అన్వేషించండి

ఈ ఎన్నికలు తెలంగాణ ద్రోహలకు, తెలంగాణ ప్రేమికులకు మధ్య జరిగే పోరు: కవిత

కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను తెలంగాణ సమాజం హర్షించదని అభిప్రాయన్ని వ్యక్తం చేశారు కవిత. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి దిశలో దూసుకువెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చారు.

తెలంగాణ(Telangana) విషయంలో మొదటి ద్రోహి కాంగ్రెస్(Congress) పార్టీ అని అభిప్రాయపడ్డారు బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్సీ(MLC) కవిత(Kavitha). మొదటి నుంచి తెలంగాణకు అన్యాయం చేసిన పార్ట ఏదైనా ఉందంటే కాంగ్రెస్ మాత్రమే అన్నారు. తెలంగాణను ఏపీలో కలపడం నుంచి అనేక మంది అమరులను బలి తీసుకుందని విమర్శించారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల సమయంలో వచ్చి అన్నీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అభిప్రాయపడ్డారు. 

వరంగల్(Warangal) టూర్‌లో రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా ఆర్మూర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కవిత. కాంగ్రెస్ చేసిన విమర్శలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతి కారణంగానే చాలా ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆగిపోయాయని గుర్తు చేశారు. అలాంటి వాటిని గుర్తించి పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికి దక్కుతుందని వివరించారు. ఆర్మూర్‌లో తాను చెపట్టిన ఇరిగేషన్ పనులను మీడియాకు వివరించారు. నిండు వేసవిలో కూడా తెలంగాణలోని చెరువులు కళకళలాడుతున్నాయంటే తమ పాలనే కారణమన్నారు. 

తెలంగాణ రాష్ట్రం నాడు ఏపీలో కలవడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ప్రధానంగా ఉందన్నారు కవిత. తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి కాలయాపన చేశారని మండిపడ్డారు. దీని కారణంగా అమాయకులైన ప్రజలు ప్రాణాలు తీసుకున్నారని గుర్తు చేశారు. చివరకు కేసీఆర్‌ కూడా ప్రాణాలకు తెగించి కొట్లాడితే తప్ప తెలంగాణ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అలా ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిపై విమర్శలు ఏంటని కోప్పడ్డారు. 

కేసీఆర్‌పై చేస్తున్న విమర్శలను తెలంగాణ సమాజం హర్షించదని అభిప్రాయన్ని వ్యక్తం చేశారు కవిత. 2004లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే మరింత అభివృద్ధి దిశలో దూసుకువెళ్లేవాళ్లమని చెప్పుకొచ్చారు. కానీ పదేళ్లు ఆలస్యంగా ఇచ్చారని మండిపడ్డారు. అయినా దీక్షతో రాష్ట్రాన్ని కేసీఆర్‌ అభివృద్ధి చేస్తున్నారని చాలా విషయాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 

మరింత అభివృద్ది పథంలో దూసుకెళ్తున్న తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ గోసపడతామన్నారు. కర్ణాటకలో ఇప్పుడు చీకట్లు అలముకున్నాయని చెప్పారు. అక్కడ రైతులకు కనీసం ఐదు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదని తెలిపారు. ఇక్కడ పీసీసీ  చీఫ్‌ కూడా రైతులకు 24 గంటల కరెంటు ఎందుకని ప్రశ్నించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని చెబుతున్నారని... అలా తీసేస్తే రైతు బంధు లాంటి పథకాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. 

అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని తమది సకలజనులు సాధించుకున్న ప్రజాతెలంగాణ అని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్యే అని అభిప్రాయపడ్డారు కవిత. తెలంగాణ వద్దని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉన్నారని గుర్తు చేశారు.  

కర్ణాటకలో  రైతులకు కేవలం ఐదు  గంటలే కరెంట్ ఇస్తున్నారని అక్కడి ప్రజల్ని మోసం చేశారని కవిత కాంగ్రెస్ మంత్రి మాటల్ని ట్వీట్ చేశారు           

 

 

టాప్ హెడ్ లైన్స్

Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanuman Temple Tragedy: మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలోని విషాదం.. ఆలయ మండపం కూలి ఏడుగురు భక్తులు మృతి, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ !
NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Barmer Instagram Influencer Murder Case: నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
నలుగురు పిల్లల తల్లి - ఇన్ స్టా లవర్‌తో కలిసి భర్తను చంపి వాటర్ ట్యాంక్‌లో పడేసింది !
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Rukmini Vasanth: ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
ముగ్గురు అరెస్ట్... రుక్మిణీ వసంత్ ఫేక్ బికినీ వీడియో కేసులో లేటెస్ట్ అప్డేట్
Embed widget