అన్వేషించండి

పశ్చిమ ఎమ్మెల్సీ ఫలితంపై తెగని ఉత్కంఠ- సాయంత్రానికి వచ్చే ఛాన్స్

పశ్చిమ రాయలసీమలో పట్టు ఎవరికీ చిక్కడం లేదు. విజయం వైసీపీ, టీడీపీ మధ్య దోబూచులాడుతోంది. ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

పశ్చిమ రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ వీడటం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. 

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు  అనంతపురం జిల్లా జెఎన్టీయూలో కొనసాుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు సంఖ్య 3,33,184 ఉంటే... 2,45,687 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్స్ లో పడిన ఓట్లలో 2,26,448 మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. 19,239 ఓట్లు చెల్లకుండా పోయాయి. 

పశ్చిమ రాయలసీమలో నమోదైన ఓట్ల ప్రకారం... అభ్యర్థి ఎవరైనా గెలవాలంటే మాత్రం 1,13,225 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ రావాలి. 48 గంటలుగా ఓట్లు లెక్కిస్తున్న అధికారులు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆధార పడాల్సి వచ్చింది. దీని ప్రకారం రెండు ప్రయార్టీలో వైసీపీ అభ్యర్థి 17256 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు... అదే టైంలో టిడిపికి అభ్యర్థి రాంభూపాల్ రెడ్డికి 19076 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడుస్తంది. 

మొదటి ప్రయారిటీ ఓట్ల లెక్కింపుల్లో ఏ అభ్యర్థికి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రయారిటీ ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రారంబించారు. ఉదయం 6 గంటల నుంచి రెండు ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అప్పటి నుంచి అందరూ తీవ్ర ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. 

పశ్చమ రాయలసీమ అంటే కడప - అనంతపురము - కర్నూలు జిల్లాల్లోని పట్టభద్రులంతా ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ విజయంతో ఇక్కడి ప్రజల నాడి తెలుస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలపై అందరి ఫోకస్ ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్‌ అధికారు భాస్కర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. 


ఇప్పటికే తెలుగుదేశం రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో జయకేతనం ఎగరేసింది. ఆ పార్టీ అభ్యర్థులు చిరంజీవి, శ్రీకాంత్ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు పశ్చిమ రాయలసీమలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. 

గెలిచిన టీడీపీ అభ్యర్థల మొదటి రియాక్షన్ ఇదే!


ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ...  తన విజయాన్ని లోకేష్‌కు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. తనను అభ్యర్థగా నిలబెట్టిన చంద్రబాబుకు, తన విజయానికి శ్రమించిన కార్యకర్తలకు పాదభివందనం చేశారు. పట్టభద్రులు తమ అసంతృప్తిని ఓట్ల రూపంలో చూపించారని అన్నారు. టీడీపీ జైత్రయాత్ర ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. సైకిల్ వేగానికి ఫ్యాన్ తట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ విజయం సాధించలేకపోయిందని ప్రజలు తమవైపు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జెండా ఎగురుతుందన్నారు. 

తన దగ్గర చదువుకున్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తనను గెలిపించారు అన్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వేపాడ చిరంజీవి. తన సేవలు నచ్చడం. వారు తనపై విశ్వాసం ఉంచడం వల్లే  తాను గెలిచినట్లు చెప్పిన వేపాడ ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు ఈ ఎన్నిక తో రుజువైంది అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget