అన్వేషించండి

AP Assembly Election 2024 Voting live updates: కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత- బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి 

Ap Assembly Elections 2024: రాష్ట్రంలో ఓట్ల పండుగకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం మాక్ పోలింగ్ అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

LIVE

Key Events
AP Assembly Election 2024 Voting live updates: కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత- బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి 

Background

Andhra Pradesh Assembly Election 2024 Polling Live Updates: ఏపీలో పోలింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకూ.. పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. అయితే, ఎన్నికల సంఘం నిర్దేశించిన టైం లోపల క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. తొలుత మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

ఇదీ ముఖచిత్రం

  • ఏపీలో అసెంబ్లీ స్థానాలు - 175
  • లోక్ సభ స్థానాలు - 25
  • మొత్తం ఓటర్లు - 4.14 కోట్లు, పురుషులు - 2.3 కోట్లు, మహిళలు - 2.10 కోట్లు
  • థర్ట్ జెండర్ ఓటర్లు - 3,421, సర్వీస్ ఓటర్లు - 68,185
  • 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకూ పోలింగ్
  • అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్
  • పాలకొండ, కురుపాం, సాలూరులో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. 
  • మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, 1.6 లక్షల ఈవీఎంల వినియోగం.

అటు, అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, వేసవి దృష్ట్యా ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్ల సౌకర్యం, ప్రాథమిక చికిత్సకు సంబంధించి మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచింది.

పటిష్ట భద్రత

పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను సైతం ఎన్నికల సంఘం భద్రతకు వినియోగిస్తోంది. మొత్తం 3.30 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. 1.14 లక్షల మంది పోలీసులను భద్రత కోసం వినియోగిస్తున్నారు. వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు. రాష్ట్రవ్యాప్తంగా 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.

ఈ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్

రాష్ట్రవ్యాప్తంగా 30,111 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సంఘం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 12,459 కేంద్రాలను సెన్సిటివ్ గా ఈసీ గుర్తించింది. మాచర్ల సహా 14 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వంద శాత వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. అనంత, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వంద శాతం పోలింగ్ కేేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ ప్రక్రియ సాగనుంది. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని.. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. జూన్ 1వ తేదీ వరకూ ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని వెల్లడించారు. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని.. మొత్తం 36 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలు మానిటరింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు, 25 లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యల్పంగా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరుగురు పోటీ చేస్తున్నారు. ఇక, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి అత్యధికంగా విశాఖలో 33 మంది అభ్యర్థులు, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా, ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల్లో 2 కంటే ఎక్కువ బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు.

ఈ రూల్స్ పాటించాలి

  • మాక్ పోలింగ్ అనంతరం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చెయ్యొచ్చు.
  • స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదు. ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు. పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదు.
  • పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికీ 3 వాహనాలకు అనుమతిస్తారు. ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు
  • ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది.

ఈసారి ఓటింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు భారీగా తరలివస్తుండడంతో 83 శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. 2019 ఎన్నికల్లో 79.84 శాతం మేర పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగేలా ఈసీ చర్యలు చేపట్టింది.

21:29 PM (IST)  •  13 May 2024

కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత, బీజేపీ వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి 

కడప జిల్లా జమ్మలమడుగు లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తున్న సమయంలో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పట్టణ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో పోలింగ్ బూత్ 116, 117 లో బిజెపి, వైసిపి వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఈ రాళ్ల దాడిలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తలకు గాయం అయినట్లు సమాచారం. మరోవైపు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి వాహన అద్దాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. జమ్మలమడుగు టిడిపి ఆఫీస్ వద్దకు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఆదినారాయణ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని పలువురు ముఖ్య నేతలను దేవగుడి గ్రామానికి తరలించారు పోలీసులు. 

21:24 PM (IST)  •  13 May 2024

ఏపీ ప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేష్

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్ సభ స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ముగిసిన తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేష్ ఏపీ ఎన్నికలపై స్పందించారు. రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు వైఎస్సార్ సీపీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అభినందనలు అని ట్వీట్ చేశారు.

18:31 PM (IST)  •  13 May 2024

ఏపీలో ముగిసిన పోలింగ్ ప్రక్రియ - చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతం

ఏపీలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. పలుచోట్ల చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సాయంత్రం 6 గంటల వరకూ 75 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55 శాతం ఓటింగ్ నమోదైంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో ఓటు వేసేందుకు నిల్చున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు, సమస్యాత్మక ప్రాంతాల్లో 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగియగా.. మిగిలిన నియోజకవర్గాల్లో 6 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్న వారిని ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది అనుమతిస్తున్నారు. గత ఎన్నికల్లో 79.08 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. చివరి గంటల్లో పోలింగ్ ఊపందుకుంది.

17:58 PM (IST)  •  13 May 2024

విజయవాడ పోరంకిలో తీవ్ర ఉద్రిక్తత

విజయవాడలోని పోరంకి పోలింగ్ కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా.. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. టీడీపీ తీరుపై వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

17:51 PM (IST)  •  13 May 2024

కావలిలో ఉద్రిక్త పరిస్థితి

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం అల్లూరు మండలం బీరంగుంటలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు పడుతున్నాయనే అనుమానంతో ఏఎంసీ మాజీ ఛైర్మన్ సుకుమార్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుచరులతో వచ్చిన ఆయన.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడికి దిగారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Virat Kohli: అనుష్క!  నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Sonarika Bhadoria : దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి  సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
దేవకన్యలా ఉన్న స్మాల్ స్క్రీన్ పార్వతి సోనారికా భడోరియా - మళ్లీ టాలీవుడ్ కి ఎప్పుడొస్తుందో!
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Embed widget