అన్వేషించండి

Alia Bhatt: ఛీ, మరీ ఇంట్లోకి తొంగిచూస్తారా? - మీడియాపై అలియా ఆగ్రహం, పోలీసులకు ఫిర్యాదు

బాలీవుడ్ నటి ఆలియా భట్ కు షాకింగ్ ఘటన ఎదురయ్యింది. ఇంట్లో ఉన్న తనకు కొంత మంది ఫోటో గ్రాఫర్లు సీక్రెట్ గా ఫోటోలు తీయడాన్ని గమనించింది. వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సినీ నటుల విషయంలో నేషనల్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్ కు ఎదురయ్యింది. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. వెంటనే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.?

ఆలియాను సీక్రెట్ ఫోటోలు తీసిన కెమెరామెన్

తాజాగా అలియా భట్ తన అపార్ట్‌ మెంట్‌లోని లివింగ్‌ రూమ్‌లో కూర్చొని ఉంది. అప్పుడు తనను ఎవరో గమనిస్తున్నట్లు అనుమానం కలిగింది. వెంటనే తను తలెత్తి చూడగానే,  ఇద్దరు ఫోటోగ్రాఫర్లు తమ పక్కనే ఉన్న బిల్డింగ్ టెర్రస్ నుంచి ఆమెకు ఫోటోలు తీస్తూ కనిపించారు. ఈ ఘటనతో అలియా షాక్ కు గురయ్యింది. ఈ విషయాన్ని వెంటనే ముంబై పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని ఆలియా చెప్పింది.  తన కూతురు రాహా కపూర్ ఫోటోల కోసమే సదరు కెమెరామెన్ హద్దులు మీరి ప్రవర్తించినట్లు వెల్లడించింది.   

ఇప్పటి వరకు బయటకు రాని అలియా కూతురు ఫోటోలు  

రణబీర్ కపూర్- అలియా భట్ గతేడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి అయిన నెలకే తాను ప్రెగ్నెంట్ అంటూ ఆలియా షాక్ ఇచ్చింది. ఇక గతేడాది చివర్లో అమ్మాయికి జన్మనిచ్చింది. ఆమెకు రాహా కపూర్ అని పేరు పెట్టారు. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. పాపతో అలియా భయకు కూడా రాలేదు. ఈ నేపథ్యంలోనే సదరు పాప ఫోటోలను ఎలాగైనా సంపాదించాలని కొందరు ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించారు. అలియా భట్ అపార్ట్ మెంట్ కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ మీద నుంచి ఆమె ఇంటి వైపు కెమెరాలు పెట్టారు. ఈ విషయాన్ని గమనించిన అలియా పోలీసులకు సమాచారం ఇచ్చింది.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అలియా భట్

ఈ ఘటనపై ఆలియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. “నేను మధ్యాహ్నం సమయంలో ఇంట్లో కూర్చుని ఉన్నాను. ఆ సమయంలో ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్లు అనిపించింది. వెంటనే బయట వైపు చూశాను. ఒక్కసారిగా షాక్ అయ్యాను. మా పక్కింటి టెర్రస్ మీద ఇద్దరు వ్యక్తులు  కెమెరాలు పట్టుకుని మా ఇంట్లోకి చూస్తున్నారు. ఈ ఘటన ముమ్మాటికీ మా ప్రైవసీని దెబ్బతీయడమే అవుతుంది. లిమిట్ క్రాస్ చేసి మా ఇంట్లోకి కెమెరాలు పెట్టారు. ఇక చాలు” అంటూ ముంబై పోలీసులకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ఘటన ముంబైలో సంచలనం అయ్యింది. పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. తాము సెలబ్రిటీలు కావచ్చు.. కానీ, ఇంట్లో తమకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలా తొంగి చూడటం ఎంతవరకు సబబు? దేనికైనా లిమిట్ ఉంటుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

‘విరుష్క’ పాప ఫోటోల కోసం ఇంట్లోకి చొరబడిన కెమెరామెన్

ఇలాంటి ఘటనే గతంలోనూ జరిగింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ముద్దుల కూతురు వామిక ఫోటోలను తీయడం కోసం కొంతమంది ఫోటో గ్రాఫర్లు వాళ్ల ఇంట్లోకి చొరబడ్డారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం అయ్యింది. అనుష్క శర్మ సదరు వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తాజాగా ఇలాంటి పరిస్థితే ఆలియా భట్ దంపతులు ఎదుర్కొన్నారు.

Read Also:  ప్రభాస్‌తో మళ్లీ మూవీ? కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్Narine Bat Inspection vs PBKS IPL 2025 | పంజాబ్ మ్యాచ్ లో నరైన్ కి షాక్ ఇచ్చిన అంపైర్లుPBKS vs KKR Match Chahal Bowling | IPL 2025 లో సంచలన బౌలింగ్ తో పంజాబ్ కు సెన్సేషనల్ విక్టరీPBKS Highest lowest IPL 2025 | వరుస మ్యాచుల్లో రెండు వేరియేషన్స్ చూపించిన పంజాబ్ కింగ్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Smita Sabharwal: సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
సీనియర్ ఐఏఎస్‌పై కంచ గచ్చిబౌలి ఫేక్ ఫోటోల కేసులో నోటీసులు - తెలంగాణ ప్రభుత్వంలో కలకలం
Chandrababu:  రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి - ఆర్థిక సంఘానికి చంద్రబాబు ప్రజెంటేషన్
Supreme Court :  టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
టీటీడీలో హిందూయేతరులు ఉన్నారా? వక్ఫ్‌ చట్టంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
Gold price: 98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
98 వేలకు చేరిన పది గ్రాముల బంగారం - ఇక లక్ష మార్క్ దాటడమే - సిల్వరూ ఆగట్లేదు !
Kancha Gachibowli Land Case: కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కొందరు జైలుకు వెళ్లాల్సి వస్తుంది, కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Kavitha Lokesh Politics:  లోకేష్ బాటలోనే  కవిత రాజకీయాలు  - పాదయాత్ర కూడా చేస్తారా ?
లోకేష్ బాటలోనే కవిత రాజకీయాలు - పాదయాత్ర కూడా చేస్తారా ?
AP DSC Notification: అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
అభ్యర్థులకు గుడ్‌న్యూస్, మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Akshaya Tritiya 2025 Date : అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా పిచ్చితనం మరొకటి లేదా!
Embed widget