అన్వేషించండి

Telangana Elections 2023: సనత్ నగర్ లో తలసానితో కోట నీలిమ ఫైట్, పద్మారావు హ్యాట్రిక్ కొడతారా ?

బీఆర్ఎస్‌ సిట్టింగ్‌లకు మెజార్టీ స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లతో పాటు కొత్త వారిని బరిలోకి దించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి ఢీ కొట్టబోతున్నారు.

Sanath Nagar Assembly Seat: అధికార బీఆర్ఎస్‌ సిట్టింగ్‌లకు మెజార్టీ స్థానాలను కేటాయించింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లతో పాటు కొత్త వారిని బరిలోకి దించింది. ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలోని సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి కోట నీలిమ, అధికార పార్టీ తరపున తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తలపడుతున్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్ 1994, 99, 2008 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున, 2018 ఎన్నికల్లో సనత్ నగర్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఎ.సంతోష్‌ కుమార్‌, బీఆర్ఎస్ తరపున పద్మారావు బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు 2014, 2018  ఎన్నికల్లో గెలుపొందారు. హ్యాట్రిక్ విజయం సాధించాలని మరోసారి బరిలోకి దిగారు.

ఎమ్మెల్యేతో మాజీ ఎంపీ ఢీ 
ముషీరాబాద్‌  నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్‌, బీఆర్ఎస్‌ నుంచి ముఠా గోపాల్ పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్ గెలుపొందారు. మలక్‌పేటలో కాంగ్రెస్‌ నుంచి షేక్‌ అక్బర్‌, బీఆర్‌ఎస్‌ తరపున తీగల అజిత్ రెడ్డి తలపడుతున్నారు. కార్వాన్‌లో  కాంగ్రెస్ నుంచి  ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌హజ్రి, బీఆర్ఎస్‌ నుంచి క్రిష్ణయ్య పోటీ చేస్తున్నారు. చాంద్రయణగుట్టలో కాంగ్రెస్‌ నుంచి బోయ నగేశ్‌, బీఆర్ఎస్ తరపున సీతారాంరెడ్డి...యాకత్‌పుర కాంగ్రెస్ నుంచి కె. రవి రాజు, బీఆర్ఎస్‌ నుంచి సామ సుందర్ రెడ్డి బరిలోకి దిగారు. బహదూర్‌పుర కాంగ్రెస్ తరపున రాజేశ్‌ కుమార్‌ పులిపాటి, బీఆర్ఎస్‌ నుంచి అలి బక్రీ పోటీ చేస్తున్నారు.  

మైనంపల్లి వర్సెస్ మర్రి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడు స్థానాలకు కాంగ్రెస్‌ సీట్లు ప్రకటించింది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, బీఆర్ఎస్‌ నుంచి మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామాయంపేట నుంచి రెండు పర్యాయాలు, మెదక్‌ నుంచి ఒకసారి, మల్కాజ్‌గిరి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ఎమ్మెల్సీగాను పని చేసిన అనుభవం ఉంది. మర్రి రాజశేఖర్‌రెడ్డి గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మేడ్చల్‌ నియోజకవర్గంలో తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌,  మంత్రి చామకూర మల్లారెడ్డిని ఢీ కొట్టబోతున్నారు. మల్లారెడ్డి రెండోసారి మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఆయన 2014లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా గెలుపొందారు. రెండోసారి మేడ్చల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 

కేపీ వివేకానంద హ్యాట్రిక్ కొడతారా ?
కుత్బుల్లాపూర్‌లో హస్తం పార్టీ నుంచి కొలన్‌ హన్మంత్‌ రెడ్డి, గులాబీ పార్టీ తరపున కేపీ వివేకానంద ఫైట్‌ చేయబోతున్నారు. కేపీ వివేకానంద ముచ్చటగా మూడోసారి కుత్బుల్లాపూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలుపొందగా, 2018లో బీఆర్ఎస్‌ తరపున విజయం సాధించారు. చెవేళ్లలో హస్తం పార్టీ నుంచి భీమ్ భరత్, బీఆర్ఎస్‌ నుంచి కాలే యాదయ్య బరిలోకి దిగారు. కాలే యాదయ్య ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగారు. 2014, 2018లో  ఇదే స్థానం యాదయ్య గెలుపొందారు. పరిగిలో కాంగ్రెస్‌ నుంచి రామ్మోహన్‌ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి కొప్పుల మహేశ్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. వికారాబాద్‌లో హస్తం పార్టీ నుంచి మాజీ మంత్రి ప్రసాద్‌ కుమార్‌, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్‌ నుంచి బరిలోకి దిగారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ తరపున పరమేశ్వర్‌ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బండారి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget