అన్వేషించండి

AP Election Results: జూన్ 4న ఆ టైమ్ వరకు ఏపీ ఎన్నికల తుది ఫలితాలపై క్లారిటీ: ముకేష్ కుమార్ మీనా

AP Assembly Elections 2024: జూన్ 4న ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధం చేసినట్లు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా వివరించారు.

AP CEO Mukesh Kumar Meena | అమరావతి: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించేందుకు అవసరమైన ప్రధాన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్లు నియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. న్యూఢిల్లీ నిర్వచన్ సదన్ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఓట్ల లెక్కింపునకు నియోజక వర్గాల నుంచి వారీగా చేస్తున్న ఏర్పాట్లపై సమీక్షించారు. 

కౌంటింగ్ కోసం పటిష్ట ఏర్పాట్లు 
ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  రాష్ట్రంలోని మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాల్లో 111 నియోజక వర్గాల్లో 20 రౌండ్ల లోపు, 61 నియోజకవర్గాల్లో 21 నుండి 24 రౌండ్ల లోపు కౌంటింగ్ జరగనుంది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైగా ఓట్ల లెక్కింపు కొనసాగేలా ప్రణాళిక సిద్దం చేశారు. 

సాయంత్రం 6 లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి 
111 నియోజక వర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల్లోపు, 61 నియోజక వర్గాల్లో సాయంత్రం 4.00 గంటల్లోపు, మిగతా 3 స్థానాల్లో సాయంత్రం 6.00 గంటల్లోపు ఓట్ల లెక్కింపు పూర్తి అవుతుందని చెప్పారు. టేబుళ్లను పెంచి పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు సకాలంలో లెక్కింపు పూర్తి చేస్తామన్నారు. అదేరోజు రాత్రి 8–9 గంటల మద్య అన్ని నియోజక వర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు 
ముకేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. ‘ఎన్నికల సమయంలో కొన్నిచోట్ల హింసాత్మక  ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఓట్ల లెక్కింపు రోజు అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలుతో పాటు సీనియర్ అధికారులను నియమించాం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో డిజీపీతో పాటు నేను స్వయంగా పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించాం. అధికారులతో సమీక్షి నిర్వహించి వారిని అప్రమత్తం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో పర్యటిస్తూ ఓట్ల లెక్కింపునకు, శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించినట్లు’ వివరించారు. ఏపీ పోలీస్ నోడల్ ఆఫీసర్, అడిషనల్ డీజీ ఎస్. బాగ్చీ మాట్లాడుతూ.. జూన్ 4 న ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల ఎస్పీలను, సీపీలను అప్రమ్తతం చేయడంతో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ మాట్లాడుతూ.. ఏపీకి సమర్థవంతమైన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఉన్నారని, ఆయన నేతృత్వంలో ఈసీ మార్గదర్శకాలతో ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అన్ని నియోజక  వర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే పీసీ, ఏసీ ఫలితాల ప్రకటనకు సంబంధించిన ఫారం-21 సి, 21ఇ లను అదే రోజు ఫ్లైట్ లో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్లలో కూలీల సేవల వినియోగంపై ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తింపు కార్డులు ఉన్నవారినే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి, అనుమతించాలని.. ముఖ్యంగా అల్లర్లు జరిగిన జిల్లాలోని అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Embed widget