అన్వేషించండి

Maharastra Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ - మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో వెల్లువెత్తిన చైతన్యం

Election Commission Of India: మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో 58.22, ఝార్ఖండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Maharastra And Jharkhand Assembly Elections Comleted: మహారాష్ట్ర (Maharastra), ఝార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 288 నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో పోలింగ్ సాగింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి బరిలో నిలిచాయి. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 58.22 శాతం, ఝార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో 67.59 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంకా క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న గడ్చిరోలిలో అత్యధికంగా 62.99 శాతం పోలింగ్ నమోదు కాగా.. థానేలో అత్యల్పంగా 38.94 శాతం ఓటింగ్, ముంబైలో 39.34 శాతం, ముంబై సబర్బన్‌లో 40.89 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

అటు, ఝార్ఖండ్‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఈ నెల 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 38 స్థానాలకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. 38 స్థానాల్లో 528 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘాట్ బంధన్ పేరుతో పోటీ చేశాయి. బీజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జన్‌శక్తి రామ్ విలాస్ పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమిగా పోటీ చేశాయి.

చెదురుమదురు ఘటనలు

మహారాష్ట్రలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లి నియోజకవర్గం ఘట్నందూరు గ్రామంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. బూత్‌లోని ఈవీఎం మెషీన్లు, టేబుల్స్, ఇతర సామాగ్రి కిందపడ్డాయి. దీంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్ అధికారులు నిలిపేశారు. అయితే, పోలింగ్ బూత్ ధ్వంసానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్సీ)కి చెందిన స్థానిక నేత మాధవ్ జాదవ్‌పై పర్లీ టౌన్‌లోని బ్యాంక్ కాలనీ ప్రాంతంలో దాడి జరిగింది. అధికారంలో ఉన్న మహాయుతి కూటమి కార్యకర్తల దూకుడు కారణంగా పోలింగ్ బూత్ వద్ద గొడవ జరిగిందని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి ఆరోపించింది. ఈ క్రమంలో కార్యకర్తలు తోసుకోవడం వల్లే ఈవీఎం మిషన్లు కిందపడ్డాయని పేర్కొంది. కాగా, పోలింగ్ బూత్ వద్ద పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

Also Read: School Fees: ఒకటో తరగతి ఫీజు రూ.4లక్షలు - పిల్లల చదువు కూడా లగ్జరీనే- వైరల్ అవుతున్న ఓ తండ్రి ఆవేదన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
Congress Wins Jangaon and Thorrur: లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
Nellore and Eluru Mayor Elections: ఈ 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు
ఈ 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Ranji Trophy Winner: తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌ నెగ్గిన జమ్మూ కాశ్మీర్.. ఫైనల్లో కర్ణాటకపై ఘనవిజయం
Kakinada Fire Cracker Explosion: బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
బాణసంచా తయారీ కేంద్రం వద్ద అంతా బూడిదే.. ముక్కలుగా మృతదేహాలు, భయానక దృశ్యాలు
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
పెరుగుతున్న EMI భారం నుంచి ఇలా బయటపడండి.. ఈ చిట్కాలు పాటించకపోతే కష్టమే
Embed widget