అన్వేషించండి

PM Modi: ప్ర‌ధాని మోడీ ధీమా - వంద రోజుల పాల‌న‌కు అప్పుడే రోడ్ మ్యాప్ త‌యారీ!

PM Modi: దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోలాహ‌లం ప్రారంభ‌మైంది. ఈ ఎన్నిక‌ల్లో గెలుపుపై అధికార ఎన్డీయే ధీమా వ్య‌క్తం చేస్తోంది. పీఎం మోదీ కచ్చితంగా హ్యాట్రిక్ కొడతారనే ధీమాతో ఉన్నారు.

PM Modi: దేశంలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల(General Elections) కోలాహ‌లం ప్రారంభ‌మైంది. దేశ‌వ్యాప్తంగా 543 పార్ల‌మెంటు స్థానాల‌కు న‌గారా మోగిన నేప‌థ్యంలో జాతీయ‌(National), ప్రాంతీయ‌ పార్టీలు ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడ‌తారు? అనేది జూన్ 4న జ‌ర‌గ‌నున్న ఓట్ల లెక్కింపు(Vote counting)తో తేలిపోనుంది. అయితే.. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ త‌మ‌దే గెలుపు అని బ‌ల్ల‌గుద్దిన‌ట్టు చెబుతున్న ఏకైక పార్టీ భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP) మాత్ర‌మే. వాస్త‌వానికి అధికారానికి ప‌దేళ్ల‌పాటు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ త‌ర‌హాలో ధీమా వ్య‌క్తం చేయక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA) కూట‌మి మాత్రం గెలుపుపై ప‌క్కా ధీమాతో ఉంది. మూడోసారి కూడా తామే అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) ప‌దే ప‌దే చెబుతున్నారు. ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా.. ఇదే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని చిల‌క‌లూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన `ప్ర‌జాగ‌ళం` స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కూడా ఆయ‌న ఎన్డీయే కూట‌మికి 400 పైచిలుకు పార్ల‌మెంటు సీట్లు ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ ఒక్క‌చోటే కాదు.. దేశంలో ఎక్క‌డ ప‌ర్య‌టిస్తున్నా.. ``ఔర్ ఏక్‌బార్‌`` నినాదాన్నే మోదీ వినిపిస్తున్నారు. 

ఎందుకీ ధీమా!

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi) క‌న‌బ‌రుస్తున్న ఈ ధీమా వెనుక కార‌ణం ఏంటి? అనేది ఆస‌క్తిగా మారింది. గ‌త ప‌దేళ్లలో ఎన్డీయే హ‌యాంలో అనేక సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డం, సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింప‌డం ప్ర‌ధాన కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయి. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు ద్వారా.. దేశ‌ప్ర‌జ‌ల‌కు అంద‌రికీ జ‌మ్ము క‌శ్మీర్‌పై హ‌క్కులు క‌ల్పించారు. అదే విధంగా అక్క‌డి వారికి కూడా స్వేచ్ఛ క‌ల్పించారు. అస‌లు గ‌త ప్ర‌భుత్వాలు త‌లుచుకునేందుకు కూడా భ‌య‌ప‌డిన ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు వంటివి ప్ర‌ధాని మోదీ త‌న హ‌యాంలో సాధించారు. అలానే.. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం(సీఏఏ) వంటివి తీసుకువ‌చ్చారు. ఇక‌, 500 ఏళ్ల నాటి స‌మ‌స్య అయోధ్య రామ‌మందిరానికి కూడా ఈ ప‌దేళ్ల కాలంలోనే ఒక ప‌రిష్కారం ల‌భించింది. క‌రోనాను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొని.. ప్ర‌పంచానికి సైతం భార‌త్ ద‌న్నుగా నిలిచింది. అంతేకాదు..అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో పాటు అవినీతి ర‌హితంగా పాల‌న అందించ‌డం.. మోదీ పాల‌న‌లో ఎన్న‌ద‌గిన విష‌యం. ఇక‌, గ‌త కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఇత‌ర దేశాల‌పై ఆధార‌ప‌డే ప‌రిస్థితిని ప‌క్క‌న పెట్టి ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా మేకిన్ ఇండియాకు పెద్ద‌పీట వేశారు. ఫ‌లితంగా.. ర‌క్ష‌ణ రంగం స‌హా అనేక అంశాల్లో భార‌త్ ఇప్పుడు త‌యారీ కేంద్రంగా నిలిచింది. అంతేకాదు.. పొరుగు దేశాల‌కు ఎగుమతులు చేసే స్థాయికి కూడా చేరింది. ఇలా.. ఏ విధంగా చూసుకున్నా.. ఆయన తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు, వేసిన అడుగులు గెలుపుపై ధీమా వ్యక్తం చేసేలా దోహ‌ద‌ప‌డ్డాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

వ‌చ్చే 100 రోజుల‌కు మాస్ట‌ర్ ప్లాన్‌

వాస్త‌వానికి దేశంలో ఇంకా సార్వ‌త్రిక స‌మ‌రం పూర్తి కాలేదు. ఇప్పుడే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. కానీ, ప్ర‌ధాని మోదీ మాత్రం తిరిగి త‌మ ప్ర‌భుత్వ‌మే ముచ్చ‌టగా మూడోసారి కూడా కొలువు దీరుతుంద‌ని ఆశాభావంతోపాటు అచంచల విశ్వాసంతో ఉన్నారు. అందుకే ఆయ‌న త‌న మంత్రివ‌ర్గ బృందానికి.. పెద్ద టాస్క్ అప్ప‌గించారు. మూడోసారి త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత వ‌చ్చే 100 రోజుల‌(100 Days)కు ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేయాలో మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేయాల‌ని సూచించారు. మొదటి 100 రోజుల పాలనలో అమలు చేసే కార్యక్రమాలకు సంబంధించి ఓ రోడ్‌ మ్యాప్‌ రూపొందించాలని కేంద్ర మంత్రులను కోరారు. ఆదివారం ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్ల కొత్త ప్రభుత్వం కోసం తొలి వంద రోజుల్లో అమలు చేసే కార్యక్రమాలను ఏ విధంగా మెరుగ్గా అమలు పరచాలన్నది చర్చించారు. దీనిపై కేంద్రమంత్రులు వారి శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులను కలవాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మరునాడే ఈ సమావేశం జరగ‌డం గ‌మ‌నార్హం. ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ సిఫార్సును రాష్ట్రపతికి పంపడం ద్వారా లోక్‌సభ ఎన్నికల తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కూడా క్యాబినెట్ పూర్తి చేసింది. మొత్తంగా చూస్తే.. గెలుపుపై ప్రధాని మోదీ పూర్తి విశ్వాసంతో ఉన్నార‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lok Sabha Seats: లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరుగుతాయి
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!

వీడియోలు

Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
RCB KSCA Tributes Stampede Victims | విషాధ ఘటనను జ్ఞాపకంగా మార్చిన ఆర్సీబీ | ABP Desam
Petro Effect on PSL 2026 | పాపం పాకిస్తాన్ సూపర్ లీగ్ కాస్తా పెట్రోల్ షార్టేజ్ లీగ్ అయ్యిందే | ABP Desam
BCCI IPL 2026 New Rules | ఐపీఎల్ లో స్ట్రిక్ట్ రూల్స్...బీసీసీఐ సంచలన నిర్ణయం | ABP Desam
Jasprit Bumrah Injured IPL 2026 | ప్రాక్టీస్ మ్యాచ్ లకు హాజరుకాని జస్సీ భాయ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Semaglutide: సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
సెమాగ్లుటైడ్ వాడకంపై తెలంగాణ డీసీఏ కీలక ఆదేశాలు!సెల్ఫ్‌మెడికేషన్ ప్రాణాంతకమని హెచ్చరిక 
Tamil Nadu Assembly Elections 2026: పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
పురుషులకూ ఉచిత బస్సు, ఇంటికో ఫ్రిడ్జ్, దశలవారీ మద్యనిషేధం - అన్నాడీఎంకే మేనిఫెస్టోలో అన్నీ వింతలే
Fuel Crisis in Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
హైదరాబాద్‌లో పెట్రోల్, LPG కష్టాలు! బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక సూచన
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Bomb Threat: ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
ఢిల్లీ సీఎం, అసెంబ్లీకి బాంబు బెదిరింపు.. ఈమెయిల్‌లో ప్రధాని మోదీ, అమిత్ షా పేర్లు ప్రస్తావన
RCB vs SRH Tickets Live: నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్ టికెట్ ఎక్కడ తీసుకోవాలి
నేడు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు సేల్ ప్రారంభం.. RCB vs SRH Tickets ఎక్కడ తీసుకోవాలి
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
లాక్మే ఫ్యాషన్ వీక్ లో రాజాసాబ్ బ్యూటీ! వర్చువల్ హగ్ ఇవ్వాలనుకుంటున్నా అంటూ పోస్ట్!
Professor Without a PhD : PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
PhD లేకుండా కూడా ప్రొఫెసర్ అవ్వొచ్చని తెలుసా? ప్రాక్టీస్ ప్రొఫెసర్ గురించిన పూర్తి వివరాలివే
Embed widget