అన్వేషించండి

AP Election Results: జూన్ 4న ఆ టైమ్ వరకు ఏపీ ఎన్నికల తుది ఫలితాలపై క్లారిటీ: ముకేష్ కుమార్ మీనా

AP Assembly Elections 2024: జూన్ 4న ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం చేసినట్లు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా వివరించారు.

AP CEO Mukesh Kumar Meena | అమరావతి: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్లు నియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఓట్ల లెక్కింపునకు నియోజక వర్గాల నుంచి వారీగా చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. 

కౌంటింగ్ కోసం పటిష్ట ఏర్పాట్లు 
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలోని మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు కౌంటింగ్ జరగనుంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా ఓట్ల లెక్కింపు కొనసాగేలా ప్రణాళిక సిద్దం చేశారు. 

సాయంత్రం 6 లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి 
111 నియోజక వర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు, మిగతా 3 స్థానాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని చెప్పారు. టేబుళ్లను పెంచి పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు సకాలంలో లెక్కింపు పూర్తి చేస్తామన్నారు. అదేరోజు రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు 
ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల హింసాత్మక  ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఓట్ల లెక్కింపు రోజు అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుతో పాటు సీనియర్ అధికారులను నియమించాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో డిజీపీతో పాటు నేను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించాం. అధికారులతో సమీక్షి నిర్వహించి వారిని అప్రమత్తం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో పర్యటిస్తూ ఓట్ల లెక్కింపునకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించినట్లు’ వివరించారు. ఏపీ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్. బాగ్చీ మాట్లాడుతూ.. జూన్ 4 న ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేయడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ మాట్లాడుతూ.. ఏపీకి సమర్థవంతమైన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉన్నారని, ఆయన నేతృత్వంలో ఈసీ మార్గదర్శకాలతో ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అన్ని నియోజక  వర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే పీసీ, ఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి, 21ఇ లను అదే రోజు ఫ్లైట్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్లలో కూలీల సేవల వినియోగంపై ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి, అనుమతించాలని.. ముఖ్యంగా అల్లర్లు జరిగిన జిల్లాలోని అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shreyas Iyer Captaincy Record: శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు - ఐపీఎల్ లో కెప్టెన్ గా ధోనీ, గంభీర్, కోహ్లీ, రోహిత్ స‌ర‌స‌న చేరిక‌
శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు - ఐపీఎల్ లో కెప్టెన్ గా ధోనీ, గంభీర్, కోహ్లీ, రోహిత్ స‌ర‌స‌న చేరిక‌
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
కంటెంట్ క్రియేటర్‌గా నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shreyas Iyer Captaincy Record: శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు - ఐపీఎల్ లో కెప్టెన్ గా ధోనీ, గంభీర్, కోహ్లీ, రోహిత్ స‌ర‌స‌న చేరిక‌
శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డు - ఐపీఎల్ లో కెప్టెన్ గా ధోనీ, గంభీర్, కోహ్లీ, రోహిత్ స‌ర‌స‌న చేరిక‌
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
కంటెంట్ క్రియేటర్‌గా నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
Horror Thriller OTT : ఊరిలో చేతబడులతో వరుస హత్యలు - ఎవరూ ఊహించని క్లైమాక్స్... ఓటీటీలో వీకెండ్ హారర్ థ్రిల్లర్
ఊరిలో చేతబడులతో వరుస హత్యలు - ఎవరూ ఊహించని క్లైమాక్స్... ఓటీటీలో వీకెండ్ హారర్ థ్రిల్లర్
Embed widget