అన్వేషించండి

Srikakulam News: పాలకొండ ఎప్పుడూ కీలకమే - ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఏ జెండా ఎగిరేనో?

Palakonda is always important.. Which flag will fly here next time : ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మరో నియోజకవర్గం పాలకొండ. ఈ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో చేరింది.

Palakonda Constituency Present Politcal Scenario: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని మరో నియోజకవర్గం పాలకొండ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలను పునర్విభజించింది. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో చేరింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా.. నాలుగు సార్లు టీడీపీ, నాలుగుసార్లు కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. గడిచిన రెండు ఎన్నికల్లోను వైసీపీ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో 2,24,865 మంది ఓటర్లు ఉండగా, పురుష ఓటర్లు 1,13,572 మంది, మహిళా ఓటర్లు 1,11,274 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

నాలుగు సార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్ విజయం

పాలకొండ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, మరో నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయాన్ని దక్కించుకున్నారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన పి.సంగం నాయుడు కేఎల్పి పార్టీ నుంచి బరిలోకి దిగిన ఎమ్మార్ నాయుడుపై 1632 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పిఎస్ అప్పారావు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కేఎస్ నాయుడుపై 772 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కేఎస్ నాయుడు ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిఎన్ అప్పారావుపై 5453 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన జోజి ఇక్కడ విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కే నర్సయ్యపై 1895 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కే నరసయ్య తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పి జయమ్మ పై 19,506 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన కేజీ రాజారత్నం తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి ఆదినారాయణపై 11,758 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్యామారావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జె.లచ్చయ్యపై 19,085 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టీ.భద్రయ్య ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అమృత కుమారిపై 22,904 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పీజీ అమృతకుమారి ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జి.సత్తయ్యపై 1175 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన టి.భద్రయ్య ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పీజే అమృత కుమారిపై 20,974 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పీజే అమృతకుమారి మరోసారి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన టీ భద్రయ్య 1196 ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. 2004 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంబాల జోగులు ఇక్కడ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన టి.రాంబాబుపై 11,624 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేశారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన నిమ్మక సుగ్రీవులు ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మక గోపాలరావుపై 16,150 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విశ్వసరాయి కళావతి ఇక్కడ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల తేడాతో ఆమె విజయాన్ని దక్కించుకున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇక్కడ విశ్వసరాయి కళావతి విజయం సాధించారు. వైసీపీ నుంచి ఆమె మరోసారి ఇక్కడ బరిలోకి దిగారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన నిమ్మక జయకృష్ణపై 17,980 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుని వరుసగా రెండోసారి ఇక్కడ నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను విశ్వసరాయి కళావతి మరోసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు నిమ్మక జయకృష్ణ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదే పార్టీ నుంచి మరో అభ్యర్థి కూడా తన ప్రయత్నాలను సాగిస్తున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు కొంత ఇబ్బందికరంగా ఆ పార్టీకి మారాయి. గడిచిన మూడు ఎన్నికల్లోను ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయాలన్న లక్ష్యంతో అధిష్టానం అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎన్నికలు జరిగిన సరళని పరిశీలిస్తే పలువురు రెండుసార్లు చొప్పున ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి గడిచిన రెండు ఎన్నికల్లోను విజయం సాధించారు. పీజే అమృత కుమారి, టి.భద్రయ్య, కే.సంఘం నాయుడు రెండుసార్లు చొప్పున ఇక్కడ విజయాన్ని సాధించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Tamil Nadu Assembly Election 2026: తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
తమిళనాడులో టీవీకే ఒంటరిగా పోటీ.. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో పెరిగిన ఉత్కంఠ!
West Bengal Election 2026: బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!
బెంగాల్ ఫైట్: మైనారిటీ ఓట్లతో దీదీ, పంచముఖ వ్యూహంతో మోదీ!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mid Day Meals Scheme: గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
గరికపాటి వ్యాఖ్యలు బాధాకరం, మధ్యాహ్న భోజనం పేద పిల్లల హక్కు: ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
Bhadrachalam Temple: 3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
3 దశలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Fast Printout: జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
జిరాక్స్ షాప్ వద్ద క్యూ లైన్ ఉందా? QwikPrint మెషిన్ కనిపిస్తే ప్రింటౌట్ తీసుకోండి
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Embed widget