అన్వేషించండి

AP Assembly Election 2024 Voting live updates: కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత- బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి 

Ap Assembly Elections 2024: రాష్ట్రంలో ఓట్ల పండుగకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం మాక్ పోలింగ్ అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Key Events
andhra pradesh assembly election 2024 polling live updates AP Assembly Election 2024 Voting live updates: కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత- బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి 
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు లైవ్ అప్ డేట్స్

Background

Andhra Pradesh Assembly Election 2024 Polling Live Updates: ఏపీలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకూ.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అయితే, ఎన్నికల సంఘం నిర్దేశించిన టైం లోపల క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. తొలుత మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ఇదీ ముఖచిత్రం

  • ఏపీలో అసెంబ్లీ స్థానాలు - 175
  • లోక్ సభ స్థానాలు - 25
  • మొత్తం ఓటర్లు - 4.14 కోట్లు, పురుషులు - 2.3 కోట్లు, మహిళలు - 2.10 కోట్లు
  • థర్ట్ జెండర్ ఓటర్లు - 3,421, సర్వీస్ ఓటర్లు - 68,185
  • 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్
  • అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్
  • పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. 
  • మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, 1.6 లక్షల ఈవీఎంల వినియోగం.

అటు, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, వేసవి దృష్ట్యా ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్ల సౌకర్యం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచింది.

పటిష్ట భద్రత

పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను సైతం ఎన్నికల సంఘం భద్రతకు వినియోగిస్తోంది. మొత్తం 3.30 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1.14 లక్షల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.

ఈ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్

రాష్ట్రవ్యాప్తంగా 30,111 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 12,459 కేంద్రాలను సెన్సిటివ్ గా ఈసీ గుర్తించింది. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాత వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అనంత, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వంద శాతం పోలింగ్ కేేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ సాగనుంది. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని.. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. జూన్ 1వ తేదీ వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని.. మొత్తం 36 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు మానిటరింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు, 25 లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరుగురు పోటీ చేస్తున్నారు. ఇక, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా విశాఖలో 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా, ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు.

ఈ రూల్స్ పాటించాలి

  • మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చెయ్యొచ్చు.
  • స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదు. ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు.
  • పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికీ 3 వాహనాలకు అనుమతిస్తారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు
  • ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.

ఈసారి ఓటింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు భారీగా తరలివస్తుండడంతో 83 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. 2019 ఎన్నికల్లో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగేలా ఈసీ చర్యలు చేపట్టింది.

21:29 PM (IST)  •  13 May 2024

కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత, బీజేపీ వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి 

కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు గాయం అయినట్లు సమాచారం. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. జమ్మలమడుగు టిడిపి ఆఫీస్ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పలువురు ముఖ్య నేతలను దేవగుడి గ్రామానికి తరలించారు పోలీసులు. 

21:24 PM (IST)  •  13 May 2024

ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్ సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ ఏపీ ఎన్నికలపై స్పందించారు. రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు వైఎస్సార్ సీపీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అభినందనలు అని ట్వీట్ చేశారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam
Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget