News
News
వీడియోలు ఆటలు
X

మే 10 నుంచి ఇంటర్ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు అవకాశం!

ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు.

FOLLOW US: 
Share:

ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అవకాశం కల్పిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. మే 10 నుంచి నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం కూడా విద్యార్థులు మే 10 నుంచి 16 వరకు ఫీజు చెల్లించాలని నవీన్ మిట్టర్ కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌలభ్యం కోసం టెలిమానస్ హెల్ప్ లైన్ 14416 నెంబరు అందుబాటులో ఉందని, సంప్రదించవచ్చని నవీన్ మిట్టల్ కోరారు.

జూన్ 4 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు...
ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆమె సూచించారు. ముఖ్యంగా సెకండియర్ విద్యార్థులు టెన్షన్ పడొద్దని, తల్లిదండ్రులు కూడా వారి పరిస్థితి అర్థం చేసుకోవాలని, పిల్లలపై కోపడవద్దని కోరారు. 

ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

తెలంగాణలో ఎంసెట్ వార్షిక పరీక్షల ఫలితాలు మే 9న విడుదలైన సంగతి తెలిసిందే. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.  ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, సెకండియర్‌లో 67.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్‌-ఎ వచ్చింది. ఇక 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్‌-బి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో మొత్తం 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు.

జిల్లాలవారీగా చూస్తే ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ (75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి. అదేవిధంగా సెకండియర్‌ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %),  మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడుస్థానాల్లో నిలిచాయి.

తెలంగాణలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 5 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.47 లక్షళ మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో మొదటి సంవత్సరం 4,33,082 మంది రాస్తే 2,72,208 మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో 62.85 శాతం మంది పాస్ అయ్యారు. ఇందులో ఏ గ్రేడ్‌ లక్షా 60 వేల మందికి వస్తే బి గ్రేడ్‌ 68వేల 330 మంది పాస్‌ అయ్యారు. బాలికలు 2,17454 మంది పరీక్ష రాస్తే లక్షా 1,49729 మంది పాస్ అయ్యారు. 

తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. 

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Also Read:

జూన్ 2 నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ విడుదల
ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభత్వ పరీక్షల విభాగం టైమ్ టేబుల్ ను విడుదల చేసింది. అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసే వాళ్లు ఈనెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. జూన్ 2వ తేదీన తెలుగు, 3వ తేదీన హిందీ, 5వ తేదీన ఇంగ్లీష్, 6వ తేదీన గణితం, 7వ తేదీన సైన్స్, 8వ తేదీన సాంఘీక శాస్త్రం పరీక్షలు జరుగుతాయని వివరించింది. కాంపోజిట్ విద్యార్థులకు పేపర్-2, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-1, 10వ తేదీన ఓపెన్ స్కూల్ విద్యార్థులకు పేపర్-2 పరీక్షలు జరుగుతాయని పేర్కంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
https://telugu.abplive.com/news/ap-10th-supplementary-exams-andhra-pradesh-ssc-supplementary-exams-start-s-from-june-2nd-92097

Published at : 09 May 2023 12:30 PM (IST) Tags: Education News in Telugu TS Inter Revaluation TS Inter Recounting TS Inter Revaluation Application TS Inter Recounting Application

సంబంధిత కథనాలు

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: కోరుకున్న సీట్లు రాలేదని టికెట్లు క్యాన్సిల్, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: కోరుకున్న సీట్లు రాలేదని టికెట్లు క్యాన్సిల్, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్