అన్వేషించండి

UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం.. 50 వేలమంది పారామిలటరీ బలగాల మోహరింపు

ఉత్తర్‌ప్రదేశ్‌ తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది.

ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 10న జరగనున్న యూపీ తొలి విడత పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీకి మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరగనుంది.

11 జిల్లాల్లో..

తొలి విడత పోలింగ్‌లో భాగంగా యూపీలోని 11 జిల్లాలకు చెందిన 58 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. షామిలి, మథుర, ఆగ్రా, ముజఫర్‌నగర్, బాగ్‌పట్, మేరట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, హపుర్, బులంద్‌షహర్, అలీగఢ్.. జిల్లాల్లో ఈ పోలింగ్ జరగనుంది.

తొలి విడత ఎన్నికలకు ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. 7 విడతల యూపీ ఎన్నికల పోలింగ్ మార్చి 7న ముగియనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

భారీ భద్రత..

పోలింగ్ సందర్భంగా ఎలాంచి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్)కు చెందిన 412 కంపెనీల నుంచి దాదాపు 50 వేల బలగాలను పశ్చిమ యూపీ వ్యాప్తంగా మోహరించింది. 

యూపీ సరిహద్దులను పోలీసులు మూసివేశారు. గురువారం పోలింగ్ జరగనున్న 58 నియోజకవర్గాల్లో పోలీసులు నిఘా పెట్టారు.

" ముఖ్యంగా ముజాఫర్‌నగర్, ఆలీగఢ్, మేరట్‌లో ఎక్కువమందిని మోహరించాం. ఒక్క మథురలోనే 75 కంపెనీల బలగాలను భద్రతగా ఉంచాం. ఈ నియోజకవర్గంలోనే 21 వేల మంది బలగాలు పహారా కాస్తున్నాయి.                                                   "
-భద్రతా అధికారులు

వాహనాల తనిఖీ..

హరియాణా, రాజస్థాన్ సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లను పోలీసులు కట్టుదిట్టంగా చెక్ చేస్తున్నారు. అటుగా వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 48 గంటల పాటు లిక్కర్ షాపులను మూసివేయనున్నట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల లోపుల ఎక్కడైనా రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు సంబంధించిన పోస్టర్, బ్యానర్, హోర్డింగ్ కనిపిస్తే ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద పరిగణిస్తామని హెచ్చరించారు.

Also Read: Rahul Gandhi on BJP Govt: 'మోదీజీ.. సమతామూర్తి విగ్రహం మేడ్ ఇన్ చైనా.. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్?'

Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్ కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ.. మేం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం'

టాప్ హెడ్ లైన్స్

Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget