అన్వేషించండి

Gujarat Assembly Election 2022: ఈ స్థానాన్ని ఎవరు గెలిస్తే ఆ పార్టీయే గుజరాత్‌ను పాలించేది

Gujarat Assembly Election 2022: 1975 ఎన్నికల్లో కాంగ్రెస్ 75 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ నుంచి విడిపోయిన భారత జాతీయ కాంగ్రెస్ (ఓ) 56 స్థానాలను గెలుచుకుంది.

Gujarat Assembly Election 2022: గుజరాత్‌లో ఒక అసెంబ్లీ స్థానం చాలా వైవిధ్యంగా ఉంటుంది. అక్కడ గెలిచిన పార్టీయే ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. 1960లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన మొత్తం 13 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరుగుతోంది. అ నియోజకవర్గమే వల్సాడ్.

వల్సాడ్‌ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్న పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక్కసారి మాత్రమే దీనికి భిన్నంగా జరిగింది. 

1962లో గుజరాత్‌లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి కాంగ్రెస్ 1975 వరకు కాంగ్రెస్ పాలించింది. 1975 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ, మెజారిటీ మార్కుకు సీట్లు రాకపోవడంతో అప్పుడు హంగ్‌ ప్రభుత్వం ఏర్పడింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో హంగ్ అసెంబ్లీ కేవలం రెండుసార్లు మాత్రమే నమోదైంది. మొదటిసారి 1975 ఎన్నికల్లో, రెండోసారి 1990 ఎన్నికలలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 

భారతీయ జనసంఘ్ 18 స్థానాలను గెలుచుకుంది.

1975 ఎన్నికల్లో కాంగ్రెస్ 75 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ నుంచి విడిపోయిన భారత జాతీయ కాంగ్రెస్ (ఓ) 56 స్థానాలను గెలుచుకుంది. ఐఎన్‌సి(ఓ)ను అనధికారికంగా 'సిండికేట్ కాంగ్రెస్' అని కూడా పిలిచేవారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ (బీజేఎస్) 18 స్థానాలను గెలుచుకుంది. సిండికేట్ కాంగ్రెస్, బిజెఎస్ కలిసి 74 సీట్లు సాధించాయి, అయినప్పటికీ, ఇది మెజారిటీకి 17 సీట్లు తక్కువగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీ లేదా కూటమి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 91 కంటే ఎక్కువ సీట్లు అవసరం.

చిమన్ భాయ్ పటేల్ కె.ఎం.ఎల్.పి ఏర్పాటు

ఆ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చిమన్ భాయ్ పటేల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి కిసాన్ మజ్దూర్ లోక్ పక్ష (కెఎంఎల్ పి) అనే రాజకీయ పార్టీని స్థాపించి 131 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు. దాని అభ్యర్థులు 12 స్థానాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంలో చిమన్ భాయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమైంది. తరువాత సిండికేట్ కాంగ్రెస్, బిజెఎస్, కె.ఎం.ఎల్.పి తదితరుల మద్దతుతో రాష్ట్రంలో జనతా మోర్చా ప్రభుత్వం ఏర్పడి బాబూభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ఏడాది వల్సాడ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిండికేట్ కాంగ్రెస్‌కు చెందిన కేశవ్ భాయ్ పటేల్ విజయం సాధించారు. ఈ ఎన్నికలలో ఆయన కాంగ్రెసు అధికార అభ్యర్థి గదాభాయ్‌ను ఓడించారు.

కేశవ్ భాయ్ పటేల్ 1972 ఎన్నికలలో విజయం 

ఇప్పటి వరకు వల్సాడ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1972 మాత్రమే అక్కడ నుంచి గెలిచిన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ ఎన్నికల్లో 140 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనేది కూడా వాస్తవం. కానీ అంతర్గత విభేదాల కారణంగా మధ్యలోనే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఫలితంగా కొంతకాలం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవలసి వచ్చింది. వల్సాడ్‌లో సిండికేట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేశవ్ భాయ్ పటేల్ ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ దేశాయ్‌ను 6,908 ఓట్ల తేడాతో ఓడించారు.

1980 రియు 1985 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం

1975 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ నుంచి గెలిచిన పార్టీ గుజరాత్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1980, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ధోరణి 1990, 1995, 1998, 2002, 2007, 2012, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగింది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో వల్సాడ్ నుంచి బీజేపీ నేత భరత్ పటేల్ విజయం సాధిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని గెలిపించడం వల్సాద్ సంప్రదాయం అని ఆయన అన్నారు.

ఈ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన సమీకరణాలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తానని భరత్‌ పటేల్‌  పేర్కొన్నారు. దేశ తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి, భారతరత్న అవార్డు గ్రహీత మొరార్జీ దేశాయ్ గుజరాత్ ఆగ్నేయ భాగంలోని సముద్రతీరంలో ఉన్న వల్సాడ్ జిల్లాలో జన్మించారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం త్వరలో తేదీలను ప్రకటించవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Congress Politics: తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్
తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళ్లను.. నా సీటును బీజేపీ చోరీ చేసింది: మీనాక్షి నటరాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget