అన్వేషించండి

Chandrababu: 'అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు' - ఆస్తుల భద్రత కోసం కూటమిని గెలిపించాలని చంద్రబాబు పిలుపు

Andhra Pradesh News: తాడేపల్లిలో పెద్ద సైకో ఉంటే.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని అన్నారు.

Chandrababu Comments In Gannavaram: కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో (Gannavaram) శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో పెద్ద సైకో ఉంటే.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని మండిపడ్డారు. రాజకీయ రౌడీలను తుంగలో తొక్కేస్తామని హెచ్చరించిన ఆయన.. గన్నవరం టీడీపీకి కంచుకోట అని అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. 'ప్రజల ఆస్తులపై సీఎం జగన్ ఫోటో ఎందుకు.?. కూటమి అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే మీ భూములు లాక్కొంటారు. భూములు అమ్మాలన్నా.. కొనాలన్నా జగన్ అనుమతి తీసుకోవాలి. మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి. వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి గొడ్డలి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులను సైతం వైసీపీ ప్రభుత్వం వేధించింది.' అని చంద్రబాబు విమర్శించారు. గన్నవరంలో 9 సార్లు ఎన్నికలు జరిగితే.. ఇండిపెండెంట్ తో కలిసి టీడీపీ 8 సార్లు విజయం సాధించిందని గుర్తు చేశారు. ఎంపీ అభ్యర్థి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, గన్నవరంలో భారీ వర్షంలోనే చంద్రబాబు ప్రసంగం సాగింది. అయితే, భారీ వర్షంలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

మాచర్ల పర్యటన రద్దు

అయితే, గన్నవరం సభ అనంతరం చంద్రబాబు మాచర్లలో (Macharla) పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా రద్దైంది. మాచర్ల ఎయిర్ రూట్ క్లిష్టంగా ఉందని.. అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణం సాగించలేమని పైలెట్లు చెప్పడంతో ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో గన్నవరం నుంచి నేరుగా ఒంగోలుకే బయల్దేరారు. కాగా, వాతావరణం ఇబ్బంది కారణంగా మాచర్ల సభ రద్దైందని.. ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 'మాచర్ల వచ్చేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా సాధ్యం కాలేదు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ట్వీట్

అంతకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు ట్వీట్ చేశారు. 'స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం... భూమికి చెట్టుకు ఉన్నంతగా ఉంటుంది. వందల తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని దాచుకోవడమే కానీ... ఆ తరాల మధ్య ప్రేమలను పట్టించుకోడు జగన్. అందుకే చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత దుర్మార్గమైనదో, దీనికి ఎంతమంది బలయ్యారో ఈ ప్రకటన చూస్తే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది.' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read: Sharmila : తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget