అన్వేషించండి

Sharmila : తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు

Andhra Politcs : చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు ఇచ్చిన మాటను వైఎస్ జగన్ తప్పారని షర్మిల ఆరోపించారు. జగన్ మానసిక స్థితిపై తనకు ఆందోళనగా ఉందన్నారు.

Elections 2024 :   అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ సమరంలో  ఇంత కాలం గుట్టుగా ఉన్న అనేక విషయాలను ఎవరికి వారే బయట పెట్టుకుంటున్నారు. సీఎం జగన్ మీడియా ఇంటర్యూల్లో కొన్ని విషయాలు చెబుతూండగా.. షర్మిల కూడా రివర్స్ లో ఇంత కాలం బయటకు తెలియని కొన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. శుక్రవారం షర్మిల నిర్వహించన ప్రెస్ మీట్ లో వైఎస్ విజయలక్ష్మి ప్రస్తావన తీసుకు వచ్చారు.  చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ మాట ఇచ్చారన్నారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తల్లికి ఇచ్చిన  మాటనే నిలబెట్టుకోలేని జగన్ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

వైఎస్ విజయలక్ష్మి గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేశారు. ఇటీవలికాలం వరకూ ఆమె గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మే పోటీ చేశారు. అసెంబ్లీలో వైసీపీ తరపున పోరాడారు. వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తూ వస్తున్నారు. విజయలక్ష్మిని విశాఖ ఎంపీగా నిలబెట్టడంతో ఆమె పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నుంచి  మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.                           

అదే సమయంలో షర్మిల కోసం వైసీపీ కోసం పని చేశారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరించారు. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం కానీ.. మరో రకమైన పదవిని కానీ ఆశించలేదు. షర్మిలకు వైసీపీలో ఎప్పుడూ ఎలాంటి పదవి ఇవ్వలేదు. అయితే షర్మిలను ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ హామీ ఇచ్చినట్లుగా తాజాగా షర్మిల చెప్పారు.  రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుల్లా గతంలో వైఎస్  షర్మిల   పేరు కూడా వినిపించేది. తర్వాత ఏమయిందో కానీ షర్మిలకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకోవడంతో తన అవసరం కుమార్తెకు ఎక్కువగా ఉందని .. అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్లీనరీలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రచారం చేయడం ఇష్టం లేక అమెరికా వెళ్లిపోయారని చెబుతున్నారు. ఈ లోపు షర్మిల కు ఎంపీ పదవి ఇస్తామని తల్లికి చెప్పి మాట తప్పారన్న సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.                                      

మరో వైపు  జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితిపై తనకు ఆందోళన ఉందని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపైనా ఇదే విధంగా స్పందించారు. ఆయనకు అద్దం పంపించారు. జగన్ మానసిక స్థితిపై ఆందోళనగా ఉందన్నారు.            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP DesamHema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP DesamSIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP DesamTeam Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Vivo X Fold 3 Pro: ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Embed widget