అన్వేషించండి

Pinnelli Brothers : మాచర్ల ఘర్షణల కేసుల్లో పిన్నెల్లి బ్రదర్స్ పేరు - గన్‌మెన్లను వదిలేసి ఆజ్ఞాతంలోకి !

Andhra News : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఆయన సోదరుడు కనిపించడంలేదు. మాచర్ల ఘర్షణల కేసుల్లో వారి పేర్లును చేర్చారని తెలిసిన తర్వాత గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది

Elections 2024 :   పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.  ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవల్లో ప్రధాన పాత్ర వెంకటరామిరెడ్డిదేనని పోలీసులు గుర్తించారు. రణ చింతల మండలం రెంటాల.. కారంపొడి లో జరిగిన గొడవల్లో వెంకటరామిరెడ్డి పాత్ర ఉందని  సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు.  వెంకటరామిరెడ్డి కి ఇద్దరు గన్ మెన్‌లు ఉన్నారు.  ఇద్దరు గన్ మేన్ లు ఎస్పీ ఆఫీసులో  రిపోర్టు చేశారు. తమకు తెలియకుండా .. చెప్పకుండా వెంకటరామిరెడ్డి వెళ్లిపోయారని.. కాంటాక్ట్ లో లేరని వారు ఎస్పీ ఆఫీసులో చెప్పారు. 

మొత్తం పదమూడు హంసాత్మక ఘటనలు                                       

మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఎన్నికల రోజు..  ఆ తరువాత మొత్తం 13 హింసాత్మక సంఘటన జరిగినట్టు పోలీసులు గుర్తించారు.  వీటిలో వైసిపి వాళ్లు చేసిన దాడులపై 7 వరకు కేసు నమోదు చేసినట్లుగాతెలుస్తోంది.  హత్యా ప్రయత్నం.. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.    గుంటూరు రేంజ్ ఐజి త్రిపాఠి మాచర్లలో ఉండి కేసుల దర్యాప్తును పరిశీలిస్తున్నారు.  పోలింగ్ తర్వాతి రోజు 14వ తేదీ జరిగిన కారంపూడిలో టీడీపీ కార్యాలయం. టీడీపీ నేతలపై దాడుల్లో నిందితులుగా  పిన్నెల్లి సోదరులను  చేర్చాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే పిన్నెల్లి సోదరులు ఆజ్ఞాతంలోకి వెళ్లారని చెబుతున్నారు. 

వీడియో సాక్ష్యాలు వెలుగులోకి  తెస్తున్న పోలీసులు                                    

13,  14 తేదీల్లో జరిగిన గొడవలకు సంబంధించి సీసీ ఫుటేజీ.. వివిధ ఛానల్స్ లో ప్రసారమైన వీడియోలోని లింకులను  పోలీసులు పరిశీలిస్తున్నారు. వివిధ మీడియా ఛానల్స్ కి ఫోన్ చేసి  ఆధారాలు ఇవ్వాలని కోరుతున్నారు. దాడులపై వీడియో సాక్ష్యాలు ఉండటంతో  ప్రత్యక్షంగా పాల్గొన్న వారందర్నీ  అరెస్టు చేయడం ఖాయమని పోలీసు  వర్గాలు చెబుతున్నాయి.    స్థానిక ఎన్నికల సమయంలో  మాచర్ల నియోజకవర్గంలో అరాచకాలకు  లెక్కే లేదు. ఒక్కరు కూడా నామినేషన్లు వేయలేకపోయారు. మాచర్ల మున్సిపాలిటీ మొత్తం ఏకగ్రీవం అయింది. జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి.  

తక్షణం చర్యలు తీసుకుని నివేదిక ఇవ్వాలన్న ఈసీ                              

మాచర్లలో పోలింగ్ అనంతర హింసపై ఈసీ తీవ్ర ఆగ్రగహంతో పోలీసు అధికారుల్ని సస్పెండ్ చేసింది. హింసకు కారణం అయిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని అరెస్టు చేసి ఈసీకి చెప్పాలనుకున్నారు కానీ.. ఎమ్మెల్యే సోదరిలిద్దరూ ఆజ్ఞాతంలోకి  పోవడం చర్చనీయాంశంగా మారింది. అరెస్టు చేస్తారని వీరికి ముందుగా సమాచారం రావడంతోనే వెళ్లిపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget