అన్వేషించండి

Uttarandhra Politics: వారసుల రాజకీయ భవితవ్యంపై ఉత్తరాంధ్ర కీలక నేతల మథనం

ఉత్తరాంధ్రలోని పలు పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగిన నాయకులు తమ వారసుల రాజకీయ భవితవ్యంపై మథనపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావించారు.

Andhra Pradesh Elections 2024: ఉత్తరాంధ్రలోని పలు పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగిన నాయకులు తమ వారసుల రాజకీయ భవితవ్యంపై మథనపడుతున్నారు. గడిచిన 20, 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తూ.. అనేకసార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసని ముఖ్యమైన నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించి.. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావించారు. అందుకు అనుగుణంగా గ్రౌండ్‌ను చాలా మంది నాయకులు ప్రిపేర్‌ చేశారు. కానీ, ఆయా నేతలకు పార్టీ అధిష్టానం నుంచి వారసుల రాజకీయ రంగ ప్రవేశానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించకపోవడంతో మరోసారి పోటీ చేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. వారసులను రంగ ప్రవేశం చేయించాలనుకునే వారి జాబితాలో వైసీపీతోపాటు టీడీపీలోనూ ఎక్కువగానే ఉంది. పార్టీ అధినాయకత్వ సూచనలతో సీనియర్‌ నేతలే మరోసారి బరిలోకి దిగాల్సి వస్తుండడంతో వారుసలకు మరికొంత కాలం నిరీక్షణ తప్పని పరిస్థితి ఏర్పడింది. 

బొత్స నుంచి అయ్యన్న కుమారుడి వరకు

వారుసుల రాజకీయ రంగప్రవేశం చేయించాలని భావించిన నాయకులు జాబితాలో సీనియర్‌ మంత్రి, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో రాజకీయ వారుసుడిని బరిలోకి దించాలని ఆయన ముందు నుంచీ భావిస్తూ వచ్చారు. ఇందుకోసం చాలా కాలం కిందటి నుంచే ఆయన గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేశారు. మాజీ ఎంపీ, తాజా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి(Botsa Jhanshi), మంత్సి బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్‌ బొత్స సందీప్‌(Botsa Sandeep)ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. డాక్టర్‌ బొత్స సందీప్‌ కూడా గత కొన్నాళ్లు నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. మెడికల్‌ క్యాంపులు, సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ, అనూహ్యంగా వైసీపీ అధిష్టానం బొత్స సందీప్‌ పోటీకి క్లియరెన్స్‌ ఇవ్వలేదు. ఈసారి కూడా బొత్స సత్యనారాయణ దంపతులు బరిలో ఉండాలని సీఎం జగన్‌ బలంగా ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే వారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో సందీప్‌ మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో వారుసులను బరిలో దించాలని భావిస్తున్న నాయకుల సంఖ్య అధికంగానే ఉంది. స్పీకర్‌ తమ్నినేని సీతారాం(Tammineni Sitaram) తన కుమారుడు చిరంజీవి నాగ్‌(Chiranjeevi Nag)ను పోటీ చేయించాలని భావించారు. అధిష్టానం నుంచి సానుకూలత రాకపోవడంతో ఆయనే పోటీకి సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఆయనకు పోటీగా మరో వ్యక్తి బలంగా పని చేస్తుండడంతో ఇక్కడ పోటీ వాతావరణం నెలకొంది.

ఇదే జిల్లాలో సీనియర్‌ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasada Rao) కుమారుడిని బరిలోకి దించాలని భావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నియోజకవర్గం అంతటా ఆయన కుమారుడు రామ్‌ మనోహర్‌ నాయుడు(Ram Manohar Naidu) విస్తృతంగా పర్యటిస్తున్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీకి పని చేస్తానన స్పష్టం చేశారు. కానీ, సీఎం జగన్‌ ఇందుకు అంగీకరించలేదని, మళ్లీ ఆయన్నే బరిలో దిగాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో మరోసారి బరిలో నిలిచేందుకు ధర్మాన సిద్ధమవుతున్నారు. 

మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌(Dharmana Krishna Das) కూడా వారసుడిని అసెంంబ్లీకి పంపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా బరిలోకి దిగిన ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య(Dharmana Krishna Chaitanya ) వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లేందుకు అనుగుణంగా పని చేసుకుంటూ వచ్చారు. కానీ, అధిష్టానం నుంచి అనుమతి రాకపోవడంతో మళ్లీ కృష్ణదాస్‌ పోటీకి సిద్ధపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీలోనూ వారసుల పోటీ ఎక్కువగానే ఉంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు(Kimidi Kalavenkata Rao) కుమారుడిని ఈ ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఎచ్చెర్ల నుంచి రామ్‌ మల్లిక్‌ నాయుడి(Ram Mallik Naidu)ని బరిలోకి దించాలని భావించి కళా.. పార్టీ నుంచి సానుకూలత రాకపోవడంతో మళ్లీ ఆయనే పోటీకి సిద్ధపడుతున్నారు. మాజీ మంత్రి ప్రతిభా భారతి(Pratibha Bharati) కూడా తన వారసురాలు కావలి గ్రీష్మ(Kavali Greeshma)ను పోటీ చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం సీటు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ, పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎదురు చూస్తున్నారు. 

విశాఖ(Visakha) జిల్లాలోనూ పలువురు సీనియర్‌ నేతల వారసులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)కి చెందిన నాయకులు వారసులు రెడీగా ఉన్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు(Ayyanna Patrudu) కుమారుడు విజయ్‌(Vijay), బండారు సత్యనారాయణమూర్తి(Bandu Satya Narayana Murthy) కుమారుడు అప్పలనాయుడు(Appala Naidu) ఉన్నారు. అయ్యన్నపాత్రుడు తనకు నర్సీపట్నం ఎమ్మెల్యే స్థానంతోపాటు కుమారుడికి అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నారు. పార్టీ నుంచి ఇంకా సానుకూల స్పందన రాకపోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. మాజీ మంత్రి బండారు కుమారుడు గడిచిన ఐదేళ్ల నుంచి పార్టీ వ్యవహారాలను పెందుర్తి నియోజకవర్గంలో చక్కబెడుతున్నారు. కానీ, పార్టీ ఇప్పట్లో అప్పలనాయుడుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో సీటును జనసేనకు ఇచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారసుడి పేరు ప్రతిపాదించడం కంటే.. తన పేరుతోనే ముందుకు వెళ్లడం వల్ల ఫలితం ఉంటుందని సత్యనారాయణమూర్తి భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక్కడి లెక్కలు ఆధారంగా అప్పలనాయుడు మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఎన్నికలు కీలకం.. పోటీ ఎక్కువ

రానున్న ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయమే లక్ష్యంగా పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయ అనుభవం లేని వారసులను పోటీలోకి దింపడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందని పార్టీ అధిష్టానాలు భావిస్తున్నాయి. సీనియర్‌ నాయకులు బరిలో దిగితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ నాయకత్వాలు భావిస్తుండడం వల్లే.. వారసులకు క్లియరెన్స్‌ ఇవ్వడం లేదు. వారసులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు విజయావకాశాలను పెంచే అవకాశముంటుందని సర్వేలు ద్వారా పార్టీలు గుర్తించాయి. అందుకే వారసులను ఈసారికి పోటీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget