని కళ్యాణ్ ను అడిగాడు భరణి. "సుమన్ అన్న జోలికి వెళ్లొద్దు అంటాడేంటి భరణి అన్న ? నా జోలికి రండి అంటే... ఎవడైనా ఎలా గెలుస్తారో అలాగే వెళ్ళాలి అనుకుంటారు" అని డెమోన్ తో చెప్పాడు ఇమ్మూ.
కళ్యాణ్ వర్సెస్ సుమన్ ర్యాంపేజ్
"మీ గడులతో బౌండరీ పంచుకునే ఎవరితో పోటీ పడాలి అనుకుంటున్నారు?" అని బిగ్ బాస్ అడిగితే... సుమన్ పేరు చెప్పాడు కళ్యాణ్. "మనిద్దరినీ తీసేసి, వాళ్ళు ముగ్గురూ ఆడాలి అనే స్ట్రాటజీ అనుకుంటా" అన్నాడు భరణి. "ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఇద్దరు పోటీదారులు పెడుతున్న టాస్క్ రేజ్ ర్యాంపేజ్. ఇందులో భాగంగా మీ రేజ్ రూమ్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ను పగలగొట్టి, హోల్ లో నుంచి బయట పడేయాలి. తర్వాత ఇద్దరూ త్రాసులో చెరోవైపు వేయాలి. మీ త్రాసు ఎంత బరువు ఉండాలో, పోటీదారు త్రాసులో అంతే తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. మునుపటి టాస్క్ లో ఓడిపోయిన డెమోన్ దీనికి సంచాలక్" అని చెప్పాడు బిగ్ బాస్. ఇందులో కళ్యాణ్ విన్ అయ్యాడు. ఈ యుద్ధంలో గెలిచి సుమన్ గడులను స్వాధీనం చేసుకున్నందుకు కళ్యాణ్ ను అభినందించారు బిగ్ బాస్. ఓడిపోయిన సుమన్ ఫస్ట్ ఫైనలిస్ట్ రేసు నుంచి అవుట్ అయ్యారు.
"మీరంతా దేని కోసం పోరాడుతున్నారో దాన్ని రివీల్ చేసే టైమ్ వచ్చేసింది" అంటూ ఫస్ట్ ఫైనలిస్ట్ షీల్డ్ ను ఓపెన్ చేయించారు బిగ్ బాస్. "అతి ముఖ్యమైన మజిలీ... ఆ షీల్డ్ ను చేరుకోవడానికి కొన్ని తెలివైన.అడుగులు మాత్రమే అవసరం ఉంది. ఇదే ఆఖరి ఛాలెంజ్ తర్వాత యుద్దాలు మాత్రమే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. ఏ ముగ్గురు పాల్గొనాలి అనేది బాగా ఆలోచించి చెప్పండి" అని హౌస్ మేట్స్ ను ఆదేశించారు.
రీతూ వర్సెస్ భరణి
కళ్యాణ్, ఇమ్మూ, రీతూ పోటీ పడతామని అన్నారు. "బిగ్ బాస్ సీజన్ 9 తొలి ఫైనలిస్ట్ కావడానికి ఇస్తున్న టాస్క్ బ్యాలెన్స్ చేయరా డింభకా. స్టిక్ ను ఒక చేతితో పట్టుకుని, వాటిపై కాయిన్స్, టోకెన్ ను కదులుతూ ఎక్కువ సేపు ఎవరు బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు విజేతలు. అవి కిందపడితే ఓడినట్టే. బెల్ మోగినప్పుడల్లా ఒక హౌస్ మేట్ తను ఫస్ట్ ఫైనలిస్ట్ గా చూడకూడదు అనుకుంటున్న వాళ్ళ స్టిక్ పై కాయిన్స్, టోకెన్ పెట్టాలి. దీనికి సంచాలక్ తనూజా. సుమన్ - రీతూకి, సంజన - కళ్యాణ్ కు, డెమోన్, భరణి - ఇమ్ముకి కాయిన్స్ ఇచ్చారు. ఇందులో ఇమ్మూ, కళ్యాణ్ ఓడిపోగా, రీతూ గెలిచింది. ఆమె నెక్స్ట్ గేమ్ ను భరణితో కలిసి ఆడతానని చెప్పింది.
"ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి జరుగుతున్న పోరులో భాగంగా పోటీదారులకు ఇస్తున్న 5వ యుద్ధం రింగ్ మాస్టర్. పోటీదారులు జంక్ యార్డ్ లో ఉన్న వివిధ షేప్స్ లోని ఐటమ్స్ నుంచి 3 ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్స్ ను టేబుల్ పై పెట్టాలి. ప్రతి లైన్ పూర్తయిన వెంటనే రింగ్ ను పోల్ కి హ్యాంగ్ అయ్యేలా వేయాలి. సంజన ఈ టాస్క్ కు సంచాలక్. రీతూ విన్ అయ్యింది ఇందులో. కానీ "ఫస్ట్ వన్ డౌట్ ఉంది" అంటూ పాయింట్ రైజ్ చేసింది తనూజా. వెంటనే ఇది పక్కా ట్రయాంగిల్ కాదు అంటూ గేమ్ మళ్ళీ మొదలెట్టాడు భరణి.





















