అన్వేషించండి

Maharastra Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ - మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో వెల్లువెత్తిన చైతన్యం

Election Commission Of India: మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో 58.22, ఝార్ఖండ్‌లో 67.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Maharastra And Jharkhand Assembly Elections Comleted: మహారాష్ట్ర (Maharastra), ఝార్ఖండ్ (Jharkhand) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 288 నియోజకవర్గాలున్న మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో పోలింగ్ సాగింది. ఇక్కడ ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి బరిలో నిలిచాయి. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 58.22 శాతం, ఝార్ఖండ్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల్లో 67.59 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇంకా క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న గడ్చిరోలిలో అత్యధికంగా 62.99 శాతం పోలింగ్ నమోదు కాగా.. థానేలో అత్యల్పంగా 38.94 శాతం ఓటింగ్, ముంబైలో 39.34 శాతం, ముంబై సబర్బన్‌లో 40.89 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

అటు, ఝార్ఖండ్‌లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. ఈ నెల 13న తొలి విడతలో 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 38 స్థానాలకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లోని 31 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. 38 స్థానాల్లో 528 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ కలిసి మహాఘాట్ బంధన్ పేరుతో పోటీ చేశాయి. బీజేపీ, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జన్‌శక్తి రామ్ విలాస్ పార్టీలతో కలిసి ఎన్డీయే కూటమిగా పోటీ చేశాయి.

చెదురుమదురు ఘటనలు

మహారాష్ట్రలో పలుచోట్ల చెదురుమదురు ఘటనలతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లి నియోజకవర్గం ఘట్నందూరు గ్రామంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. బూత్‌లోని ఈవీఎం మెషీన్లు, టేబుల్స్, ఇతర సామాగ్రి కిందపడ్డాయి. దీంతో అక్కడ కొద్దిసేపు పోలింగ్ అధికారులు నిలిపేశారు. అయితే, పోలింగ్ బూత్ ధ్వంసానికి కారణం ఏంటనేది తెలియరాలేదు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్సీ)కి చెందిన స్థానిక నేత మాధవ్ జాదవ్‌పై పర్లీ టౌన్‌లోని బ్యాంక్ కాలనీ ప్రాంతంలో దాడి జరిగింది. అధికారంలో ఉన్న మహాయుతి కూటమి కార్యకర్తల దూకుడు కారణంగా పోలింగ్ బూత్ వద్ద గొడవ జరిగిందని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి ఆరోపించింది. ఈ క్రమంలో కార్యకర్తలు తోసుకోవడం వల్లే ఈవీఎం మిషన్లు కిందపడ్డాయని పేర్కొంది. కాగా, పోలింగ్ బూత్ వద్ద పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

Also Read: School Fees: ఒకటో తరగతి ఫీజు రూ.4లక్షలు - పిల్లల చదువు కూడా లగ్జరీనే- వైరల్ అవుతున్న ఓ తండ్రి ఆవేదన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
SIR Process In Andhra Pradesh and Telangana 2026: 24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
24 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఓటర్‌ లిస్ట్ క్లీన్‌ అప్ డ్రైవ్! మీ ఓటు భద్రమేనా?
SIR 2026: SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
SIR సర్వే కోసం మీ ఇంటికి అధికారులు వస్తున్నారా? సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు ఇవే!
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
Telangana Politics: రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
రాహుల్ గాంధీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి: సీఎం రేవంత్ రెడ్డికి రామచందర్ రావు లేఖ
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!
Suriya 47 : సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
సూర్య సినిమాలో మోహన్ లాల్ - అసలు నిజం ఏంటో చెప్పిన డైరెక్టర్
Vaibhav Sooryavanshi World Record: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం: లంక జట్టుపై 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. 21 ఏళ్ల రికార్డ్ స్మాష్!
Student Punishment: కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
కృష్టా జిల్లాలో స్కూల్లో అమానుషం.. బాలుడిని రోజంతా గడ్డిలో కూర్చోబెట్టిన టీచర్!
RTC Bus Fire Accident: మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం, హైదరాబాద్ వెళ్తుండగా అగ్ని ప్రమాదం
Ananya Nagalla : అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
అనన్య 'యోగ'మ్... పీస్ ఫుల్ 'ఆరోగ్య'మ్ - ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్
Embed widget