అన్వేషించండి

పశ్చిమ ఎమ్మెల్సీ ఫలితంపై తెగని ఉత్కంఠ- సాయంత్రానికి వచ్చే ఛాన్స్

పశ్చిమ రాయలసీమలో పట్టు ఎవరికీ చిక్కడం లేదు. విజయం వైసీపీ, టీడీపీ మధ్య దోబూచులాడుతోంది. ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది.

పశ్చిమ రాయలసీమలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ వీడటం లేదు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. 

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు  అనంతపురం జిల్లా జెఎన్టీయూలో కొనసాుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం ఓట్లు సంఖ్య 3,33,184 ఉంటే... 2,45,687 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్స్ లో పడిన ఓట్లలో 2,26,448 మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. 19,239 ఓట్లు చెల్లకుండా పోయాయి. 

పశ్చిమ రాయలసీమలో నమోదైన ఓట్ల ప్రకారం... అభ్యర్థి ఎవరైనా గెలవాలంటే మాత్రం 1,13,225 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ రావాలి. 48 గంటలుగా ఓట్లు లెక్కిస్తున్న అధికారులు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై ఆధార పడాల్సి వచ్చింది. దీని ప్రకారం రెండు ప్రయార్టీలో వైసీపీ అభ్యర్థి 17256 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు... అదే టైంలో టిడిపికి అభ్యర్థి రాంభూపాల్ రెడ్డికి 19076 ఓట్లు వస్తే విజయం సాధిస్తారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడుస్తంది. 

మొదటి ప్రయారిటీ ఓట్ల లెక్కింపుల్లో ఏ అభ్యర్థికి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రయారిటీ ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ప్రారంబించారు. ఉదయం 6 గంటల నుంచి రెండు ప్రయారిటీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అప్పటి నుంచి అందరూ తీవ్ర ఉత్కంఠగా ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. 

పశ్చమ రాయలసీమ అంటే కడప - అనంతపురము - కర్నూలు జిల్లాల్లోని పట్టభద్రులంతా ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ విజయంతో ఇక్కడి ప్రజల నాడి తెలుస్తుందని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలపై అందరి ఫోకస్ ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు ఐఏఎస్‌ అధికారు భాస్కర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. 


ఇప్పటికే తెలుగుదేశం రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో జయకేతనం ఎగరేసింది. ఆ పార్టీ అభ్యర్థులు చిరంజీవి, శ్రీకాంత్ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు పశ్చిమ రాయలసీమలో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తుంది. 

గెలిచిన టీడీపీ అభ్యర్థల మొదటి రియాక్షన్ ఇదే!


ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు నియోజకవర్గ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ...  తన విజయాన్ని లోకేష్‌కు అంకితం ఇస్తున్నట్టు చెప్పారు. తనను అభ్యర్థగా నిలబెట్టిన చంద్రబాబుకు, తన విజయానికి శ్రమించిన కార్యకర్తలకు పాదభివందనం చేశారు. పట్టభద్రులు తమ అసంతృప్తిని ఓట్ల రూపంలో చూపించారని అన్నారు. టీడీపీ జైత్రయాత్ర ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. సైకిల్ వేగానికి ఫ్యాన్ తట్టుకోలేకపోయిందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ విజయం సాధించలేకపోయిందని ప్రజలు తమవైపు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ జెండా ఎగురుతుందన్నారు. 

తన దగ్గర చదువుకున్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తనను గెలిపించారు అన్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వేపాడ చిరంజీవి. తన సేవలు నచ్చడం. వారు తనపై విశ్వాసం ఉంచడం వల్లే  తాను గెలిచినట్లు చెప్పిన వేపాడ ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు ఈ ఎన్నిక తో రుజువైంది అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget