అన్వేషించండి

Telangana: బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, వలసలతో కేసీఆర్‌ ఉక్కిరిబిక్కిరి

former Brs Mps into Bjp : బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా గోడ దూకేస్తున్నారు. మరో ఇద్దరు బీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఆదివారం సాయంత్రం చేరిపోయారు.

Telangana Elections 2024: రాష్ట్ర విభజన తరువాత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించింది. కేసీఆర్‌ రెండోసారి సీఎం అయిన తరువాత రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా అనే పరిస్థితులు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీకి చెందిన బలమైన నేతలను అప్పటి టీఆర్‌ఎస్‌/బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. తొలి ఎన్నికల్లో విజయం తరువాత కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నికైన ఎంతో మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేలా చేశారు. రెండోసారి కూడా అదే వ్యూహాన్ని అనుసరించిన కేసీఆర్‌ రెండు పార్టీలను బలోపేతం కాకుండా చేశారు. ఇప్పుడు అదే కేసీఆర్‌కు వలసలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. అధికారం కోల్పోగానే బీఆర్‌ఎస్‌ నేతలు వరుసగా గోడ దూకేస్తున్నారు. మొన్నటి వరకు పార్టీలోకి వచ్చిన నేతలే తప్పా.. వెళ్లిన నేతలు లేని బీఆర్‌ఎస్‌కు ఇప్పుడు వలసలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

ఇరు పార్టీల్లోకి జోరుగా వలసలు

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీలోకి వెళుతున్న నేతల సంఖ్య భారీగా ఉంది. రెండు జాతీయ పార్టీలు ఆపరేషన్‌ ఆకర్స్‌ పేరుతో బీఆర్‌ఎస్‌ నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు ఇరు పార్టీల్లో చేరిపోయారు. వీరిలో పెద్దపల్లి ఎంపీ వెంకటేషన్‌ కాంగ్రెస్‌లో చేరిపోగా, పోతుగంటి రాములు, బీబీ పాటిల్‌ బీజేపీలో చేరారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జెడ్పీ చైర్మన్లు తీగల అనితారెడ్డి, సునీత మహేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి, డిప్యూటీ మేయర్‌ మోతే శ్రీలత, వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, తీగల కృష్ణారెడ్డి వంటి ఎంతో మంది నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరితోపాటు ప్రతి జిల్లా, నియోజకవర్గాల్లోనే ద్వితీయ శ్రేణి నేతలు భారీగా కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోతున్నారు. ఇవన్నీ బీఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు. గతంలో పార్టీలో చేరిన నేతలే తప్పితే.. పార్టీ నుంచి వెళ్లిన నేతలు గురించి తెలియని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులకు.. ఈ వ్యవహారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. 

మరో ఇద్దరు ఎంపీలు బీజేపీలోకి

తాజాగా మరో ఇద్దరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో ఆదివారం సాయంత్రం చేరిపోయారు. మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ మాజీ ఎంపీలు సీతారాం నాయక్‌, గోడం నగేశ్‌ బీజేపీలో చేరిపోయారు. అలాగే, హుజూర్‌నగర్‌, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, జలగం వెంకట్రావు ఢిల్లీలో ఆ పార్టీ సీనియర్‌ నేత తరుణ్‌చుగ్‌ సమకంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు లక్ష్మణ్‌, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. రానున్న రోజుల్లో బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని ఈ సందర్భంగా బీజేపీ నేతలు పేర్కొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. జూన్ 2 నుంచి రెండో విడత ఇళ్ల మంజూరు
Mouni Roy: విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
విడాకుల విషయంలో యూ టర్న్... తూచ్ అంటూ మళ్ళీ కలుస్తారా?
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
Brown Rice : బ్రౌన్ రైస్ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. వైట్ రైస్ కంటే ఎందుకు బెస్ట్ అంటే
బ్రౌన్ రైస్ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు.. వైట్ రైస్ కంటే ఎందుకు బెస్ట్ అంటే
PM Modi: 11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
11వ శతాబ్దపు చోళుల వారసత్వ సంపద మళ్లీ భారత్‌కు.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ
Embed widget