అన్వేషించండి

ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహలకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరిగే పోరు: కవిత

కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను తెలంగాణ సమాజం హర్షించదని అభిప్రాయన్ని వ్యక్తం చేశారు కవిత. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి దిశలో దూసుకువెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చారు.

తెలంగాణ(Telangana) విషయంలో మొదటి ద్రోహి కాంగ్రెస్(Congress) పార్టీ అని అభిప్రాయపడ్డారు బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్సీ(MLC) కవిత(Kavitha). మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసిన పార్ట ఏదైనా ఉందంటే కాంగ్రెస్ మాత్రమే అన్నారు. తెలంగాణను ఏపీలో కలపడం నుంచి అనేక మంది అమరులను బలి తీసుకుందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల సమయంలో వచ్చి అన్నీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అభిప్రాయపడ్డారు. 

వరంగల్(Warangal) టూర్‌లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా ఆర్మూర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కవిత. కాంగ్రెస్ చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతి కారణంగానే చాలా ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆగిపోయాయని గుర్తు చేశారు. అలాంటి వాటిని గుర్తించి పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికి దక్కుతుందని వివరించారు. ఆర్మూర్‌లో తాను చెపట్టిన ఇరిగేషన్ పనులను మీడియాకు వివరించారు. నిండు వేసవిలో కూడా తెలంగాణలోని చెరువులు కళకళలాడుతున్నాయంటే తమ పాలనే కారణమన్నారు. 

తెలంగాణ రాష్ట్రం నాడు ఏపీలో కలవడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానంగా ఉందన్నారు కవిత. తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి కాలయాపన చేశారని మండిపడ్డారు. దీని కారణంగా అమాయకులైన ప్రజలు ప్రాణాలు తీసుకున్నారని గుర్తు చేశారు. చివరకు కేసీఆర్‌ కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడితే తప్ప తెలంగాణ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అలా ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిపై విమర్శలు ఏంటని కోప్పడ్డారు. 

కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను తెలంగాణ సమాజం హర్షించదని అభిప్రాయన్ని వ్యక్తం చేశారు కవిత. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి దిశలో దూసుకువెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చారు. కానీ పదేళ్లు ఆలస్యంగా ఇచ్చారని మండిపడ్డారు. అయినా దీక్షతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని చాలా విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 

మరింత అభివృద్ది పథంలో దూసుకెళ్తున్న తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ గోసపడతామన్నారు. కర్ణాటకలో ఇప్పుడు చీకట్లు అలముకున్నాయని చెప్పారు. అక్కడ రైతులకు కనీసం ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇక్కడ పీసీసీ  చీఫ్‌ కూడా రైతులకు 24 గంటల కరెంటు ఎందుకని ప్రశ్నించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని... అలా తీసేస్తే రైతు బంధు లాంటి పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 

అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని తమది సకలజనులు సాధించుకున్న ప్రజాతెలంగాణ అని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్యే అని అభిప్రాయపడ్డారు కవిత. తెలంగాణ వద్దని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారని గుర్తు చేశారు.  

కర్ణాటకలో  రైతులకు కేవలం ఐదు  గంటలే కరెంట్ ఇస్తున్నారని అక్కడి ప్రజల్ని మోసం చేశారని కవిత కాంగ్రెస్ మంత్రి మాటల్ని ట్వీట్ చేశారు           

 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. మొత్తం 37 స్థానాలకు మార్చి 16న ఎన్నికలు
Congress Wins Jangaon and Thorrur: లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
లక్కీడ్రాలోనూ బీఆర్ఎస్‌కు నిరాశే.. జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం
Nellore and Eluru Mayor Elections: ఈ 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు
ఈ 26న నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget