అన్వేషించండి

Election 2022: యోగీ దెబ్బ అదుర్స్‌! చెప్పి మరీ కొట్టారు

Election 2022: అష్టదిగ్బంధం చేసినా నెగ్గుకొచ్చారు. పార్టీలోని కీలక నేతలు విడిచి పెట్టి వెళ్లిపోతున్నా ఒక్కడై నిలచి గెలిచాడు. చెప్పి మరీ ఎస్పీని దెబ్బతీశారు యోగి ఆదిత్యనాథ్‌

ఏబీపీ, సీఓటర్ సర్వే(ABP, C-Voter Survey)లో చెప్పినట్టుగా ఐదు రాష్ట్రాల్లో(Five State Elections 2022) ఫలితాలు వస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లో బీజేపీకి తిరుగు లేదని ఏబీపీ, సీఓటర్‌ సర్వేలో తేలింది. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే అదే నిజమని స్పష్టం అవుతోంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌ను యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) ఒంటిచేత్తో బీజేపీ(BJP)ని విజయ తీరాలకు చేర్చారు. ఎన్నికల టైంలో ఎస్పీ(Samajwadi Party) కాస్త టెన్షన్ పెట్టినా ఏ మాత్రం బెదరలేదు. చాలా మంది బీసీ లీడర్లను తమవైపు తిప్పుకున్నా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగీ తనస్టైల్ రాజకీయం నడిపించారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు బీజేపీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి.403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో 250స్థానాలకుపైగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. యూపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్‌ భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. 

రైతు చట్టాలు, లఖింపూర్ ఘటన, ఉన్నావ్‌ రేప్‌ కేసు, పెట్రోల్‌ డీజిల్ ధరలు విషయంలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వాటిని కాదని బీజేపీకి ప్రజలు పట్టం కడుతున్నారు. ఎన్నికల టైంలో చాలా కీలమైన నేతలు బీజేపీని వదిలి ఎస్పీలోకి వెళ్లారు. అయినా ఓటర్లు మాత్రం బీజేపీతో ఉన్నట్టు ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. 

బీజేపీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, శాంతిభద్రతల తీరు ఇలాంటి అంశాలతో బీజేపీ క్యాంపెయిన్ చేసింది. గత ప్రభుత్వాల టైంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేస్తూ అలాంటి పరిస్థితి కొని తెచ్చుకోవద్దని పదేపదే హెచ్చరింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా సహా ఇతర స్టార్ క్యాంపెయినర్‌లంతా ఇదే అంశాన్ని పదే పదే ప్రచారం చేశారు. వీటికే ప్రజలు మద్దతు పలికినట్టు తెలుస్తోంది. 

అన్నింటికంటే ముఖ్యంగా యోగి చేసిన  80శాతం వర్సెస్‌ 20 శాతం నినాదం బాగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లినట్టు కనిపిస్తోంది. ఆయన మాటల్లో 80శాతం మంది బీజేపీ మద్దతు దారులు, మిగతా 20 శాతం ప్రతిపక్షాలకు మద్దతుదారులు అంటూ ప్రచారం చేశారు. కానీ ఇది హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు హిందువును రెచ్చగొట్టేందుకు ఈ కామెంట్స్ చేశారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయినా ప్రజలు వాటిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. 

ఈ నినాదమే బాగా వర్క్‌అవుట్‌ అయినట్టు కనిపిస్తోంది. హిందువుల ఓట్లు ఏక మొత్తంలో బీజేపీకి పడేలా చేయడంలో యోగి సక్సెస్‌ అయ్యారు. బీజేపీని విజయతీరాలకు చేర్చారు యోగి. వివిధ కులాల నేతలు తమ పార్టీని వీడుతున్నప్పటికీ ఏ మాత్రం ఓట్లు చీలిపోకుండా కాపాడుకోగలిగారు. ఆయా కులాల్లో వ్యతిరేక ముద్ర పడకుండా చూసుకున్నారు.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget